విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా పేరుగాంచిన ఎన్టీ రామరావుగారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పేరు తెలియని తెలుగువారుండరు. సిని రంగంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ఆడియెన్స్ ను అలరించారు.
తెలుగు సిని చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న మహానటుడు ఎన్టీఆర్. జానపద, పౌరాణిక, సాంఘికం చిత్రాలలో నటించి ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ చేశారని చెప్పవచ్చు. కానీ ఒక సమయంలో సినిమాల్లో ఎన్టీఆర్ పనైపోయిందనే టాక్ వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశారో ఇప్పుడు చూద్దాం..
ఎన్టీ రామరావుగారి పద్దతి వేరు. ఆయన ఏ క్యారెక్టర్ చేయాల్సి వస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఎన్టీఆర్ కి ఉన్న ప్రత్యేకత. అప్పట్లో ఎన్టీఆర్ చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసేవారు. అయితే ప్రతి రంగంలోనూ ఆటుపోట్లు అనేవి ఎదురవడం సహజమే. అలాగే ఒక సమయంలో ఎన్టీఆర్ కు కెరీర్ లో కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యింది. 1977 కి ముందు ఎన్టీఆర్ చిత్రాలు విడుదల అవుతున్నా, అంతకుముందులా హిట్ అవడం లేదు.
చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ కావడం లేదు. అప్పటికే ఇండస్ట్రీలోకి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి యంగ్ హీరోలు రావడంతో ఎన్టీఆర్ జోరు కొంచెం తగ్గింది. ఆ సమయంలో కొందరు ఎన్టీఆర్ పనైపోయిందని కూడా అన్నారు. అయితే ఎన్టీఆర్ వయసు పై బడిందని ఊరుకోలేదు. సినీ పరిశ్రమలో తనకు ఎదురులేదని నిరూపించాడు.
నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. ఒకే సంవత్సరంలో ఏకంగా 3 ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి అందరి నోళ్ళు మూయించారు. 1977లో ఎన్టీఆర్ కు 3 బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. జనవరి 18న విడుదల అయిన ‘దానవీరశూరకర్ణ’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రలలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా ఆయనే.
ఈ మూవీ విజయం మరవకముందే డైరెక్టర్ రాఘవేంద్రరావు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన ‘అడవి రాముడు’ మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక అదే సంవత్సరం చివరలో ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’ మూవీ విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ విధంగా ఎన్టీఆర్ 1977లో 3 చిత్రాలు చేసి రికార్డ్ సృష్టించారు.
Also Read: రియల్ TO రీల్..! “ది కేరళ స్టోరీ” లోని 4 మహిళలు ఎవరో తెలుసా..?






తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రంలో కానిస్టేబుల్ శివగా నాగ చైతన్యనటించారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో విలన్గా నటించగా, శరత్కుమార్, సంపత్ రాజ్, YG మహేంద్రన్ కీలక పాత్రలలో నటించారు. శివ గర్ల్ ఫ్రెండ్ రేవతి పాత్రలో కృతి శెట్టి, ముఖ్యమంత్రి పాత్రలో ప్రియమణి నటించారు. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు
శివ (నాగచైతన్య) నిజాయితీగల పోలీస్ కానిస్టేబుల్ గా సీఎం దాక్షాయణి (ప్రియమణి) ప్రశంసలు పొంది జిల్లాలో చాలా పాపులర్ అవుతాడు. ఓ రోజు రాత్రి పూట డ్యూటీలో చేస్తూ ఎవరో తెలియకుండానే పెద్ద క్రిమినల్ అయిన రాజు (అరవిందస్వామి) మరియు సిబిఐ ఆఫీసర్ అయిన జార్జ్ (సంపత్ రాజ్) లను అరెస్ట్ చేస్తాడు. ఆ సంఘటనతో సాధారణ కానిస్టేబుల్ అయిన శివ లైఫ్ తలకిందులవుతుంది. రాజూ ఎవరు? అతడిని ఎందుకు సిబిఐ పట్టుకోవాలని అనుకుంటుంది? ఇందులో శివ ఎందుకు ఇరుక్కున్నాడు? ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథ.
తాజాగా కస్టడీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. సాధారణంగా ఏ చిత్రం రిలీజ్ అయినా 45 రోజుల తరువాతనే ఓటీటీలోకి వస్తుంది. అంటే ఈ సినిమా మే 12న రిలీజ్ అయింది. అంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా జూన్ చివర్లో ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుందని సమాచారం.
అయితే థియేటర్స్ లో చూడని చాలా మంది ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా ఈ మధ్య చాలా చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ అయినపుడు వచ్చే టాక్ కన్నా ఓటీటీలో విడుదల అయిన తరువాత మంచి టాక్ వస్తుంది. మరి ఈ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.









ఈ మూవీ ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. కేరళ ముఖ్యమంత్రితో సహా రాజకీయ నాయకులు ఈ చిత్రం పై తీవ్రంగా మండిపడ్డారు. టీజర్, ట్రైలర్ రిలీజ్ వెంటనే ఈ మూవీని విడుదల చేయకూడదని కేరళ హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కేరళ, తమిళనాడుల్లో ఈ మూవీని రిలీజ్ ఆపేందుకు ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఆందోళనలు, వివాదాలు, విమర్శలు, నిరసనల మధ్యనే ఈ చిత్రం విడుదలైంది.
