హీరోయిన్ స్నేహ తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ సౌందర్య మరణం తరువాత ఆమె స్థానాన్ని కొంత వరకు భర్తీ చేసిన హీరోయిన్ స్నేహ. ఆమె తెలుగులో స్టార్ హీరోల చిత్రాలలో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును తెచ్చుకున్నారు
స్నేహ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. అలాగే తాను చిన్నతనంలో తాను అనుభవించిన బాధల గురించి చెప్పుకొచ్చారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తొలివలపు అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్నేహ, ఆ తరువాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, శ్రీరామదాసు, సన్నాఫ్ సత్యమూర్తి వంటి ఎన్నో చిత్రాలలో నటించి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటికీ స్నేహకు ఆడియెన్స్ లో క్రేజ్ ఎక్కువగానే ఉంది. ఇండస్ట్రీలో కొనసాగుతూ తన వయసుకు తగ్గ క్యారెక్టర్ లో నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. స్నేహ తమిళ నటుడు ప్రసన్న ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకి పాప మరియు బాబు ఉన్నారు.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నటి స్నేహ మాట్లాడుతూ తన తల్లిదండ్రులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు అని అన్నారు. కుమార్తెలలో తాను చివరి దానినని, తన బామ్మ తనకు బదులు కుమారుడు పుట్టాలని కోరుకుందని తెలిపింది. కూతురు పుట్టేసారికి ఆమె తన ముఖాన్ని 3 రోజుల వరకు చూడడానికి కూడా ఇష్టపడలేదని స్నేహా చెప్పుకొచ్చింది.
బాల్యంలో తాగే నీళ్లు పక్కనే ఉన్నా సోదరులకు వాటిని తామే ఇవ్వాల్సి వచ్చేదని, అదేం పద్దతి అని అడిగితే మేము మగవాళ్ళం అని, ఆడపిల్లలు కాబట్టి ఇంటి పనులు మీరే చేయాలని చెప్పేవారని అన్నారు. తన పెద్ద అన్నయ్య ముఖ్యంగా తనను చాలా ఇబ్బందులకు గురి చేసేవాడని, పనులు అన్ని తననే చేయమని ఆర్డర్ వేసేవాడని స్నేహ వెల్లడించారు.
Also Read: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన సినిమా ఏమిటో తెలుసా?

ఇప్పటికే ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న టైటిల్ తో పాటుగా ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. దీనిని చూస్తుంటే మూవీ దుమ్ము లేపడం పక్కా అన్నట్టుగా ఉంది. మహేష్ బాబు మాస్ స్ట్రైక్ బాక్సాఫీస్ ని ఈసారి గట్టిగానే ఢీ కొట్టేట్టు ఉందని అంటున్నారు. గుంటూరు మిర్చి కారం ఎంత ఘాటు ఉంటుందో గ్లింప్స్ తో శాంపిల్ చూపించారు.
పోకిరి మూవీలో సిగరెట్ తాగుతూ కనిపించిన ప్రిన్స్, ఈ మూవీలో మళ్ళీ సిగరెట్ తో ఊర మాస్ గా కనిపించారని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఈ గ్లింప్స్ లో ఫైట్ సీన్ కనిపించింది. అయితే తాజా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆ ఫైట్ ఎపిసోడే ఈ సినిమాకు మేజర్ హైలైట్ కానుందని తెలుస్తోంది.
ఈ చిత్రాన్నిఎస్ రాధాకృష్ణ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ చేయనున్నారు.
‘ది కేరళ స్టోరీ’ సినిమా ఇప్పటికి థియేటర్లలో విజయవంతంగా నడుస్తూ, బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. అయితే తాజాగా అందుటున్న సమాచారం మేరకు ఈ మూవీ జూన్ 23 నుండి జీ5 ఓటీటీలో ప్రసారం అవనున్నట్లు తెలుస్తోంది. జీ5లో ఈ చిత్రం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీలో కూడా స్ట్రీమింగ్ అవనుంది.
ఈ చిత్రానికి డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ అదా శర్మ ఈ మూవీలో లీడ్ రోల్ లో నటించింది. సిద్ధి ఇద్నానీ, యోగితా బిహానీ, సోనియా బలానీ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. మే 5న వివాదాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కేరళ రాష్ట్రంలో అమాయకులైన యువతులను లవ్ జిహాద్ పేరిట మతమార్పిడి చేసి, ఆ యువతులను ఐఎస్ఐఎస్ క్యాంపుల్లోకి పంపించి టెర్రరిస్టులుగా మారుస్తున్నారనే స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
దాంతో ఈ చిత్రానికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఈ చిత్రం పై కొన్ని రాష్ట్రాలలో బ్యాన్ విధించగా, ఈ చిత్రం పై ఎంతోమంది కేసులు కూడా పెట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైన చివరికి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. అదా శర్మ ఎన్నో చిత్రాలలో నటించినా రాని గుర్తింపు ఈ చిత్రంతో సంపాదించింది.




మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ ఇద్దరు అగ్రనటులే. నటనలోనూ, రికార్డ్స్ లోనూ, ఫ్యాన్ బేస్ లోను వారికి వారే సాటి. వీరిద్దరూ 60 ఏళ్ల వయసు దాటిన కూడా యంగ్ హీరోలతో పోటీపడుతూ వరుస చిత్రాలలో నటిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఇద్దరు తమ చిత్రాలతో పోటీ పడగా, రెండు చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. వసూళ్ల వర్షం కురిపించాయి. అయితే ఈ రెండు చిత్రాలను నిర్మించింది మైత్రీ మేకర్స్.
ఆ సందర్భంలో మీడియా ఇద్దరి కాంబోలో సినిమా చేస్తారా అని అడుగగా, మైత్రి ప్రొడ్యూసర్స్ చిరు, బాలయ్య కలిసి నటించడానికి ఒప్పుకుంటే ఏ ప్రొడ్యూసర్ అయిన అలాంటి ఛాన్స్ ను వదులుకుంటారా అని అన్నారు. మంచి స్టోరీ దొరికితే, ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెడతామని చెప్పారు. చిరు- బాలయ్య కాంబో కుదిరితే ఆ సినిమా నెక్ట్స్ లెవల్ అని చెప్పవచ్చు. అయితే గతంలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు కలిసి ఒక చిత్రంలో కనిపించారు. ఆ చిత్రం విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘త్రిమూర్తులు’.
ఈ సినిమాలోని ఒక సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కనిపిస్తారు. ఇక వీరు మాత్రమే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, నాగార్జున వంటి స్టార్ హీరోలు కూడా కనిపిస్తారు. ఈ చిత్రం తరువాత చిరంజీవి, బాలకృష్ణలు కలిసి మరో సినిమాలో కనిపించలేదు. ఎన్నో ఏళ్ల నుండి వీరిద్దరు కలిసి నటించాలన్న వీరి ఫ్యాన్స్ కోరికను మైత్రీ మూవీ మేకర్స్ తీరుస్తారేమో చూడాలి.
టోవినో థామస్ తెలుగు ఆడియెన్స్ సుపరిచితమైన పేరు. ఇప్పటికే ఎన్నో డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగువారిని పలకరించారు. ఇటీవల వచ్చిన 2018 కు తెలుగులో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. టోవినో థామస్ నటించిన ‘నీలవెలిచమ్’ అనే చిత్రం ఏప్రిల్ 23 న థియేటర్లలో విడుదల అవగా ప్లాప్ గా నిలిచింది. కానీ మే 23న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఈ మూవీకి మంచి స్పందన ఆడియెన్స్ నుండి వస్తోంది.
ఆషిక్ అబూ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రిమా కల్లింగల్, టామ్ చాకో, రోషన్ మాథ్యూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 1964లో విడుదలైన విజయనిర్మల నటించిన ‘భార్గవి నిలయం’ చిత్రం మలయాళంలో హారర్ చిత్రాలకు స్పూర్తిగా నిలిచింది. 50 ఏళ్ల క్రితం మాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఆ చిత్రం రీమేక్గా ‘నీల వెలిచమ్’ను తీశారు.
బషీర్ (టోవినో థామస్) ఒక రచయిత. స్టోరి రాయడం కోసం సముద్రం తీరంలో ఉన్న ఒక పల్లెటూరికి వస్తాడు. ఆ ఊరి చివర్లో ఉండే భార్గవి నిలయం అనే పాత ఇంట్లో అద్దెకు దిగుతాడు. అయితే ఆ ఇంట్లో భార్గవి అనే ఆత్మ ఉందని ఊర్లో వారు చెప్పుకుంటారు. వారిలో కొందరు ఆ ఆత్మను కూడా చూస్తారు. ఆ ఇంట్లోకి ఎవరూ వచ్చినా సహించని ఆత్మ అద్దెకు వెళ్ళిన బషీర్ను ఏం చేయదు. ఊర్లో వారు చెప్పే కథలు విన్న బషీర్ ఆమె మరణం వెనుక ఉన్న వాస్తవం తెలుసుకొని స్టోరీగా రాయాలని నిర్ణయించుకుంటాడు.
కథ రాసే క్రమంలో బషీర్ ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి? భార్గవి ఎలా మరణించింది ? ఆమెను ప్రేమించిన శివకుమార్ మాయం అవడం వెనుక ఉన్న కారణం ఏమిటి? భార్గవి మేనమామ నారాయణన్ బషీర్ను ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు అనేదే మూవీ స్టోరి. కథ కొత్తది కానప్పటికీ, దర్శకుడు ఈ చిత్రాన్ని థ్రిల్లింగ్గా నడిపించారు.














