Unstoppable with NBK 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ఆహాలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. సీజన్ 2 లో ఇప్పటి వరకు 4 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. ఆ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. చివరిగా టెలికాస్ట్ అయిన 4వ ఎపిసోడ్ లో బాలకృష్ణతో డిగ్రీ చేసిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలతో పాటు బాలయ్యతో స్కూల్ లో చదువుకున్న అలనాటి హీరోయిన్ రాధిక వచ్చి అలరించారు.
అయితే అన్ స్టాపబుల్ 2 కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తున్న కూడా తొలి సీజన్ స్థాయిలో రెండవ సీజన్ కు లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందులోనూ ఎపిసోడ్ కు ఎపిసోడ్ గ్యాప్ వస్తోందని, ఇది కూడా కారణమని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఈవారం కూడా న్యూ ఎపిసోడ్ ఉండదని కామెంట్లు చేస్తున్నారు.
కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలయ్య షోకు 5వ ఎపిసోడ్ కు ఆహా ఫౌండర్స్ లో ఒకరైన అల్లు అరవింద్, తెలుగు దర్శకులలో గొప్పగా చెప్పుకునే కె రాఘవేంద్రరావు, టాప్ నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబు వస్తున్నారని తెలుస్తోంది.అయితే ఈ ఎపిసోడ్ లో సినీ రంగం గురించి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అన్ స్టాపబుల్ షో కోసం ఇరవై నుండి ముప్పై కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు షో నిర్వాహకులు.
ఆహా ఓటీటీకి రోజు రోజుకి రెస్పాన్స్ పెరుగడంతో, అది బాలకృష్ణ షో వల్లే ఆహా సబ్ స్క్రిప్షన్లు పెరిగాయని అంటున్నారు. బాలకృష్ణ కూడా భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య షో వల్లే ఆహా రేంజ్ ను పెరిగిందని కొందరు అంటున్నారు. అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతున్న క్రమంలో ప్రతి ఎపిసోడ్ ని స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇక అందులో భాగంగా రాబోయే ఎపిసోడ్స్ ని మరింత గ్రాండ్ గా ఉండేట్టు ప్లాన్ చేస్తున్నారు.



చిరంజీవికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో నాకు తెలుసని మణిశర్మ చెప్పారు. ముందు ఇచ్చిన బీజీఎం వద్దని, దర్శకుడు కొరటాల శివ మీరు ఎలా అనుకుంటున్నారో అలా వద్దు. చాలా కొత్తగా ఉండాలని అన్నారని, దాంతో బీజీఎం కొరటాల శివ కోరిక మేరకు మార్చాల్సి వచ్చిందని మణిశర్మ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం మణిశర్మ అన్న మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దాంతో నెటిజన్లు ఆచార్య సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించారు.
ఏ చిత్ర బృందం అయినా తాము తీసిన సినిమా హిట్ అవ్వాలనే తీస్తారని, అవికొన్నిసార్లు అవి హిట్ అవుతాయి. మరి కొన్నిసార్లు ప్లాప్ అవుతాయని, దానికి ఎవరిని విమర్శించడం కరెక్ట్ కాదని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇంతవరకు మణిశర్మ, చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. చూడాలని ఉంది, ఇంద్ర, బావగారు బాగున్నారా, ఠాగూర్ ఇలా చేసిన సినిమాలన్ని మ్యూజికల్ హిట్స్. మృగరాజు, జై చిరంజీవ సినిమాలకు కూడా మణిశర్మ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. అదేంటో ఒక్క ‘ఆచార్య’ సినిమాకి ఆ సెంటిమెంట్ పని చేయలేదు.
అయితే గత కొన్నేళ్లలో ఆడియెన్స్ అభిరుచుల్లో చాలా మార్పు వచ్చింది.మరి ముఖ్యంగా కరోనా తర్వాత ఆడియెన్స్ ఓటీటీ ఫ్లాట్ఫామ్లో చూడడానికి అలవాటు పడ్డారు. మిగతా భాషల సినిమాలు చూడడానికి అలవాడు పడ్డారు. ఈక్రమంలో పెద్ద స్టార్స్ నటించిన సినిమాలైనా కూడా కథ, కథనం బాగుందనే టాక్ వస్తే తప్ప చూడట్లేదు. అది కూడా థియేటర్స్లో మాత్రమే చూడాల్సిన సినిమా అంటేనే థియేటర్స్ కు వెళ్తున్నారు. లేకపోతే ఓటీటీలో వచ్చాక చూద్దాం అని అనుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ నటించిన సినిమాకు మొదటి రోజు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగా నమోదయ్యాయి. పెద్ద హీరోల మూవీస్ చూడటానికి పెద్దగా ఇష్టపడని ఆడియెన్స్ సుడిగాలి సుధీర్ సినిమా చూసేందుకు రావడం ఆసక్తికర విషయమే. తెలంగాణ,ఏపీలోని బీ,సీ సెంటర్స్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘గాలోడు’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.2.7 కోట్ల వరకు షేర్ ను రావాలి. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుంది. పదకొండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 4.38 కోట్ల వసూళ్లను రాబట్టింది.




















గోవాలో జరుగుతోన్న 53వ అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాల్లో పాల్గొన్న దర్శకుడు బోయపాటి చేసిన వాఖ్యలను బట్టి నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. బోయపాటి మాట్లాడిన సమయంలో బాలకృష్ణ కూడా పక్కనే ఉన్నారు. మోక్షజ్ఞని మీరే పరిచయం చేస్తారా అని ప్రశ్నించగా బోయపాటి అవునని కానీ, కాదని కానీ చెప్పకుండా, అతన్ని సిని పరిశ్రమకి ఎలా, ఎప్పుడు పరిచయం చేయాలి అని వారి కుటుంబానికి కూడా ఒక ప్లాన్ ఉంటుంది. మోక్షజ్ఞకి ఏ డైరెక్టర్ సెట్ అవుతాడు. అతని బాడీ లాంగ్వేజ్,ఇమేజ్ కి ఎలాంటి స్టోరీ అయితే సెట్ అతనే లాంచ్ చేస్తాడని బోయపాటి అన్నారు.
ఇంకా మాటాడుతూ నేనే పరిచయం చేస్తానని చెప్పలేను.ఆ సమయం వస్తే, ఎంట్రీ అలా జరిగిపోతుంది. మన చేస్తుల్లో ఏం లేదు, అంతా దైవేచ్చ. ఆ అప్పటిదాకా మనమంతా ఎదురుచూడాలి అని మోక్షజ్ఞ ఎంట్రీ గురిచి చెప్పారు. పక్కనే ఉన్న బాలయ్య చిన్నగా నవ్వాడు.కానీ ఏం మాట్లాడలేదు. ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేని హీరోగా పాన్ ఇండియా సినిమాని తీస్తున్న సంగతి తెలిసిందే. హీరో నందమూరి బాలకృష్ణ తన 107వ చిత్రం వీరసింహారెడ్డితో సంక్రాంతి పండుగాకి బరిలోకి దిగుతున్నారు.

