కమెడియన్ ఆలీ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఎన్నో తెలుగు సినిమాల్లో కమెడియన్ గా నటించి ఆలీ నవ్వించాడు. టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో ఆలీ కూడా ఒకరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు అయిదు దశాబ్దాలుగా హాస్యాన్ని పండిస్తూ అలరిస్తున్నాడు ఆలీ. కేవలం ఇటు తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా ఆలీ నటించాడు. ఇప్పటి దాకా ఏకంగా వెయ్యికి పైగా సినిమాల లో ఆలీ నటించాడు.
మొట్టమొదట అలీ 1979లో నిండు నూరేళ్లు సినిమా లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అలానే ఆ తరవాత ఎన్నో చిత్రాలలో చేసాడు. అమ్మా నాన్న తమిళ్ అమ్మాయి, సూపర్ సినిమాలకి ఫిలిం ఫేర్ అవార్డు కూడా ఆలీకి వచ్చింది. కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా అలీ రాణించాడు.

ఏకంగా 50 సినిమాల్లో హీరోగా నటించడం విశేషం. ఆలీకి 1994 జనవరి 23 న వివాహం అయ్యింది. ఆయన భార్య పేరు జాబేడా సుల్తానా. ఆలీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆలీ పెద్దమ్మాయి పేరు ఫాతిమా రామిజున్. చిన్న కూతురు పేరు జువేరియా మీతి. ఆలీ చిన్న కూతురు జువేరియా మీతి ‘గంగా నది’ అనే సినిమా లో నటిస్తోంది. ఈమె ఎంతో అందంగా, క్యూట్ గా ఉంటుంది. ఆలీ చిన్న కూతురు జువేరియా మీతి ఇలా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.















ఈయన పుత్రుడు సంజయ్ రావు “ఓ పిట్ట కథ” అనే మూవీ ద్వారా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. దీంతో సంజయ్ అంతగా ప్రేక్షకులను దగ్గర కాలేకపోయాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అప్పటినుండి సంజయ్ ఏ సినిమాలో రాలేదు. అయితే తాజాగా తన తదుపరి సినిమాకు సంబంధించి అప్డేట్ రిలీజ్ అయింది.
అలాగే మిమ్మల్ని పెళ్లికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం అంటూ మోషన్ పోస్టర్ ను ముగించారు. అయితే ఈ సినిమాను పూరి జగన్నాథ్ శిష్యుడు ఏ ఆర్ శ్రీధర్ తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్నారు. మైక్ మూవీస్ బ్యానర్ పై వెంకట్ అన్నపురెడ్డి, అక్కిరెడ్డి నిర్మిస్తున్నారు.
ఆరేళ్ల వయసులోనే పాడటం, నాట్యం చేయటం నేర్చుకుంది. సినిమాల్లో నటించాలనే కోరిక తో చెన్నై చేరుకుంది. మొదట డాన్సర్ గా నటించిన సూర్యకాంతం అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియపరచి 75 రూ. అడిగిమరీ తీసుకుంది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది.
తర్వాత సౌదామిని చిత్రంలో హీరోయిన్ పాత్ర వచ్చింది కానీ, కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం చేజారిపోయింది. సంసారం సినిమా లో మొట్టమొదటి సారిగా గయ్యాలి అత్త పాత్ర వేసింది. ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది. బి.నాగిరెడ్డి,చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసే వారు కాదు.
ఆ రోజుల్లోనే అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి- సూర్యకాంతం, రమణారెడ్డి- సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు- సూర్యకాంతం జంటలను వాళ్ళు నటించిన సినిమాలను గుర్తుకు తెచ్చుకొని ఇప్పటికి కూడా హాయిగా నవ్వుకుంటారు. ప్రేక్షకులు, సినిమా డిస్ట్రిబ్యూటర్లు కొత్త సినిమా వస్తే అందులో సూర్యకాంతం వుందా అని ఎదురు చూసేవారు. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.
ఈ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని అనుకోకుండా సినీనటి అయిపోయింది. మలయాళంలో తన సినీరంగాన్ని మొదలుపెట్టారు. తెలుగులో యువసేన సినిమా ఆమెను సక్సెస్ ఫుల్ తారగా మార్చేసింది. దాదాపు 30 సినిమాల్లో మెరిసి ఒక్కసారిగా ఎందుకు తెరమరుగై పోయారు.
ఈమెకు మోహన్ లాల్,మమ్ముట్టి, చిరంజీవి అంటే చాలా ఇష్టమట. నా ప్రతిభను గుర్తించి ప్రజలు నన్ను అభిమానించారని గోపిక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏది ఏమైనప్పటికీ మరోసారి ఆమె తెరపై కనిపించి అందరినీ మెప్పించాలని కోరుకుందాం.
ఈ తరుణంలో రమేష్ బాబు కూడా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత అంతగా రాణించలేక పోయారు. కానీ ఆయన హఠాత్ మరణం చెందారు. నాగేశ్వరరావు హీరోగా సుడిగుండాలు, వెలుగునీడలు మూవీస్ లో బాలనటుడిగా చేసిన నాగార్జున దీని తర్వాత హిందీ లో జాకీ ష్రాప్, మరియు మీనాక్షి శేషాద్రి హీరో హీరోయిన్లుగా సుభాష్ ఘాయ్ డైరెక్షన్లో మూవీ రీమేక్ గా 1986 లో విక్రమ్ సినిమాతో హీరో అయ్యారు. ఈ సినిమా విజయవంతం అయింది. ఇకపోతే బాలనటుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అనుభవం రమేష్ బాబుకు ఉంది.
ఈ తరుణంలో 23 సంవత్సరాల వయసులో సామ్రాట్ మూవీ తో హీరోగా అడుగు పెట్టాడు. కానీ అప్పటికే కృష్ణ మరియు ఎన్టీఆర్ మధ్య మాటలు లేవు. సినిమా ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని గెస్ట్ గా వచ్చారు. ఇది హిందీలో సన్నీ డియోల్ హీరోగా సూపర్ హిట్ సినిమా బేతా బ్ తెలుగులో రీమేక్ సామ్రాట్ పేరుతో వచ్చినది.. ఈ మూవీకి ఎస్వి రాజేంద్ర సింగ్ మొదటిసారి షెడ్యూల్ డైరెక్షన్ చేశారు. చాలా డబ్బు ఖర్చు అవుతున్నది షూటింగ్ అనేది ముందుకు సాగకపోవడంతో, సీనియర్ డైరెక్టర్ అయినా మధుసూదన్ రావుని మళ్లీ తీసుకున్నారు.
ఈ విధంగా ఆయన చేసిన తొలి మూవీ విజయవంతమైంది. అలాగే జగపతి బాబు కత్రోమ్ కే కిలాడీ సినిమాకు రీమేక్ గా సింహ స్వప్నం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు, దీన్ని కూడా మధుసూదన్రావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు తండ్రిగా కృష్ణంరాజు ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో జగపతిబాబు ద్విపాత్రాభినయం చేసిన కానీ మూవీ హిట్ అవలేదు.