ఈ మూవీ కథ లోకి వెళ్తే కేరళలోని కాసర్గాడ్లోని నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్ చేరుతుంది. అక్కడ నిమా, గీతాంజలి పరిచయం అవుతారు. హాస్టల్లో అసీఫాతో కలిసి రూమ్ షేర్ చేసుకొంటారు. అసీఫా ఐసీస్ లో అండర్ కవర్గా పనిచేస్తూ, అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మతంలోకి మారుస్తూ ఉంటుంది. ఈ ముగ్గురు అసీఫా మాటలకు ఆకర్షితులై ఇస్లాం మతంలోకి మారుతారు.
మతం మార్చబడిన ఈ అమ్మాయిలు ఇస్లామిక్ స్టేట్లోకి రిక్రూట్ అయ్యారు. వీరిని ఆఫ్ఘనిస్తాన్, యెమెన్ మరియు సిరియాలకు ఇస్లాం మతం కోసం పోరాడటానికి పంపిస్తారు. నిజం తెలుసుకున్న తరువాత వారు ఏం చేశారు అనేదే ఈ చిత్రం. ఇక ‘ది కేరళ స్టోరీ’లోని అదా శర్మ పోషించిన ‘షాలినీ ఉన్నికృష్ణన్’ అనే పాత్ర కేరళ నలుగురు మహిళల్లో ఒకరైన నిమిషా అలియాస్ ఫాతిమా ఇసా జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈమె 2016 -2018 కాలంలో ఐసీస్ లో చేరి, ఆ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్కు పారిపోయారు.
ఐసీస్ నియంత్రణలో ఉన్న ఖొరాసన్ ప్రావిన్స్లో US దళాలు నిమిషా అలియాస్ ఫాతిమాతో పాటు పారిపోయిన మరో ముగ్గురిని సోనియా సెబాస్టియన్ అలియాస్ ఆయిషా, మెర్రిన్ జాకబ్ అలియాస్ మరియం మరియు రఫెలాగా గుర్తించారు. నిమిషా భర్త ఐసిస్ ఉగ్రవాద దాడిలో చనిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ జైలులో ఉన్నారు. ఆమె అసలు పేరు నిమిషా సంపత్. హిందువు తరువాత ఇస్లాంలోకి మారింది. అలాగే తన పేరును కూడా ఫాతిమా ఇసాగా మార్చుకుంది. నిమిషా మరియు మెర్రిన్ ఫాతిమా, మరియమ్లు ఇస్లాంలోకి మారారు. వారి భర్తలు కూడా ఇస్లాంలోకి మారారు.
నిమిషా అలియాస్ ఫాతిమా కేరళలో ఐసీస్ అబ్దుల్ రషీద్ వివాహం చేసుకుంది. మే 2016లో చదువు కోసం శ్రీలంకకు వెళుతున్నానని తన కుటుంబ సభ్యులకు చెప్పి భారత్ను విడిచిపెట్టింది. కానీ ఆమె తన భర్త మరియు ఇతరులతో కలిసి ఇస్లామిక్ స్టేట్లో చేరడానికి సిరియాకు వెళ్లింది. నివేదికల ప్రకారం 2016 జూన్-జూలైలో నిమిషా ఉమ్ము కులుసు అనే అమ్మాయికి జన్మనిచ్చింది. కొంతకాలం తర్వాత సిరియా నుంచి ఆఫ్ఘనిస్థాన్కు వెళ్లారు. 2016 ఆగస్టులో ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసి 21 మంది పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.
ఐసీస్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ చనిపోయిన తర్వాత, అక్కడి బలగాలతో జరిగిన పోరాటంలో తమ భర్తలు మరణించిన తర్వాత 10 మంది మహిళలు మరియు 21 మంది పిల్లలు (నిమిషా మరియు ఉమ్ము కులుసుతో సహా) అక్టోబర్ 2019లో ఆఫ్ఘన్ అధికారుల ముందు లొంగిపోయారు. ఆ తర్వాత వారిని జైల్లో పెట్టారు.
కేరళలో, ఫాతిమా తల్లి బిందు కె తన కుమార్తె మరియు నాలుగేళ్ల మనవరాలిని స్వదేశానికి రప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. తన కుమార్తె పెళ్లి లేదా ‘లవ్ జిహాద్’ ద్వారా ఇస్లాం మతంలోకి మారిందని బిందు అన్నారు. తీవ్రవాద గ్రూపుల మత మార్పిడుల పై కేంద్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు
భారత దర్యాప్తు సంస్థలు కాబూల్లో పిల్లలతో నివసిస్తున్న నలుగురు మహిళలను ఇంటర్వ్యూ చేశాయి. అయితే ఆ ఇంటర్వ్యూలో ఆ మహిళలలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి అనుకూలమైన, బలమైన వైఖరితో ఉన్నారని దర్యాప్తు సంస్థలు తెలుసుకున్నాయి. అందువల్ల ఐసీస్ లో చేరిన ఆ నలుగురు కేరళ మహిళలు భారత్ కు తిరిగి వచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. వారు ఐసీస్ లో చేరిన నలుగురు కేరళ మహిళలైన సోనియా అలియాస్ ఆయిషా, మెరిన్ జాకబ్ అలియాస్ మరియం, నిమిషా అలియాస్ ఫాతిమా, రఫెలా.








