సినిమాల్లో రాణించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాల్సిందే. అయితే ఇక్కడ అంత త్వరగా అవకాశాలు లభించవు. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకొనేవారే రాణించగలుగుతారు. అలా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న నటుడే సుబ్బరాజు.
సుబ్బరాజు టాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో 100కు పైగా సినిమాల్లో ఆయన నటించాడు. అన్ని రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన ఇట్టే ఒదిగిపోతారు. అయితే ఈయన యాక్సిడెంటల్గా ఇండస్ట్రీకి పరచయమయ్యాడు. సినిమాల్లోకి రాక ముందు సుబ్బరాజు ‘డెల్’ కంప్యూటర్స్ లో కంప్యూటర్ ఇంజనీర్ గా పని చేసాడు.

సుబ్బరాజు చిత్రసీమ ప్రవేశం చిత్రంగానే జరిగింది. ‘డెల్’లో పనిచేస్తున్న రోజుల్లో దర్శకుడు కృష్ణవంశీ అసిస్టెంట్ ఒకరు సుబ్బరాజు వద్దకు వచ్చి, తమ డైరెక్టర్ పర్సనల్ కంప్యూటర్ పాడయిందని, బాగు చేయమని కోరాడు. ఆ సమస్య సాల్వ్ చేసేందుకు అక్కడికి వెళ్లాడు సుబ్బరాజు. అక్కడ సుబ్బరాజును చూసిన కృష్ణవంశీ.. ఒడ్డూ పొడుగు బాగుండటంతో ఖడ్గం సినిమాలో చిన్న రోల్ ఇచ్చాడు. అలా తెలుగు సినిమాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు సుబ్బరాజు.

ఆరంభంలో చిన్నాచితకా పాత్రలో సాగిన సుబ్బరాజుకు పూరి జగన్నాథ్ చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ‘ఖడ్గం’ తర్వాత పూరి జగన్నాథ్ ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’లో హీరోతో బాక్సింగ్ రింగ్ లో తలపడే ప్రత్యర్థి పాత్ర పోషించారు. ఈ సినిమా సుబ్బరాజుకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. వరుసగా “శ్రీ ఆంజనేయం, నేనున్నాను, ఆర్య, సాంబ” చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు.

తన దరికి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు సుబ్బరాజు. అలా అతి త్వరగా 50 సినిమాలు పూర్తి చేశారు. దర్శకుడు పూరి జగన్నాథ్, రవితేజ తనను ఎంతో ప్రోత్సహించారు అని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం వరుస చిత్రాలతో సుబ్బరాజు కెరీర్లో దూసుకుపోతున్నారు. తనకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ తన పాత్రకి వంద శాతం న్యాయం చేసే విధంగా కష్టపడ్డానని అందువల్లనే ప్రస్తుతం వందకు పైగా చిత్రాలలో నటించానని చెప్పుకొచ్చాడు సుబ్బరాజు.




హీరో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మైథలాజికల్ చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటించారు. రామాయణం ఆధారంగా ఇప్పటికే అనేక చిత్రాలు రూపొందాయి. అయితే ఈ చిత్రాన్ని ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా గ్రాండ్గా సిల్వర్ స్క్రీన్ పై చూపించే ప్రయత్నం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ చేస్తున్నారు.
ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినపుడు ఆడియెన్స్ నుండి విమర్శలు చేశారు. ఇప్పటి దాకా వచ్చిన రామాయణం చిత్రాలను చూసిన ఆడియెన్స్ కి దర్శకుడు చేసిన మార్పులు అసలు నచ్చలేదు. టీజర్ యానిమేషన్లా ఉందనే ట్రోల్స్ వచ్చాయి. హిందూవాదులు కూడా రావణాసురుడి క్యారెక్టర్ చిత్రీకరణను పూర్తిగా వ్యతిరేకించారు. ఇక హనుమంతుడికి గెడ్డం పెట్టడం హిందూవాదులకు అసలు నచ్చలేదు.
ఈ విమర్శల తరువాత మూవీ పై మరింత ఫోకస్ చేసిన ఓం రౌత్, ట్రైలర్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. 3డీలో ట్రైలర్ను చూసిన ఆడియెన్స్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. జూన్ 16న ఈ చిత్రం 5 భాషల్లో భారీగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతిలో జూన్ 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రకటన వచ్చిన నేపథ్యంలో బాహుబలి సినిమా తెరపైకి వచ్చింది.
టాలీవుడ్ హీరో ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్గా మార్చిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ తిరుపతిలోనే నిర్వహించారు. 2015 లో జూన్ 13న తిరుపతిలోని ఎస్వీ గ్రౌండ్స్లో బాహుబలి ఆడియో లాంచ్ వేడుక జరిగింది. ఆ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.
8 ఏళ్ళ తరవాత జూన్ 6న ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జరగనుంది. దాంతో బాహుబలి సినిమా లాగే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా బాహుబలి సెంటిమెంట్ వాడుతున్నారంటే ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందంటూ మీమ్స్ షికారు చేస్తున్నాయి.





