ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో, కష్టాల్లో ఉన్న వారికి తనవంతు సాయం అందించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఎప్పటి నుంచో చిరు పలు చారిటబుల్ ట్రస్ట్ లు కూడా నడుపుతున్న విషయం మనకు తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్యం తో ఉన్న పలువురు నటీనటులకు చిరు హెల్ప్ చేసిన విషయం మనకు తెలిసిందే.
తాజాగా చిరంజీవి ఓ ప్రముఖ నటుడికి సాయం చేసి అతడి ప్రాణాలు నిలబెట్టారు. అతడు ఎవరో కాదు తమిళ నటుడు పొన్నాంబళం. విలన్గా తమిళ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈయన రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్ లాంటి స్టార్ హీరోలకు ప్రతినాయకుడిగా నటించారు. తెలుగులోనూ ఈయన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో విలన్గా రాణించారు.

కోలీవుడ్లో తన కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో పొన్నాంబళం అనుకోకుండా సినిమాల నుంచి తప్పుకున్నారు. తర్వాత 2018లో బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2లో పొన్నాంబళం పాల్గొన్నారు. అయితే, రెండేళ్ల క్రితం పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఇండస్ట్రీలోని కొంత మంది సెలబ్రిటీల సాయం కోరారు. అప్పుడు ఆయనకి సాయం చేయడానికి తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి చాలా మంది ముందుకొచ్చారు.

రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక, ధనుష్, కెఎస్ రవికుమార్, రాఘవ లారెన్స్ తదితర నటులు పొన్నాంబళానికి ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడి విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడారు. తన స్నేహితుడి ద్వారా చిరంజీవి ఫోన్ నంబర్ సంపాదించిన పొన్నాంబళం ‘ అన్నయ్య నాకు బాగోలేదు.. మీకు చేతనైనంత సాయం చేయండి’ అని మెసేజ్ పెట్టారట. మెసేజ్ చేసిన పది నిమిషాల తర్వాత పొన్నాంబళంకి చిరంజీవి ఫోన్ చేశారట. ఈ విషయాన్ని పొన్నాంబళం స్వయంగా వెల్లడించారు.

చిరంజీవి తనకు చేసిన సాయం గురించి బిహైండ్వుడ్స్ తమిళ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పారు పొన్నాంబళం. ” హాయ్ పొన్నాంబళం.. ఎలా ఉన్నావు.. ఆరోగ్యం బాగాలేదా.. కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా.. నేను ఉన్నాను, కంగారుపడకు.. నువ్వు హైదరాబాద్ వచ్చేస్తావా అని చిరంజీవి నన్ను అడిగారు. నేను రాలేను అన్నయ్య అని చెప్పాను. అయితే చెన్నైలోని అపోలో హాస్పిటల్కి వెళ్లండి.. అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పారు.

అక్కడికి వెళ్తే కనీసం ఎంట్రీ ఫీజు కూడా తీసుకోలేదు. అక్కడే నాకు వైద్యం అందించారు. రూ.45 లక్షలు ఖర్చయ్యింది. మొత్తం ఆయనే చూసుకున్నారు. చిరంజీవి అన్న దేవుడిలా వచ్చి నాకు సాయం చేశారు.” అని భావోద్వేగానికి గురయ్యారు పొన్నాంబళం. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని..ఇప్పుడు కూడా సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందని.. తండ్రి, అన్నయ్య ఇలా ఏ పాత్ర ఇచ్చినా నటించడానికి సిద్దంగా ఉన్నానని.. చెప్పుకొచ్చారు పొన్నాంబళం.
నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక @KChiruTweets గారినడిగితే 1 లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకుంటే – నేనున్నా అని చెప్పి 5ని||లో దగ్గరలో ఉన్న అపోలో కి వెళ్ళమని అడ్మిట్ అవ్వమన్నారు – అక్కడ నన్ను ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదు
మొత్తం 40లక్షలయ్యంది ఆయనే చూస్కున్నారు🙏 pic.twitter.com/HHdBcSiwPm
— 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) March 15, 2023







