కరోనా తరువాత గడిచిన గత కొన్ని నెలలుగా టికెట్ రేట్ల కారణంగా ప్రేక్షకులు చాలా వరకు థియేటర్ల ముఖం చూడాలంటే భయపడుతున్నారు. ఫ్యామిలీతో రావాలంటే జేబు గుల్లయిపోతోంది. ఇంటిలో నలుగురు సినిమాకు వెళితే టికెట్ రేట్లు స్నాక్స్ కలిసి రూ.2000 ఖర్చు చేయాల్సిన పరిస్తితి. ఈ భయం వల్లే సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు.
ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలకు బడ్జెట్ ని బట్టి టికెట్ రేట్లని పెంచారు. అయితే ఆ సినిమాలపై వున్న క్రేజ్ కారణంగా భారీగా టికెట్ ధరలు పెంచినా జనం పెద్దగా పట్టించుకోలేదు. యితే ఆ తరువాత వచ్చిన సినిమాలకు కూడా భారీగా టికెట్ రేట్లు పెంచడం జనాలకు పెద్దగా నచ్చలేదు. దీంతో చాలా వరకు సినిమాలని తిరస్కరించడం మొదలు పెట్టారు.

అయితే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో విడుదల కానున్నాయి. ఒకే బ్యానర్ లో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ కావడం ఈ రెండు సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురుకావడం హాట్ టాపిక్ అవుతోంది. అంతే కాకుండా నైజాంలోని థియేటర్ల ఓనర్లు థియేటర్ల రెంట్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

థియేటర్ల ఓనర్లు ఈ దిశగా అడుగులు వేస్తే ఆ ప్రభావం మొదట మైత్రీ నిర్మాతల సినిమాలపైనే పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. థియేటర్ల రెంట్లు పెరిగితే మాత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలయ్యే సినిమాలు కలెక్షన్ల విషయంలో నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మైత్రీ నిర్మాతలు నైజాంలో సొంతంగా సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సిద్ధమైన సమయంలోనే థియేటర్ల రెంట్లు పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే టికెట్ రేట్స్ పెరిగిన నేపథ్యం లో పలు సినిమాలు నష్టాలను చవి చూశాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో రెంట్ల పెంపు ఏ మాత్రం కరెక్ట్ కాదు అని అభిప్రాయాలను వ్యక్తం అవుతున్నాయి.

హీరో ధనుష్ కు పక్కాగా సెట్ అయ్యే కథ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారని, వీరిని ఫైనల్ చేయాల్సి వుంది. ఇక శేఖర్ కమ్ముల స్టైల్ ఎమోషన్లు కూడా చాలా వుంటాయని తెలుస్తోంది. సినిమాలో ధనుష్ పాత్ర కాకుండా మరో ముఖ్య పాత్ర ఉంతుందని సమాచారం. ఎమోషనల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. రామ్ మోహన్ రావు, సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ మూవీలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియడానికి మరికొన్ని రోజులు ఎదురుచూడాలి.
దర్శకుడు శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ పనులతో ప్రస్తుతం బిజీగా ఉన్నారని, శేఖర్ కమ్ముల పారితోషికం భారీగా పెరిగిందని సమాచారం. అయితే 10 కోట్ల రూపాయల పారితోషికాన్ని శేఖర్ కమ్ముల తీసుకుంటున్నారని అంటున్నారు. హీరో ధనుష్ నటించే ఒక్కో సినిమాకు ముప్పై నుండి నలబై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ధనుష్ తెలుగులో నటిస్తున్న రెండవ సినిమా.
నయనతార ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు పని చేస్తారు. అయితే పనిచేసేవారిలో ఒకరికి 4 లక్షల అప్పు ఉందని తెలియగానే, వెంటనే నయనతార వారికి ఉన్న 4 లక్షల రూపాయల అప్పు తీర్చేసింది. పని వారి కష్టం తెలుసుకుని, తీర్చే గొప్ప మనసు నా కోడలిదని, అంతేకాకుండా తన దగ్గర పనిచేసేవాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా చేసేందుకు పెద్ద మనసు ఉండాలి. తన కోడలు పది మంది చేసే పనిని తనొక్కతే చేయగలదు అంటూ నయనతారను పొగిడింది విగ్నేష్ తల్లి మీనా కుమారి.
అయితే విగ్నేష్ తల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే నయనతార దంపతులు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు. మరో వైపు నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలలో అదే ఉత్సాహంతో నటిస్తోంది.ప్రస్తుతం ఆమె చేతి నిండా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక అత్యదిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్లలో ఇప్పటికీ నయనతార టాప్ ప్లేస్ లో ఉంది.
‘పుష్ప’ సినిమాను సెప్టెంబర్లో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రష్యన్ సబ్టైటిల్స్తో ప్రదర్శించారు. నిర్మాతలు ఈ వేదిక మీదే ఈ మూవీని రష్యన్ డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 8న ‘పుష్ప’ సినిమాని రష్యాలో విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. పోస్టర్ను కూడా విడుదల చేసి, రష్యన్ భాషలో ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో మాస్కోలో డిసెంబర్ 1న,సెయింట్ పీటర్స్బర్గ్లో 3న ప్రీమియర్స్ వేయనున్నారు.
అంతేకాకుండా పుష్ప మూవీ యూనిట్ కూడా అక్కడి ఆడియెన్స్ ని పలకరించనున్నారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప 2’ మూవీ షూటింగ్తో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తొలి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప-2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని హంగులతో పుష్ప కంటే బాగా రెడీ చేయడానికి సుకుమార్ బృందం కస్టపడుతోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకమైన సెట్లో ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.


కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలయ్య షోకు 5వ ఎపిసోడ్ కు ఆహా ఫౌండర్స్ లో ఒకరైన అల్లు అరవింద్, తెలుగు దర్శకులలో గొప్పగా చెప్పుకునే కె రాఘవేంద్రరావు, టాప్ నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబు వస్తున్నారని తెలుస్తోంది.అయితే ఈ ఎపిసోడ్ లో సినీ రంగం గురించి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అన్ స్టాపబుల్ షో కోసం ఇరవై నుండి ముప్పై కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు షో నిర్వాహకులు.
ఆహా ఓటీటీకి రోజు రోజుకి రెస్పాన్స్ పెరుగడంతో, అది బాలకృష్ణ షో వల్లే ఆహా సబ్ స్క్రిప్షన్లు పెరిగాయని అంటున్నారు. బాలకృష్ణ కూడా భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య షో వల్లే ఆహా రేంజ్ ను పెరిగిందని కొందరు అంటున్నారు. అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతున్న క్రమంలో ప్రతి ఎపిసోడ్ ని స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇక అందులో భాగంగా రాబోయే ఎపిసోడ్స్ ని మరింత గ్రాండ్ గా ఉండేట్టు ప్లాన్ చేస్తున్నారు.

చిరంజీవికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో నాకు తెలుసని మణిశర్మ చెప్పారు. ముందు ఇచ్చిన బీజీఎం వద్దని, దర్శకుడు కొరటాల శివ మీరు ఎలా అనుకుంటున్నారో అలా వద్దు. చాలా కొత్తగా ఉండాలని అన్నారని, దాంతో బీజీఎం కొరటాల శివ కోరిక మేరకు మార్చాల్సి వచ్చిందని మణిశర్మ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం మణిశర్మ అన్న మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దాంతో నెటిజన్లు ఆచార్య సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించారు.
ఏ చిత్ర బృందం అయినా తాము తీసిన సినిమా హిట్ అవ్వాలనే తీస్తారని, అవికొన్నిసార్లు అవి హిట్ అవుతాయి. మరి కొన్నిసార్లు ప్లాప్ అవుతాయని, దానికి ఎవరిని విమర్శించడం కరెక్ట్ కాదని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇంతవరకు మణిశర్మ, చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. చూడాలని ఉంది, ఇంద్ర, బావగారు బాగున్నారా, ఠాగూర్ ఇలా చేసిన సినిమాలన్ని మ్యూజికల్ హిట్స్. మృగరాజు, జై చిరంజీవ సినిమాలకు కూడా మణిశర్మ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. అదేంటో ఒక్క ‘ఆచార్య’ సినిమాకి ఆ సెంటిమెంట్ పని చేయలేదు.
అయితే గత కొన్నేళ్లలో ఆడియెన్స్ అభిరుచుల్లో చాలా మార్పు వచ్చింది.మరి ముఖ్యంగా కరోనా తర్వాత ఆడియెన్స్ ఓటీటీ ఫ్లాట్ఫామ్లో చూడడానికి అలవాటు పడ్డారు. మిగతా భాషల సినిమాలు చూడడానికి అలవాడు పడ్డారు. ఈక్రమంలో పెద్ద స్టార్స్ నటించిన సినిమాలైనా కూడా కథ, కథనం బాగుందనే టాక్ వస్తే తప్ప చూడట్లేదు. అది కూడా థియేటర్స్లో మాత్రమే చూడాల్సిన సినిమా అంటేనే థియేటర్స్ కు వెళ్తున్నారు. లేకపోతే ఓటీటీలో వచ్చాక చూద్దాం అని అనుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ నటించిన సినిమాకు మొదటి రోజు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగా నమోదయ్యాయి. పెద్ద హీరోల మూవీస్ చూడటానికి పెద్దగా ఇష్టపడని ఆడియెన్స్ సుడిగాలి సుధీర్ సినిమా చూసేందుకు రావడం ఆసక్తికర విషయమే. తెలంగాణ,ఏపీలోని బీ,సీ సెంటర్స్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘గాలోడు’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.2.7 కోట్ల వరకు షేర్ ను రావాలి. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుంది. పదకొండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 4.38 కోట్ల వసూళ్లను రాబట్టింది.