#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
చక్రవాకంలో ఇంద్రగా నటించిన యాక్టర్ ఇంద్రనీల్ బుల్లితెర పై సంచలనం సృష్టించారు. మంజులనాయుడు తెరకెక్కించిన ఈ సీరియల్, అప్పటి వరకు ఉన్న సీరియల్స్ ట్రెండ్ ను మలుపు తిప్పింది. ఆ తరువాత వచ్చిన మొగలి రేకులు సీరియల్ ఇంద్ర రేంజ్ ను మరింత పెంచింది. ఇంద్రనీల్ టెలివిజన్ ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ ఇంద్ర అనగానే ఇంద్రనీల్ని బుల్లితెర ప్రేక్షకులు గుర్తుపడుతున్నారంటే ఆయన క్రేజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
క్రమంగా బుల్లితెరకు దూరం అయిన ఇంద్రనీల్ చాలాకాలం తరువాత ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్లో సామ్రాట్ అనే పాత్రతో రీఎంట్రీ ఇచ్చారు. ఇంద్ర బాగా నటించినప్పటికీ, ఆయన పక్కన హీరోయిన్ అమ్మమ్మలా ఉందని ఆమె పాత్రను హైలెట్ చేయడానికి సామ్రాట్ పాత్రను సరిగ్గా చూపించలేదని విమర్శలు తీవ్రంగా వచ్చాయి. ఆ తరువాత ఆ పాత్ర కనిపించలేదు. ఇంద్రనీల్ కి రీ ఎంట్రీ పని చేయలేదు.
సీరియల్స్లో ఛాన్స్ లు లేకపోవడంతో ఇంద్రనీల్ ప్రస్తుతం తన భార్యతో కలిసి ఆన్ లైన్లో పచ్చళ్ల బిజినెస్ ప్రారంభించారు. ఇంద్రనీల్, మేఘనాలు ఎన్ఎమ్ ఫుడ్స్ పేరుతో అమ్ముతున్నారు. ఈ క్రమంలో మాట్లాడిన ఇంద్రనీల్ తెలుగులో టీవీ నటులకు ఆఫర్స్ చాలా తక్కువ. దానికి కారణం కన్నడ నటుల డామినేషన్ ఎక్కువగా ఉందని అన్నారు. దాంతో చాలామంది తెలుగు ఆర్టిస్ట్లు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే మేము బాగానే ఉన్నామని, చక్రవాకం ఇంద్ర అనగానే ఇప్పటికీ గుర్తుపడతారు. హీరోగా 18 డైలీ సీరియల్స్ లో నటించాను. ప్రస్తుతం సీరియల్ హీరోలు 1,2 సీరియల్స్ అనంతరం కనిపించడం లేదు. కన్నడ వాళ్లు ఇక్కడ వర్క్ చేస్తున్నారని మాకేం ఇబ్బంది లేదు. వాళ్లలో ఎక్కువ మంది మా స్నేహితులు ఉన్నారు. తప్పు వాళ్లది కాదు. పరిశ్రమ వాళ్లది. కన్నడ లేదా తమిళ ఇండస్ట్రీలలో తెలుగువాళ్లను తీసుకోరు. అయితే తెలుగులో కన్నడవాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారని వెల్లడించారు.
ప్రస్తుతం ఓటీటీలకు ఉన్న క్రేజ్ ఏమిటో అందరికి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఓటీటీలు ప్రతివారం కొత్త చిత్రాలు, సిరీస్ లు విడుదల చేస్తూ వాటి స్పేస్ ను పెంచుకుంటున్నాయి. అయితే ఓటీటీలో ఇప్పటివరకు ధూమపానం మరియు మద్యపానం గురించిన చట్టం ఏది లేదు. దాంతో ఓటీటీలో వచ్చే కంటెంట్ లో విచ్చల విడిగా సిగరెట్ మరియు మద్యం తాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారం అయ్యే కంటెంట్ లో ఇక పై ధూమపానంకు సంబంధించిన దృశ్యాలు వచ్చినపుడు స్కిన్ క్రింది భాగంలో కనిపించేలా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిపే హెచ్చరికను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ రూల్ ను అమలు చేయనట్లయితే కేంద్ర ఆరోగ్య, ప్రసార, సమాచార, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖలు ఆ ఓటీటీలకు నోటీసులు జారీ చేయడం జరుగుతుంది.
వివరణ ఇచ్చేందుకు, అలాగే మార్పులు చేయడానికి తగిన టైంను ఇస్తాయి. ఇక ఈ నిబంధనలు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఆడియో-విజువల్ ప్రోగ్రాములు, సీరియల్స్, టెలివిజన్ ప్రోగ్రాములు, వెబ్ సిరీస్, పాడ్కాస్ట్లు వంటి ఇతర కంటెంట్కు కూడా వర్తిస్తాయి.