చాలాసార్లు పాత హిట్ మూవీ పాటలను కొత్త సినిమాల్లో రీమేక్ చేయడం చూస్తుంటాం…కొన్ని ట్యూన్స్ ను కూడా అక్కడక్కడా వాడటం గమనిస్తాం. అయితే రెండు సూపర్ హిట్ సినిమాలకు ఒకేలాంటి మ్యూజిక్ వాడారు ఆ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన వ్యక్తి. ఇంతకీ ఆ సినిమాలు ఏమిటి అనుకుంటున్నారా…. ప్రభాస్ కెరియర్ ని మలుపు తిప్పిన ఛత్రపతి…చిరంజీవికి మంచి హిట్ అందించిన ఘరానా మొగుడు.

2005లో రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా విడుదలైన సూపర్ డూపర్ హిట్ చిత్రం ఛత్రపతి. తల్లి కొడుకుల సెంటిమెంట్ ని హైలైట్ చేస్తూ ప్రభస్ ను మాచో మాన్ గా టాలీవుడ్ కి పరిచయం చేసిన చిత్రం ఇది. ఈ మూవీకి స్టోరీ కంటే కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో హైలెట్ గా నిలిచింది. మరి ముఖ్యంగా హీరోని ఎలివేట్ చేసే సన్నివేశాలలో మ్యూజిక్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. అలాంటి మూవీలోని మ్యూజిక్ వేరే సినిమా నుంచి కాపీ కొట్టారు….
watch video:
ఈ మూవీలో ప్రభాస్ వచ్చేటప్పుడు వెనుక వచ్చే మ్యూజిక్ ఒకప్పటి చిరంజీవి ఘరానా మొగుడు చిత్రంలో చిరుకి నగ్మా కి మధ్య జరిగే ఒక సీన్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వాడడం జరిగింది. తమాషా అయిన విషయం ఏమిటంటే ఈ రెండు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నది కీరవాణి గారే.
watch video:

















ప్రముఖ మలయాళ నటుడు హీరోగా నటించిన సినిమా ‘ఇరట్టా’. థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటించింది. కథ విషయానికి వస్తే, కేరళలో వాగమన్ అనే ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో జరిగే ఒక కార్యక్రమానికి మినిస్టర్ అతిథిగా వస్తుండడంతో పోలీసులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో తుపాకీ పేలిన సౌండ్ రావడంతో అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడ ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) చనిపోయి ఉంటాడు.
ఎవరు వినోద్ చంపారో తెలియదు. దాంతో పోలీస్ స్టేషన్ ను లాక్ చేసి, అక్కడ ఉన్నవారిని బయటకు వెళ్లనియకుండా చేసి, విచారిస్తూ ఉంటారు. వినోద్ చనిపోయిన సంగతి వినోద్ కవల సోదరుడు అయిన డీఎస్పీ ప్రమోద్ (జోజు జార్జి సెకండ్ రోల్) కు తెలుస్తుంది. వెంటనేప్రమోద్ అక్కడికి చేరుకుంటాడు? ఇంతకీ వినోద్ను చంపింది ఎవరు? ప్రమోద్, వినోద్ లు మధ్య గొడవ ఏంటి ? మాలిని (అంజలి) ఎవరు? అనేది మిగతా కథ.
రోజు పేపర్ లో కానీ, న్యూస్ లో కానీ కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాము. దర్శకుడు రోహిత్ ఎంజీ కృష్ణన్ అలాంటి వార్తలలో ఒక పాయింట్ తీసుకుని, ఆ పాయింట్ చుట్టూ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వినోద్ చనిపోయే సీన్తోనే మూవీ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పోలీసులు అనుమానితులను విచారించగా, ఒక్కొక్కొరు వినోద్తో వారికున్న గొడవల గురించి చెప్పడం. ఫ్లాష్బ్యాక్ తో వినోద్ హత్య వెనుక కారణాలను రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది.
ఆఖరికి వినోద్ను ప్రమోద్ హత్య చేసినట్లుగా అనుమానించడంతో ప్రమోద్ ఆ కేసును ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. ప్రమోద్ మిస్టరీని చేధించే సన్నివేశాలను డైరెక్టర్ ఊహలకు అందని విధంగా రాసుకున్నారు. జోజో జార్జ్ ఈ మూవీని నిర్మించారు. డ్యూయల్లో రోల్లో జోజు జార్జ్ నట విశ్వరూపం చూపించాడు. అంజలికి ఒక్క డైలాగ్ ఉండదు. మిగిలినవారు తమ పాత్రకు తగ్గట్టు నటించారు. రెగ్యులర్ గా వచ్చే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో పోలిస్తే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ను అందించే సినిమా. క్లైమ్యాక్స్ లో ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్ మనసుల నుండి సులభంగా పోదు.











