ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు ఇవాళ తుది శ్వాస విడిచారు. రెండు రోజులుగా అస్వస్థత కారణంగా వెంటిలేటర్ మీద ఉన్నారు. చిన్న వ్యాపారంతో తన జీవితాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. రామోజీ గ్రూప్ పేరుతో ఈనాడు న్యూస్ పేపర్, ఈటీవీ, ఉషాకిరణ్ మూవీస్, ప్రియా ఫుడ్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, రామోజీ ఫిలిం సిటీతో పాటు, కళాంజలి, బ్రిసా వంటి బ్రాండ్స్ కూడా రామోజీరావు గారు ఆవిష్కరించారు.
ఈటీవీ 8 భాషల్లో ప్రసారం అవుతుంది. రామోజీ ఫిలిం సిటీ అయితే సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించింది. ఎన్నో సేవలు అందిస్తోంది కూడా. ఒకరకంగా చెప్పాలి అంటే, రామోజీ ఫిలిం సిటీ లేకపోతే బాహుబలి సినిమా తీయడానికి చాలా కష్టం అయ్యేది అని సినిమా బృందం ఎన్నోసార్లు చెప్పారు. అది నిజం అనిపిస్తుంది. అయితే, ఉషాకిరణ్ మూవీస్ ద్వారా రామోజీ రావు గారు ఎంతో మంది నటులని పరిచయం చేశారు. వారిలో ఇప్పుడు స్టార్ నటులుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 ఉదయ్ కిరణ్
చిత్రం సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
#2 జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నిన్ను చూడాలని సినిమాని ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ వాళ్ళు నిర్మించారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా.
#3 తరుణ్
హీరో తరుణ్ నటించిన నువ్వేకావాలి సినిమాని కూడా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు నిర్మించారు.
#4 శ్రియ
హీరోయిన్ శ్రియ మొదటి సినిమా ఇష్టం. ఈ సినిమాని కూడా ఉషా కిరణ్ మూవీస్ వాళ్లే నిర్మించారు.
#5 ప్రకాష్ కోవెలమూడి
ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారి కొడుకు, ప్రకాష్ కోవెలమూడి నటించిన మొదటి సినిమా నీతో సినిమాని కూడా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు.
#6 రితీష్ దేశ్ముఖ్
ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేశారు. రితీష్ దేశ్ముఖ్ హీరోగా నటించిన మొదటి సినిమా అయిన తుజే మేరీ కసం సినిమాని ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఇది నువ్వే కావాలి సినిమా రీమేక్.
#7 కళ్యాణ్ రామ్
నందమూరి కళ్యాణ్ రామ్ మొదటి సినిమా తొలిచూపులోనే సినిమాకి ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మాతలుగా వ్యవహరించారు.
#8 తనీష్
చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తనీష్, హీరోగా నటించిన మొదటి సినిమా నచ్చావులే. ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాతోనే తనీష్ హీరోగా పరిచయం అయ్యారు.
#9 రిచా పల్లోడ్
ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించిన నువ్వే కావాలి సినిమాతోనే రిచా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
#10 మాధవి లత
నచ్చావులే సినిమాతోనే మాధవి లత హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టారు.
కేవలం నటులని మాత్రమే కాదు. ఎంతో మంది సాంకేతిక నిపుణులని కూడా ఉషాకిరణ్ మూవీస్ వారు పరిచయం చేశారు.

















కోల్ కతాలో జన్మించిన రచన అసలు పేరు జుం జుం బెనర్జీ. సినిమాల్లోకి వచ్చాక తన పేరును రచనగా మార్చుకుంది. ఆమె తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, ఒడియా భాషలలో హీరోయిన్ గా చేసింది. దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ నేను ప్రేమిస్తున్నాను సినిమా ద్వారా రచన తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ అవడంతో తెలుగులో రచనకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా ఆమె కన్యాదానం, బావగారు బాగున్నారా, పవిత్ర ప్రేమ, రాయుడు, సుల్తాన్, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాలలో నటించి గుర్తింపు సంపాదించుకుంది.
వెంకటేష్ హీరోగా వచ్చిన సూర్యవంశం మూవీలో సంఘవి చేసిన పాత్రని, హిందీలో రచన చేసింది. సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే రచన 2007 లో ప్రోబల్ బసు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఈ జంటకి ఒక బాబు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రచన సమహిక మధ్యమాలలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. తరచుగా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తోంది. ఆ ఫోటోస్ లో రచనని చూసినవారు ఆమెకి 50 ఏళ్ళు అంటే నమ్మలేకపోతున్నారు. ఈ వయసులోనూ అంతే అందంతో కనిపిస్తోంది.
Also Read:
ఈ హీరో కోలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. కంటెంట్కు చాలా ప్రాధాన్యత ఇస్తూ, కొత్త స్టోరీలకు మద్దతిస్తూ, కథ నచ్చితే ఆ క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అయ్యే తమిళ హీరో. రజినీ కాంత్ మరియు కమల్ హాసన్ లను కలిపితే ఆ హీరో అని అక్కడి ఆడియెన్స్ పిలుస్తారు. రీసెంట్ గా తెలుగులో హిట్ అందుకున్నాడు. హాలీవుడ్ సినిమాలో సైతం నటించాడు.
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలలో నటిస్తూ ఆడియెన్స్ ని మెప్పిస్తున్నాడు. ఇప్పటికే ఆ హీరో ఎవరో అర్థమై ఉంటుంది. పై ఫొటోలో ఉన్న హీరో మరెవరో కాదు సౌత్ సూపర్ స్టార్ ధనుష్. సార్ మూవీతో టాలీవుడ్ లో విజయాన్ని అందుకున్న, ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో తెలుగు సినిమా చేయనున్నారు.
పాన్ ఇండియా సినిమా కెప్టెన్ మిల్లర్తో ఆడియెన్స్ ను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ విడుదల కాకముందే మరో రెండు చిత్రాలను పట్టాలెక్కించారు. ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమాని ప్రకటించారు. అలాగే తన స్వీయ దర్శకత్వంలో 50వ చిత్రాన్ని కూడా ధనుష్ ప్రారంభించారు.

