ఒకప్పుడు సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయడం, అభిమాన హీరో సినిమా అయితే మరోసారి వెళ్ళి చూసేవారు. ఆ మూవీ కొన్నేళ్ళ తారువాత టీవీల్లో ప్రసారం అయితే చూసి మరోసారి చూసి ఎంజాయ్ చేసేవారు. వాటిలో అభిమాన తరాల డైలాగ్స్, డ్యాన్స్, పాటలు గుర్తుపెట్టుకునేవారు.
అయితే ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక సినిమాలను చేసే యాంగిలే ఛేంజ్ అయిపోయింది. మూవీని థియేటర్లో వీక్షించినపుడు కథ, నటన, మేకింగ్ పై మాత్రమే దృష్టిపెట్టే ఆడియెన్స్, ఓటీటీలో చాలాసార్లు చూస్తూ, ప్రతి దాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. తాజాగా యనిమాల్ మూవీలో నాన్న అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో వైరల్ గా మారింది. దాని లాగే ఏ ఏ సినిమాలలో ఒక పదం ఎన్నిసార్లు రిపీట్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం..
1. యానిమల్ – నాన్న ( పాపా ):
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన యనిమాల్ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నాన్నను అమితంగా ప్రేమించే కొడుకుగా రణబీర్ కపూర్ నటించారు. తండ్రిగా అనిల్ కపూర్ గా నటించగా, ఈ మూవీలో రణబీర్ నాన్న (పాపా) అని చాలా సార్లు పిలుస్తాడు. అలా నాన్న అనే పదం దాదాపుగా 196 సార్లు రిపీట్ గా అయినట్టు తెలుస్తోంది.
2. ఖడ్గం – నువ్వు నువ్వు:
కృష్ణవంశీ దర్శకత్వంలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ఖడ్గం. ఈ మూవీలో శ్రీకాంత్ కు జంటగా హీరోయిన్ సోనాలి బింద్రే నటించింది. వీరి మధ్య వచ్చే ‘నువ్వు నువ్వు’ అంటూ వచ్చిన పాట సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ పాటలో నువ్వు నువ్వు అనే పదం 90సార్లకు పైగా రిపీట్ అయ్యింది.
3. ఆచార్య – పాదగట్టం:
కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. ఈ మూవీ కథ పాదఘట్టం అనే ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఈ పదాన్ని మూవీలో 90సార్లకు పైగా పలకడం విశేషం.
4. బ్రహ్మాస్త్ర – శివ:
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర మూవీ హిందీ మరియు తెలుగులో కూడా హిట్ అయ్యింది. ఈ మూవీలో రణబీర్ కపూర్ శివ అనే పాత్రలో నటించారు. ఈ మూవీలో శివ అనే పదం 103 సార్లు రిపీట్ అయ్యింది.
Also Read: సోనాలి బింద్రే నుండి హంసా నందిని వరకు… “క్యాన్సర్” బారిన పడిన 5 హీరోయిన్స్.!










గత ఏడాది రామ్ చరణ్-ఉపాసన జంటకు క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలిలోకి వారసురాలు అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీ అంతా సంతోషంలో మునిగితేలుతుంది. క్లీంకార జన్మించినప్పటి నుండి వారి ఫ్యామిలిలో శుభాలే జరుగుతున్నాయి. గత ఏడాది రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలవడం, లావణ్య వరుణ్ తేజ్ పెళ్లి, తాజాగా చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ ప్రకటించడం వరుసగా శుభవార్తలే వినిపిస్తున్నాయి. ఇదంతా తన మనవరాలి రాక వల్లే అని ఆస్కార్ వచ్చిన సమయంలో మెగాస్టార్ స్టేట్మెంట్ సైతం ఇచ్చారు.
క్లీంకార ఫోటోను ఇప్పటివరకు రివీల్ చేయలేదు. క్లీంకారతో బయటికి వచ్చినా ఆమె ఫేస్ కనిపించకుండా చరణ్, ఉపాసన జాగ్రత్త పడుతున్నారు. మరో వైపు మెగా ఫ్యాన్స్ అంతా ఆమెను చూడాలని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఉపాసన క్లీంకార ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినా ఆమె ముఖం కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేస్తోంది. అయినప్పటికి ఆ క్లీంకార ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా క్లీంకారకు సంబంధించిన మరో విషయం వైరల్ గా మారింది. అది ఏమిటంటే, ఆమె కేర్ టేకర్ సావిత్రి శాలరీ.
రామ్ చరణ్ ఉపాసన క్లీంకార కోసం ఒక కేర్ టేకర్ ను పెట్టుకున్నారు. ఆమె సెలెబ్రెటీ సావిత్రి. ఆమె ఇంతకు ముందు పలువురు సినీ సెలబ్రెటీల పిల్లలకు కేర్ టేకర్ గా వ్యవహరించారు. బాలీవుడ్ లో కరీనా కపూర్ కొడుకు తైమూరుకు, షాహిద్ కపూర్ పిల్లలకు సావిత్రి కేర్ టేకర్ గా వ్యవహరించారు. ఒక ఇంటర్వ్యూలో కరీనా సావిత్రి పై ప్రశంసలు కురిపించింది. రీసెంట్ గా రామ్ చరణ్ దంపతులు ముంబై వెళ్లారు. అది సావిత్రిని కలవడానికే అని టాక్. క్లీంకార కేర్ టేకర్ గా పనిచేస్తున్న సావిత్రికి లక్షన్నర జీతం ఇస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.







కథ:













