తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు.
బాహుబలిలో ప్రభాస్ అసలు అప్పటి వరకు నటించని ఒక పాత్రలో నటించారు. అందుకోసం చాలా కష్టపడ్డారు. అందుకు తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూశారు.
బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయింది. ఇక ఇదిలా ఉంటే సలార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్రభాస్. అంతే కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. అయితే ప్రభాస్ ఈ సినిమాలన్నీ వరుసగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అందుకే విరామం లేకుండా ఈ మూడు సినిమాల షూటింగ్ వరుసగా చేస్తూనే ఉన్నారు. ఒక సినిమా షూటింగ్ చేస్తూనే మరొక సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలన్నీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విడుదల చేయాలి అనే సినిమా బృందం కూడా భావిస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ కి వరుస సినిమాలతో పండగే అని అంటున్నారు. అంతే కాకుండా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో కృతి సనన్ హీరోయిన్ గా నటించారు.