ప్రియాంక సింగ్ ఇప్పుడు పరిచయం అక్కర్లేని ఒక సెలబ్రిటీ. తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా వచ్చి మరింత ఫేమస్ అయింది ప్రియాంక. మొదట ఈమె జబర్దస్త్ షోలో లేడీ గెటప్ లు వేస్తూ ఫుల్ ఫామ్ ని సంపాదించుకుంది. అబ్బాయిగా ఉండగానే షోలో జాయిన్ అయిన తర్వాత ఆమె ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారిపోయింది.
అయితే గత కొద్ది రోజులుగా ప్రియాంక ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. పది రోజులుగా హాస్పిటల్ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటుంది. ఇంతకీ ఏం జరిగిందంటే ఈ ముద్దుగుమ్మ డీ జోడి డాన్స్ షో చేస్తుంది. యాంకర్ శివతో కలిసి ఈమె స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అలవాటు లేని పని కావడంతో విపరీతంగా బాడీపెయిన్స్ రావటం వలన ఎక్కువగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు యూస్ చేసిందంట ప్రియాంక. అలా మాత్రలు వేసుకొని ఆరోగ్యం మొత్తం పాడు చేసుకుంది.

ఆమె ఆరోగ్యం ఎంతగా పాడైందంటే కిడ్నీలు కూడా పాడైపోయే స్థితికి చేరుకుంది. ప్రస్తుతం డిహైడ్రేషన్ ఎక్కువై విపరీతమైన జ్వరంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. గత పది రోజులుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ప్రియాంక. రకరకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ నరకం చూస్తుంది. అయితే తాను చేసిన తప్పు మరెవరూ చేయకూడదనే ఉద్దేశంతో దీనంతటిని వీడియో తీసి యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది ప్రియాంక. ఐస్ వాటర్ టాస్క్ ఆడి కాళ్ళకు చర్మం ఊడిపోగా జండుబాం రాసి వాటిని మరింత ఎక్కువ చేసింది. ఇప్పుడు కూడా తనకు తానే తెలిసీ తెలియని వైద్యం చేసుకుని అనారోగ్య సమస్యలు తెచ్చుకొని హాస్పిటల్ పాలయింది.







శాకుంతలం చిత్రంలో సమంత శకుంతలగా, దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలకపాత్రలో నటించాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడిగా స్టార్ హిరో అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ నటించింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సమంత, దర్శకుడు గుణశేఖర్ విమర్శల పాలయ్యారు. సోషల్ మీడియాలో డైరెక్టర్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు. సమంత ఆ పాత్రకు సెట్ అవలేదని విమర్శించారు.
ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాగా, అక్కడ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఓటీటీ రిలీజ్ లోనూ ట్రోలింగ్ తప్పలేదు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయిన భరతుడిగా అల్లు అర్హ నటనను, డైలాగ్స్ ను మాత్రం అందరు మెచ్చుకున్నారు. అల్లు అర్హకు బాలనటిగా ఇదే మొదటి చిత్రం. అయినప్పటికి ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా నటించడంతో పాటుగా, తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. అర్హ నటించిన సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని ఒక వీడియో షికారు చేస్తోంది. దేవ్ మోహన్ అల్లుఅర్హను ఎత్తుకుని మాట్లాడుతున్న సన్నివేశంలో అల్లుఅర్హ వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దానిని చూసిన నెటిజెన్లు కొంచెం చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







మహేష్ బాబు జక్కన్నతో మొదటిసారి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రం మహేష్ 29వ సినిమాగా రాబోతుంది. ఇక ఈ మూవీ మొదలుపెట్టక ముందే అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం అంతకుమించి ఉండేలా మహేష్ తో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ తిరుగు తున్నాయి. ఇక రాజమౌళికి మోహన్ లాల్ అంటే చాలా అభిమానమని, తన గత చిత్రాల కోసం మోహన్ లాల్ ను జక్కన్న సంప్రదించారని వినిపిస్తోంది.
అయితే ఆ టైంలో మోహన్ లాల్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో జక్కన్న చిత్రాలకు అంగీకరించలేదు. అయితే జక్కన్న మోహన్ లాల్ కోసం ఇప్పటి నుండి సంప్రదిస్తున్నారు. కాబట్టి ఈ చిత్రంలో మోహన్ లాల్ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొందరు మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో మోహన్ లాల్ తప్పకుండా నటిస్తారని అంటున్నారు.

