తెలుగు సినిమాని ఒక రేంజుకి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో మొదలైన ఉత్కంఠ, సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా, ప్రశంలు అందాయి.
అందులో బాహుబలిగా ప్రభాస్, బళ్ళాలదేవునిగా రానా దగ్గుబాటి, దేవసేనగా అనుష్క శెట్టి, శివగామి దేవిగా రమ్య కృష్ణ, బిజ్జల దేవగా నాజర్, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్య రాజ్, ఇలా ప్రతీ ఒక్కరూ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తొలుత బాహుబలి పార్ట్ 1 లో ప్రభాస్ శివుడిగా పరిచయం అవుతాడు.

అందులో కొండపైన జలపాతం దాటి ఇంకేదో ఉందని శివుడు నమ్ముతాడు. తద్వారా పైకి వెళ్ళడానికి ఎన్నో పాట్లు పడతాడు. శివుడి తల్లి మాత్రం బాహుబలికి ఏమవుతుందో అనే భయంతో, శివుడిని వెనక్కి లాగుతుంది. ఇంకోసారి శివుడు కి ఆ కొండపై దృష్టి వెళ్లకుండా ఉండేందుకు, శివలింగానికి నదిలో నుండి నీళ్ళు మోసుకొచ్చి, అభిషేకం చేస్తుంది. ఇది తెలిసిన తెలిసిన శివుడు(ప్రభాస్) తల్లిని గెలిపించాలని అని శివలింగాన్ని ఎత్తుకుని జలపాతం కింద పెట్టి… అమ్మా ఇప్పుడు శివుయ్యకు గడియ గడియ తానాలే ఒప్పెనా అంటాడు.

ఇది బాహుబలి సినిమా పార్ట్ 1లో ఎంతో కీలకమైన, అద్భుతమైన, ఆశ్చర్యవంతమైన సన్నివేశం. సినిమాలో ఎన్నో సీన్స్ ఉన్నప్పటికీ ఈ సీన్ అంటే అభిమానులకి ఎంతో ఇష్టం. ఇప్పటి వరకూ అంతా బాగానే ఉంది. దీంతో ఈ వీడియో అందరికీ షేర్ అవుతూ వెళ్లి, నెట్టింట వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది. కొందరు ఈ వీడియో ను చూసి నవ్వుతూ ఉండగా… మరి కొందరు ఇంత గొప్ప సినిమాని కార్టూన్ లాగా తీసి అవమానిస్తారా అంటూ మండిపడుతూ కామెంట్లు చేశారు.

అటు సినీ అభిమానులు, హీరో ప్రభాస్ అభిమానులు కొందరు నవ్వుకుంటే కొందరు దుమ్మెత్తి పోశారు. సంవత్సరాలు తరబడి వాళ్ళు అంత కష్టపడితే ఇలా చెయ్యడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. మరికొందరు డైలాగులు, అంతా బాగానే ఉన్నాయి కానీ ఆ స్లాంగ్ ఏ బాలేదు అని, చిన్న పిల్లల కార్టూన్ లా ఉందని అన్నారు. ఏదేమైనప్పటికీ బాహుబలి తరువాత తెలుగు సినీ పరిశ్రమ కీర్తి ప్రతిష్టలు తారా స్థాయికి చేరుకుంది. ఇక ఆ సినిమాలో కొన్ని సీన్స్ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. దీని మీద ఎంత మంది కామిడీ చేసినా, చిత్ర బృందం చాలా స్పోర్టివ్ గా తీసుకుంటూ ఎంజాయి చేస్తుంది.
watch video :
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) August 18, 2022










బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్లు నటించారు. ఈ మూవీ రిలీజ్ కు ముందు డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడికి కోసం ఒక సీటు కేటాయించాలని నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను కోరడం ద్వారా ఆదిపురుష్ మూవీ ప్రమోషన్లను మొదలుపెట్టారు. రామాయణ పారాయణం చేసినా, రాముడి కథను ప్రదర్శించినప్పుడు ఆ స్థలంలో హనుమంతుడు ఉంటాడని తన తల్లి చెప్పేదని, ఆ విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పాడు.
ఓం రౌత్ చెప్పినట్లుగానే థియేటర్లలో హనుమంతుడి కోసం సీటును కేటాయించడం, ఆ సీటులో హనుమంతుడి ఫోటో పెట్టి పూజించడం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల వేషధారణను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓం రౌత్ 2015లో చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది.
ఓం రౌత్ ‘హనుమంతుడు చెవిటివాడా? నా బిల్డింగ్ చుట్టు ఉన్న వాళ్ళు హనుమాన్ జయంతి రోజు చాలా పెద్ద సౌండ్ పెట్టి మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. దానికి తోడు అన్నీ అసంబద్ధమైన పాటలు.” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ప్రస్తుతం నెటిజెన్లు మూవీ ప్రమోషన్ కోసం హనుమంతుడు కోసం ఒక సీటు రిజర్వ్ అని చెప్పిన ఓం రౌత్, అప్పుడేమో ఇలా అన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.























































































“విరాటపర్వం విడుదలై ఈరోజుతో ఏడాది పూర్తయింది. విరాట పర్వానికి ముందు ఉన్న ‘నేను’ దాని విడుదల తర్వాత ఉన్న ‘నేను’ ఒకటి మాత్రం కాదు. విరాటపర్వం అందమైన అనుభూతుల్ని ఇచ్చింది. ఎందరో బుద్ధి జీవుల ప్రగతిశీల ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను ఇచ్చింది. అదే సమయంలో మార్కెట్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది. కాలి కింద మందుపాతర పేలినట్టయింది. కొన్ని నెలలపాటు నిద్ర లేని రాత్రులనిచ్చింది. ఈ వైరుధ్యం నన్ను ఆలోచనలో పడేసింది.”
“నాకు నా ప్రేక్షకులకు మధ్య అనుబంధాన్ని పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని విప్పి చెప్పింది. ఈ ఏడాది పాటు నాలో సృజనాత్మక వ్యక్తిత్వాన్ని నేను మరింత అర్థం చేసుకోవడానికి విరాటపర్వం స్ఫూర్తినిచ్చింది. అందుకే విరాట పర్వం నాకు ఒక సెల్ఫ్ డిస్కవరి లాంటిది. తీయబోయే చిత్రాలకు ఉపోద్ఘాతం లాంటిది.”
