రాజా వారు రాణి గారు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులోనూ ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ తో గ్యాప్ లేకుండా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. అయితే వచ్చే ఏడాది కూడా కిరణ్ అబ్బవరం ఇదే జోష్ కొనసాగిస్తాడని సమాచారం.
2019లో వచ్చిన ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేశాడు కిరణ్ అబ్బవరం.అమాయకత్వంతో కూడిన తన నటనతో మంచి మార్కులు వేయించుకున్నాడు.ఈ మూవీ డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 2021 లో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ కిరణ్ అబ్బవరం రేంజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. కరోనా టైంలో సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించారు దర్శక నిర్మాతలు. అయితే సెకండ్ లాక్ డౌన్ తర్వాత విడుదలైన ఈ సినిమా సక్సెస్ అందుకుని థియేటర్లకు పూర్వ వైభవాన్ని తెచ్చిన సినిమాగా నిలిచింది.

టాలెంట్ అనేది ఉంటే ఏరంగంలోనైనా నిలదొక్కుకోవచ్చు. అయితే సినిమా రంగంలో టాలెంట్ పాటు లక్ కూడా కావాలి. కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిల్మ్స్ నుంచి కెరీర్ ను స్టార్ట్ చేసి, ప్రస్తుతం ఫుల్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు.కిరణ్ హిట్ అయినా, ఫ్లాప్ అయినా సినిమాల విడుదల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.ఈ యంగ్ హీరో వరుస సినిమాలను విడుదల చేస్తునే ఉన్నాడు.
ఈ ఏడాది లో మూడు చిత్రాలను విడుదల చేశాడు. తన మూడో సినిమా కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ గా ‘సెబాస్టియన్ పిసి 524’తో వచ్చాడు. ఈ సినిమాలో అతను నైట్ బ్లైండ్డ్ పోలీసు పాత్రలో నటించాడు.ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అవలేదు. ఆ తరువాత మే 24న‘సమ్మతమే’ విడుదలై హిట్ అయ్యింది. సెప్టెంబర్ 16న విడుదలైన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ డిజాస్టర్గా నిలిచింది.

అయినా కూడా కిరణ్ జోష్ ఏమాత్రం తగ్గలేదు. హిట్టు, ఫ్లాప్ లను బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుండటంతో అతని చేతినిండా సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజా అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం కిరణ్ చేతిలో పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఏఎమ్ రత్నం & ఏషియన్ సినిమాస్, గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్లతో త్వరలో సినిమాలు రాబోతున్నట్టు తెలుస్తున్నాయి. ఈ ఏడాదిలాగే వచ్చే ఏడాది (2023)లోనూ కిరణ్ అబ్బవరం ఫుల్ బిజీగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే వీటిలో ఒకటో, రెండు హిట్ అయినా ఈ హీరోకి స్టార్ స్టేటస్ దక్కుతుంది.

ఈ సినిమా పదకొండు వందలకోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అంతే కాకుండా గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపిక అయ్యింది. రాజమౌళి కూడా హాలీవుడ్లో గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లాంటి అరుదైన గౌరవాలు దక్కాయి. అయితే గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’గ్రాండ్గా జపాన్ లో విడుదల అయ్యింది. ఈ క్రమంలో అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ మరో ఫీట్ సాధించింది. బాహుబలి’ రికార్డ్స్ ని బీట్ చేసి, అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన 2వ ఇండియాన్ సినిమాగా నిలిచింది.
ఇదే కాకుండా అత్యంత వేగంగా మూడు వందల మిలియన్ల క్లబ్లో చేరిన ఫస్ట్ భారతీయ సినిమాగా నిలిచి,రెండవ స్థానంలో ఉన్న బాహుబలి 2 ని వెనక్కి పంపింది. జపాన్లో విడుదలైన 34 రోజుల్లోనే అక్కడి కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు వసూల్ చేసింది. అంటే మన కరెన్సీలో రూ.17.9 కోట్లు. అయితే 27 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘ముత్తు’ సినిమా విడుదలై రూ.23.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ అదే సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియాన్ సినిమాగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇన్ని ఏళ్లు గడిచిన ఆ రికార్డ్ రజినీ కాంత్ పేరిటే ఉందంటేనే తెలుస్తోంది. ముత్తు సినిమా తరువాత రెండో స్థానంలో నిలిచింది ఆర్ఆర్ఆర్.
ఇక జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో వచ్చే ఏడాది హాలీవుడ్ లేవల్లో అడ్వంచర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ కోసం ప్రిపేర్ సిద్ధం అవుతుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నాడు.




ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోయిన మహేష్ తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది అన్నను, తల్లిని, తండ్రిని కోల్పోవడాన్ని మహేష్ బాబుకి తీరని బాధే. మహేష్ కు చిన్నాన్న ఆదిశేషగిరిరావు తోడుగా ఉన్నారు. ఆదిశేషగిరిరావు తన అన్న అయిన కృష్ణతో 70 ఏళ్లపాటు కలిసి ప్రయాణం చేసారు. ఆదిశేషగిరిరావు సైతం అన్నయ్య లేరనే నిజాన్ని నమ్మలేక బాధపడుతున్నారు. వైద్యులు కృష్ణకు గుండెపోటుతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పారు. దాని కోసం వైద్యం చేస్తున్నామని చెప్పారు. అయితే ఆరోగ్యంగా ఉన్న ఆయనకు అంత హఠాత్తుగా ఆయన ఆరోగ్యం ఎందుకు క్షీణించింది అని అంతా అనుకుంటున్నారు. మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. దీంతో సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడానిక ముందు అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి.
కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఈ విషయం గూర్చి వివరణ ఇచ్చారు. కృష్ణ చనిపోవడానికి ముందు ఎలా ఉన్నారు. తనతో ఏం మాట్లాడారు,ఆ తర్వాత ఏమైంది అని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ చనిపోయిన ముందురోజు ఆదివారం,ఆరోజున పొద్దునే ఆదిశేషగిరి రావు కృష్ణ దగ్గరకు వెళ్లారట. కృష్ణతో రెండు గంటలకు పైగా గడిపారంట, ఆ సమయంలో కృష్ణ చిన్నప్పటి సంగతులు చాలా చెప్పారని, సైకిల్ పై ఇద్దరూ సినిమాలకెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారట. ఆ మాటలు మాట్లాడుతూ ఇద్దరూ బాగా నవ్వుకున్నారని, సినిమాల గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలో కృష్ణలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ ఆ సమయంలో చాలా హుషారుగా కనిపించారని, ఇంట్లోనే భోజనం చేసి వెళ్లమని కృష్ణ అడిగినప్పటికీ, వేరే వాళ్లను భోజనానికి ఇంటికి రమ్మన్నని చెప్పాను. అయితే ఇంకోసారి లంచ్కి రా అని అన్నారు. ఆ తరువాత ఇంటికి వచ్చేశానని ఆదిశేషగిరిరావు తెలిపారు.
ఆదివారం రోజు రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తరువాత అన్నయ్యకి 12.30కి గుండెపోటు వచ్చిందని చెప్పారు. అన్నయ్యకు గురకపెట్టే అలవాటు ఉంది. గదిలో నుండి గురక శబ్దం వినిపించకపోయేసరికి అన్నయ్య అవసరాలు చూసుకునే కుర్రాడికి అనుమానం వచ్చి పల్స్ చెక్ చేసి, ఏదో తేడాగా అనిపించేసరికి ఫోన్ చేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని, ఆ తర్వాత నేను వెళ్లా. కానీ అన్నయ్యకి గుండెపోటు వచ్చి అప్పటికే ముప్పైనిమిషాలు అవడంతో అవయవాల మీద ఆ ప్రభావం పడింది. రక్త ప్రసరణ కూడా ఆగిపోయింది. వైద్యులు 30 గంటలకు పైగా వైద్యం చేశారు.అయిన కూడా ఫలితం లేకపోయిందని ఆదిశేషగిరిరావు తెలిపారు.