1. నయనతార:
2. కాజల్ అగర్వాల్:
3 . హన్సిక మోత్వాని:
4 . శ్రియా శరన్:
5. స్వాతి రెడ్డి:
6. నిక్కీ గల్రానీ:
7. భాను శ్రీ మెహ్రా
8. సమంత:
పెళ్లి సమయంలో సమంత వయసు 30 సంవత్సరాలు. కానీ వీరిద్దరు వివాహం అయిన నాలుగు సంవత్సరాలకు తాము విడాకులు తీసుకుని విడిపోతున్నట్లుగా ప్రకటించారు.





ప్రస్తుతం స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ హీరోల చిత్రాలను రీరిలీజ్ చేయడం టాలీవుడ్ లో ట్రెండ్ గా మారింది. కొత్త చిత్రాల వసూళ్ల సంగతి ఏమో కానీ, రీరిలీజ్ చిత్రాల కలెక్షన్స్ లో మా హీరో టాప్ అంటే, మా హీరోనే తోపు అని ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే రీ రిలీజ్ వసూళ్ల గురించి కొట్టుకున్నంత పని చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో నాన్ ఎన్టీఆర్ రికార్డ్స్, నాన్ పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అని టాగ్స్ ని ఇద్దరి ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ రికార్డుల లెక్కలతో ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి మూవీని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని ‘4కె’ వెర్షన్లో 1200 పైగా స్క్రీన్స్లలో విడుదల చేశారు. దీని కోసం హీరో విశ్వక్ సేన్ అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. సింహాద్రి సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్గా 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని అంటున్నారు.
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మొదటి రోజు నాలుగు కోట్లకు గ్రాస్తో టాప్లో ఉంది. తాజాగా ‘సింహాద్రి’ ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. అయితే పవన్ ఫ్యాన్స్ ఈ లెక్కలో తేడా ఉందని అంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి అభిమానులు గట్టిగా వాదించుకుంటున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘దేవర’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన విషయమ అందరికి తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్ర లాంచ్ ఈవెంట్ లో ఈమూవీ గురించి మరియు ఎన్టీఆర్ పాత్ర గురించి ఎలివేషన్స్ చెప్పారు. అవి విన్న తరువాత అందరు జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో మాస్ అవతార్ లో ఉంటారని ఊహించుకున్నారు. లుక్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషించారు. కానీ ఆడియన్స్ లుక్ మామూలుగా ఉందని అంటున్నారు.
సోషల్ మీడియాలో ఈ లుక్ ని ‘వాల్తేరు వీరయ్య’ లో మెగాస్టార్ చిరంజీవి కనిపించే ఫస్ట్ సీన్ లోని షాట్ తో పోలుస్తూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ చిత్రాలను చేస్తూ కూడా కాపీ కొట్టడం ఏంటని డైరెక్టర్ కొరటాలను ట్యాగ్ చేస్తూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇలా దేవర ఫస్ట్ లుక్ పోస్టర్ పై కొంత మంది కాపీ అని, మరి కొంత మంది చాలా హెవీగా ఎడిట్ చేసారని కామెంట్స్ చేస్తున్నారు.
వీరిలో ఎక్కువ మంది కొమరం భీమ్ సముద్రం దగ్గర నిల్చోని ఉన్నట్టుగా ఉందని, ఆ పాత్రనే కొంచెం మార్చి పోస్టర్ రిలీజ్ చేసారని అంటున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చిన కూడా అది కేవలం కొరటాల శివ ఇంత యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాడు అని ఈ లుక్ తో తెల్సింది కాబట్టీ పొగిడారు. కానీ అవి అన్నీ పక్కన పెట్టి చూస్తే ప్రేక్షకులకి ఇది అంత పెద్ద కొత్తగా ఏం అనిపించలేదని టాక్.