సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఖలేజా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన కలెక్షన్స్ సాధించలేదు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని చాలా బాగా ఇష్టపడ్డారు. ఇప్పటికి కూడా ఈ సినిమాని టీవీలో వస్తే చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అసలు ఎందుకు ఫ్లాప్ అయ్యిందో అర్థం కాలేదు అంటూ ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రధారణ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. అప్పటి వరకు సీరియస్ పాత్రల్లో చూసిన మహేష్ బాబుని ఈ సినిమాలో ఒక కామెడీ పాత్రలో ఆడియన్స్ చూశారు.

మహేష్ బాబు లుక్ కూడా స్టైలిష్ గా, డిఫరెంట్ గా ఉంటుంది. త్రివిక్రమ్ డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. మణిశర్మ పాటలు ఈ సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యాయి. అన్నీ ఉన్నా కూడా ఈ సినిమా అప్పుడు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవడంతో ఫ్లాప్ అయ్యింది. కానీ మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఒక పొరపాటు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదల అయ్యి 13 సంవత్సరాలు అయ్యింది. కానీ ఇప్పుడు ఈ పొరపాటు గురించి మాట్లాడుకుంటున్నారు.
అదేంటంటే, హీరో ఎంట్రీ తర్వాత ఇసుకలో నుండి ఒక బైక్ తీసి డ్రైవ్ చేస్తాడు. అది ఎడారి. అక్కడ చుక్క నీళ్లు కూడా దొరకవు. ఆ బైక్ చూస్తే ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అలాంటి బైక్ హీరో ఒక్కసారి స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయిపోతుంది. “అసలు అంత కాలం నుండి అక్కడ అలా ఉన్న బైక్ ఒక కిక్ కి ఎలా స్టార్ట్ అయ్యింది?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. “అసలు అలాంటి బైక్ ఒకటి ఎడారిలో ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు వాడకుండా ఏం చేస్తున్నారు?” అంటూ కూడా కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.






















మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రుద్రవీణ’ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ప్రముఖ తమిళ నటుడు జెమిని గణేశన్ కీలక పాత్రలో నటించాడు. అన్ని ప్రశ్నలకి జవాబు దొరికే కోరాలో ‘ఇప్పటి సమాజానికి రుద్రవీణ సినిమా ఏ విధంగా అర్ధం అవుతుంది’ అని అడిగిన ప్రశ్నకి
‘మద్యపానంను మానిపించటం అనేది మూవీలో చూపించినంత సులభం కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 30 సంవత్సరాలకు పైగా దేశంలో, రాష్ట్రంలో ఆల్కహాల్ వినియోగ గణాంకాలను ప్రత్యేకించి చూపించనవసరం లేదేమో. ప్రస్తుతం ఉన్న సొసైటీ ఆ సన్నివేశాలను చూసి నవ్వుకుంటారేమో, భార్య పిల్లలను పట్టించుకోనివారు, ఎవరో వివాహం చేసుకోకుంటే మద్యం తాగడం మానేస్తాము అంటే అది జరగని విషయం, అందువల్ల మద్యం లేని సొసైటిని ఆశించడం పక్కన పెడదాం.
రుద్రవీణ మూవీలోని ముఖ్యమైన సమస్య అంటరానితనం. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ బిలహరి బాబాయ్ ఏమ్మా శోభన(లలిత)ను నువ్వు అంటరానిదానివి కదా అని ప్రశ్నిస్తే, కొంచెం బాధపడినా, ఏ అంటుకోవచ్చుగా అంటూ కొట్టినట్టుగా జవాబు చెప్తుంది. ఆ సన్నివేశం చిన్నతనంలో చూసి ఓహో ఇలానే ఉండాలని అనుకునేవాడిని, అలా చెప్తేనే ఊరుకుంటారని నమ్మేవాడిని.
అయితే ఆ మూవీ 80ల ఆఖరిలో వచ్చిన మూవీ కదా, ప్రస్తుతం అంటరానితనం ఏముంది అనుకుంటున్నారా? ఇటీవల జరిగిన ఇన్సిడెంట్ చూసి ఆ మూవీలో చేసినట్లు రియల్ లైఫ్ లో ప్రయత్నిస్తే 30 సంవత్సరాల అనంతరం కూడా సమస్యే అని ఋజువైంది’ అని వెల్లడించారు.
మహేష్ బాబు, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని అటు మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయే సినిమా అని చెప్పవచ్చు. సీఎంగా మహేష్ బాబు అద్భుతంగా నటించారు. సీఎం ను ప్రేమించిన అమ్మాయిగా కియారా అద్వానీ, తండ్రిగా శరత్ కుమార్, విలన్ రోల్ లో ప్రకాష్ రాజ్ ఇలా మూవీలో దాదాపు అన్ని పాత్రలలో నటించిన వారికి పేరు వచ్చింది.
సీఎంను ప్రశ్నించే జర్నలిస్ట్ శుభోదయం సుబ్బారావు పాత్రలో నటించిన నటుడికి మంచి గుర్తింపు వచ్చింది. అతన్ని అందరు శుభోదయం సుబ్బారావుగానే గుర్తిస్తున్నారు. అంతకు ముందు పలు సినిమాలలో నటించినా, రాని గుర్తింపు ఈ మూవీతో వచ్చింది. ఈ పాత్రలో నటించిన నటుడి పేరు రాజశేఖర్ అనింగి. తెలుగు సినిమాలలో విభిన్న పాత్రలు పోషించారు. రాజశేఖర్ 2014లో వచ్చిన షురుయాత్ కా ఇంటర్వెల్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
ఆ తరువాత తెలుగులో గోవిందుడు అందరి వాడేలే, బాహుబలి: ది బిగినింగ్, స్పైడర్, భరత్ అనే నేను, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫీచర్ ఫిల్మ్స్, టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్లు మరియు వెబ్సిరీస్లో నటించారు. ఇండస్ట్రీలోకి రాకముందు రాజశేఖర్ IT, బ్యాంకింగ్ మరియు ఆరోగ్య రంగంలో పనిచేశాడు.