పెళ్లి అనే విషయం శరత్ బాబుకు అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఇద్దరిని అఫిషియల్ గా పెళ్లి చేసుకున్నా, సీక్రెట్గా వేరొకరితో కాపురం చేసినట్లుగా ఇండస్ట్రీలో టాక్ ఉంది. శరత్ బాబు పరిశ్రమలో అడుగుపెట్టిన సమయానికే తెలుగు ఇండస్ట్రీలో రమాప్రభ స్టార్ కమెడీయన్గా వెలుగొందుతున్నారు. ఆమె శరత్ బాబు కన్నా వయసులో 4 ఏళ్లు పెద్దది. అయినపట్టికి ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అలా వారు 14 సంవత్సరాల పాటు చాలా అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని కొనసాగించారు.
ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెట్టడంతో విడాకులు తీసుకున్నారు. తరువాత శరత్ బాబు తమిళ యాక్టర్ నంబియార్ కుమార్తె స్నేహలతను వివాహం చేసుకున్నారు. కానీ ఆయన కొన్నాళ్లకే స్నేహలతతో కూడా విడిపోయారు. ఆ తరువాత కొంతకాలం ఒంటరిగా ఉన్న శరత్ బాబు, హీరోయిన్ నమితను రహస్యంగా వివాహం చేసుకున్నారనే ప్రచారం కొలీవుడ్, టాలీవుడ్ లో విస్తృతంగా జరిగింది.
అయితే శరత్ బాబు అప్పట్లో ఈ వార్తలను ఖండించినా ఆ రూమర్స్ ఆగలేదు. శరత్ బాబును ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీకు పిల్లలు లేరా అని అడిగినపుడు దానికి ఆయన తన సోదరులు, అక్కాచెల్లెల పిల్లలు అంతా కలిసి 25 మంది అని, వారంతా కూడా తన పిల్లలే అని చెప్పారు. శరత్ బాబు మరణించిన రోజు నుండే అతని బంధువులు ఆస్తుల కోసం తగాదా పడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మరో వైపు శరత్బాబుకు మాజీ భార్య స్నేహ నంబియార్తో ఇద్దరు పిల్లలు ఉన్నారని, సాయి కార్తీక్ అనే కుమారుడు, పల్లవి అనే కుమార్తె ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా కొంతమంది ఆయనకు పిల్లలు లేరని, మరి కొంతమంది పిల్లలు ఉన్నారని అంటున్నారు.









1. నయనతార:
2. కాజల్ అగర్వాల్:
3 . హన్సిక మోత్వాని:
4 . శ్రియా శరన్:
5. స్వాతి రెడ్డి:
6. నిక్కీ గల్రానీ:
7. భాను శ్రీ మెహ్రా
8. సమంత:
పెళ్లి సమయంలో సమంత వయసు 30 సంవత్సరాలు. కానీ వీరిద్దరు వివాహం అయిన నాలుగు సంవత్సరాలకు తాము విడాకులు తీసుకుని విడిపోతున్నట్లుగా ప్రకటించారు.