విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. రత్నాకర్ అనే ఒక వ్యక్తి చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. లంకల రత్నాకర్ టైగర్ రత్నాకర్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ. సినిమా చూస్తున్నప్పుడు చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి.

ముఖ్యంగా రంగస్థలం, పుష్ప సినిమాలు చాలా ఎక్కువగా గుర్తుకు తెచ్చేలాగా కొన్ని సీన్స్ ఉంటాయి. అయితే, ఈ సినిమాలో ఒక విషయం మీద మాత్రం కామెంట్స్ వస్తున్నాయి. అదేంటంటే, సినిమా మొత్తం గోదావరి నేపథ్యంలోనే నడుస్తుంది. సినిమా టైటిల్ లోనే గోదావరి అని ఉంది. అయితే సినిమాలో గోదావరి యాస మాత్రం చాలా తక్కువగా మాట్లాడుతారు. సాధారణంగా వీళ్ళందరూ గోదావరిలో నివసించేవారు కాబట్టి ఆ ఈ యాస ఎక్కువగానే మాట్లాడతారు. కానీ ఈ సినిమాలో ఆ విషయం మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకోలేదు. హీరో కొన్ని చోట్ల మాట్లాడుతారు కానీ కొన్ని చోట్ల మళ్ళీ మామూలుగానే మాట్లాడుతారు. ఒక ఫ్లో లో ఉండదు. సినిమాలో ఎక్కువగా గోదావరి యాస మాట్లాడింది అంటే అంజలి మాత్రమే. అంజలి తనకి ఇచ్చిన డైలాగ్స్ లో చాలా వరకు గోదావరి యాస లోనే మాట్లాడారు.
కానీ మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు అనిపిస్తుంది. సినిమా కనెక్ట్ అవ్వాలి అంటే ఆ సినిమా ప్రాంతంలో జరిగిన భాషలోనే మాట్లాడాలి. కానీ ఈ సినిమాలో అది కొన్ని చోట్ల సరిగ్గా లేదు అనిపిస్తుంది. అంతే కాకుండా గోపరాజు రమణ గారు ఈ పాత్రకి సూట్ అవ్వలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. తన పాత్ర తను చాలా బాగా పోషించినా కూడా, ఈ పాత్రకి ఇంకా ఎవరినైనా తీసుకుని ఉంటే బాగుండేది అంటూ చాలా మంది అంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ విషయాల మీద కామెంట్స్ వస్తున్నాయి.


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15







హీరోయిన్ రష్మిక మందన్నలా కనిపిస్తున్న ఆ సెలబ్రిటీ పేరు సనా మీర్. ఆమె ఎవరో కాదు పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్. సనా మీర్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరుపున 14 సంవత్సరాల పాటు ఆడి, అత్యుత్తమ క్రికెటర్ గా పేరు తెచ్చుకుంది. తన క్రికెట్ కెరీర్ లో ఆఫ్ స్పిన్నర్గా అసాధారణ ఆటతీరును ప్రదర్శించింది.
ఆమె 226 అంతర్జాతీయ మ్యాచ్లలో ఆడింది. అందులో 137 మ్యాచ్లలో జట్టుకు కెప్టెన్గా ఉంది. వన్డేలలో 100 వికెట్లు తీసిన మొదటి పాకిస్తాన్ మహిళా బౌలర్. 2018లో, ఐసీసీ వన్డే బౌలర్ ర్యాంకింగ్లో నంబర్ 1 ర్యాంక్ సాధించిన మొదటి పాకిస్తానీ మహిళా క్రికెటర్గా ఆమె నిలిచింది. ఆమె 2010, 2014 ఆసియా క్రీడలలో పాకిస్తాన్కు రెండు బంగారు పతకాలను సాధించింది. ఆమె 240 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టింది. ఆమె 2009-2017 వరకు పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్గా సారధ్యం వహించింది.
సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్కు మే 2020లో రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతున్న మ్యాచ్ల కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 37 ఏళ్ల సనా మీర్, క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్థాన్ జట్టులోని అత్యంత అందమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. చాలా మంది క్రికెట్ అభిమానులు ఆమె క్యూట్ లుక్స్ ను ఇష్టపడుతారు.