నేషనల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్నా శ్రీదేవిని అప్పటిలో వివాహం చేసుకోవడానికి ఎంతో మంది తారలు, నిర్మాతలు క్యూ కట్టారు. కానీ శ్రీదేవి చివరికి బాలీవుడ్ నిర్మాత అయినా బోనికపూర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. దినికి ముందు శ్రీదేవి పెళ్లి విషయంలో కొందరు హీరోల పేరులు వినిపించాయి. మరి ఆ స్టార్స్ ఎవరో చూద్దాం రండి.
మురళీమోహన్ 19వ శతాబ్దిలో ఒక స్టార్ హీరో. అప్పటిలో మురళీమోహన్ తో శ్రీదేవికి పెళ్లి అని ఒక పుకార్లు ప్రచారం అయింది. అప్పుడే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న మురళీమోహన్ శ్రీదేవితో పెళ్లికి నిరాకరించటం జరిగిందట.
స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో యాంగ్రీ యంగ్ మాన్ శేఖర్ శ్రీదేవిని పెళ్లి చేసుకోమని స్వయంగా ఆమె తల్లి కోరిందట. అప్పటిలో కెరియర్ పరంగా బిజీగా ఉన్న రాజశేఖర్ శ్రీదేవితో వివాహానికి నో చెప్పానని తెలిపారు.
ఇక బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీదేవి మిధున్ చక్రవర్తి ప్రేమలో పడింది. వీరిద్దరూ కొంతకాలం సీక్రెట్ గా సహజీవనం కూడా చేశారట. అప్పటికీ పెళ్లయిన మిథున్ చక్రవర్తి మొదటి భార్యను వదిలేస్తేగాని శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లి చెప్పడంతో, మిధున్ చక్రవర్తి తన మొదటి భార్యను చేసుకున్న తర్వాత తనకు కలిసి వచ్చిందని చెప్పి శ్రీదేవితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడట.
చివరకు బోనీ కపూర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది శ్రీదేవి. వీరిద్దరి వివాహానికి ముందే శ్రీదేవి గర్భవతి కావడం వలన వీరి పెళ్లి హడావిడిగా జరిగిపోయింది అని అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.