మధ్యలో కొంత కాలం విరామం తీసుకున్న తర్వాత, మళ్లీ కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా రేపు విడుదల అవుతోంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ పోలీస్ పాత్రలో నటించడం ఇది మొదటిసారి కాదు. విజయ్ హీరోగా నటించిన జిల్లా సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ పోలీస్ పాత్రలో నటించారు. కానీ ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ సినిమా కోసం కాజల్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.

చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కాజల్ నటిస్తున్న సినిమా ఇదే అవ్వడంతో, భారీగా అంచనాలు నెలకొన్నాయి. సినిమా ట్రైలర్ కూడా ఆసక్తిని ఇంకా పెంచింది. సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బృందం యు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 14 నిమిషాలుగా ఈ సినిమా రన్ టైం ఉన్నట్టు చెప్పారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది తక్కువ రన్ టైం. సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు సెన్సార్ బృందం తెలిపారు అనే వార్తలు వస్తున్నాయి. సినిమాలో కాజల్ చాలా బాగా నటించారు అని అంటున్నారు. కాజల్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది అని ఈ సెన్సార్ బృందం వాళ్ళు సినిమా చూసి చెప్పినట్టు సమాచారం.
సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఆడవారి మీద జరిగే విషయాల మీద ఈ సినిమా నడుస్తున్నట్టు తెలుస్తోంది. కాజల్ ఈ సినిమా కోసం పోరాటాలు కూడా చేశారు. సినిమాలో సీన్స్ బాగా రావడం కోసం సినిమా బృందం అంతా ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని కాజల్ ఇంటర్వ్యూలలో చెప్తుంటే, ఒక సీన్ సరిగ్గా రావడానికి ఇంత కష్టం ఉంటుందా అని అనిపించింది. సుమన్ చిక్కల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, గూడచారి వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ప్రస్తుతం సినిమా బృందం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు.




బాలకృష్ణ ఈ మూవీ షూటింగ్ విషయంలో సీనియర్ హీరోలైన కృష్ణ, కృష్ణంరాజులకు చెందిన పార్ట్ ను ముందుగా చేద్దామని చెప్పడంట. అయితే ఆ పార్ట్ షూటింగ్ అండమాన్ దీవుల్లో ప్లాన్ చేయడంతో కుటుంబాలతో ట్రిప్ లగా సరదాగా ఉంటుందని ముగ్గురు హీరోలు తమ ఫ్యామిలీలను తీసుకొని అండమాన్ కి వెళ్లారంట. అక్కడి లొకేషన్లు బాగున్నా, ఉండేందుకు రాజీవ్ గాంధీ గెస్ట్ హౌజ్ మాత్రమే ఉందంట. తప్పక అందులోనే అందరూ అడ్జస్ట్ అయ్యారంట. ఇక అక్కడ తినడానికి ఆహారం కూడా దొరికలేదంట. వెళ్లిన రోజు తమతో పాటు తీసుకెళ్లిన బిస్కేట్లు, చిరుతిండ్లతో గడిపారంట
మరుసటి రోజు ఎక్కడి నుండో రైస్, కూరగాయలు తెప్పించుకున్నారంట. వాటితో విజయ నిర్మలగారు అద్భుతంగా వంట చేయడంతో అందరు తిన్నారట. ఇక బాలయ్య చేపలని వేటాడీ తీసుకు రావడంతో విజయ నిర్మల వాటితో చేపల పులుసు చేసిందంట. ఆ చేపల పులుసు అద్భుతంగా ఉండడంతో మూవీ యూనిట్ అందరికి రుచి చూపించారంట. అందరు లొట్టలేసుకుంటూ తిన్నారట. దాంతో తెలుగు ఇండస్ట్రీలో విజయనిర్మల గారి చేపల పులుసు ఫేమస్ అయ్యింది.
Also Read:
దుల్కర్ సల్మాన్ 2012లో ‘సెకండ్ షో’ అనే మలయాళ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది దుల్కర్ రెండవ సినిమా ‘ఉస్తాద్ హోటల్’ లో నటించాడు. ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. అన్వర్ రషీద్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2012కి గాను మూడు జాతీయ అవార్డులు అందుకుంది. ‘బెస్ట్ పాపులర్ సినిమా , బెస్ట్ డైలాగ్స్, యాక్టర్ తిలకన్ కి ప్రత్యేక అవార్డు వచ్చింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుని, భారీ కలెక్షన్స్ సాధించి, కమర్షియల్ గా విజయం సాధించింది. ఈ మూవీని తెలుగులో ‘జనతాహోటల్’ గా డబ్ చేసి, 2018 లో రిలీజ్ చేశారు.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఫైజల్ (దుల్కర్ సల్మాన్) నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన అబ్బాయి కావడంతో అతని తండ్రి, అక్కలు అల్లారుముద్దుగా పెంచుతారు. ఫైజల్ కి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. దాంతో తండ్రికి తెలియకుండా విదేశాల్లో హోటల్ మేనేజ్ మెంట్ చేశాడు. కానీ ఫైజల్ తండ్రి అతనితో స్టార్ హోటల్ పెట్టించాలని భావిస్తాడు. ఫైజల్ కి తండ్రి షహానా (నిత్యామీనన్)తో పెళ్ళిచూపులు ఏర్పాటుచేస్తాడు. ఆ సమయంలో ఫైజల్ హోటల్ మేనేజ్ మెంట్ గురించి బయటపడుతుంది.
దాంతో ఫైజల్ ను తండ్రి పాస్ పోర్ట్ తీసుకుని, ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు. అప్పుడు ఫైజల్ తాతయ్య కరీంభాయ్ వద్దకు వెళ్ళి, ఆయన నడిపే “ఉస్తాద్ హోటల్”లో పనిచేస్తూ, డూప్లికేట్ పాస్ పోర్ట్ కు అప్లై చేసి, ఎదురుచూస్తుంటాడు. ఆ తరువాత తాత సహాయంతో బీచ్ బే అనే ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ గా జాయిన్ అవుతాడు. అక్కడ బీచ్ బే తమ హోటల్ ను విస్తరించడం కోసం “ఉస్తాద్ హోటల్”ను ఆక్రమించుకోబోతుందని తెలుసుకుంటాడు.
ఉస్తాద్ హోటల్ ను ఫైజల్ ఎలా కాపాడాడు ? తాత దగ్గర ఏం నేర్చుకుంటాడు ? చివరికి ఫైజల్ అనుకున్నట్టు విదేశాలకి వెళ్లాడా? లేదా అనేది మిగిలిన కథ. ఈ చిత్రంలో దుల్కర్ ఫైజల్ పాత్రలో ఒదిగిపోయారు. ఉస్తాద్ హోటల్ యాజమానిగా, ఫైజల్ తాతగా యాక్టర్ తిలకన్ జీవించారు. నిత్యామీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటు ఉంది.

నటి నిషా నూర్ తన గ్లామర్తో 1980లో సిల్వర్ స్క్రీన్ ను మరింత అందంగా మార్చింది. ఆమె తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాలలో నటిస్తూ దక్షణాదిలో స్టార్ హీరోయిన్గా రాణించింది. కమల్ హాసన్, రజనీకాంత్, భాను చందర్ లాంటి పెద్ద హీరోలతో నటించింది. అగ్ర దర్శకులు అయిన బాలచందర్, భారతీరాజా విసు, చంద్రశేఖర్ లాంటి వారితో పని చేసింది. కమల్ హాసన్ తో కలిసి ‘టిక్ టిక్ టిక్’ అనే సినిమాలో, రాజేంద్రప్రసాద్, మమ్ముట్టి, మోహన్లాల్తో పలు సినిమాలు చేసింది.
తన గ్లామర్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ 1995 అనంతరం నిషా నూర్ కు ఒక్క మూవీలో కూడా అవకాశం రాలేదు. అప్పటివరకు స్టార్ స్టేటస్ పొందిన నిషా నూర్ అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించినప్పటికీ, ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో సినిమాలని వదిలిపెట్టింది. అయితే సంపాదించిన డబ్బు మొత్తం కరిగిపోవడం మొదలైంది. బతకడం కోసం పని చేయాలి. కానీ ఆమె తప్పు దారిని ఎంచుకుని, వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది.
అయితే ఒక ప్రొడ్యూసర్ వల్లే ఆ వృత్తిలోకి వెళ్ళిందనే వార్త అప్పట్లో వచ్చాయి. ఆదుకునేవారు లేకపోవడం వల్ల నిషా నూర్ అందులోనే ఉండిపోయింది. ఆమెకు తలదాచుకునే స్థలం కూడా లేక ఒక సమయంలో ఒక దర్గా బయట నిద్రించింది. ఆమె పరిస్థితి తెలిసి, ఆదుకోవడానికి ఒక తమిళ ఎన్జీవో ముందుకు వచ్చి, నిషా నూర్ కు వైద్య పరీక్షలు చేయించడంతో ఆమెకు ఎయిడ్స్ ఉన్నట్లుగా తెలిసింది. ఆ వ్యాధితో పోరాడుతూ హాస్పటల్ లోనే నిషా నూర్ 2007లో అనాధలా మరణించింది.
