తెలుగు సినిమా ఇండస్ట్రీని నిలబెట్టిన వాళ్లలో మొదటి పేరు నందమూరి తారక రామారావు గారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇప్పుడు తారక రామారావు గారు లేకపోయినా కూడా ఆయనని అందరూ చాలా గొప్పగా చూస్తారు. అంత పేరు సంపాదించుకున్నారు. నందమూరి తారక రామారావు గారు అంటే దైవ సమానులు అని అంటారు. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా అప్పట్లో ప్రజలకి కూడా ఎంతో సేవ చేశారు.

రాజకీయాల్లోకి దిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేశారు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ ఈ స్థాయిలో ఉండడానికి మొదటిగా పునాది వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన అప్పట్లో ఎన్నో పాత్రలు చేసి తెలుగు ప్రజలు అందరూ కూడా ఇప్పటికీ గర్వపడే అంత స్థాయికి సినిమా ఇండస్ట్రీ ని తీసుకెళ్లారు. అయితే అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్స్ ఎక్కువగా చెన్నైలో జరిగేవి.

అందుకే ఇప్పుడు ఉన్న చాలా మంది స్టార్ హీరోలు పుట్టింది, పెరిగింది చాలా వరకు చెన్నైలోనే అయ్యి ఉంటుంది. నందమూరి తారక రామారావు గారు కూడా చెన్నైలో ఒక ఇల్లు నిర్మించుకున్నారు. కుటుంబం అంతా కూడా చెన్నైలోనే ఉన్నారు. ఈ ఇల్లు దాదాపు 70 సంవత్సరాల క్రితం నాటి ఇల్లు. ఈ ఇల్లు ఇప్పటికి కూడా ఉంది. అయితే అప్పట్లోనే ఎంతో అధునాతనంగా ఈ ఇంటిని నిర్మించారు. ఇల్లు చాలా పెద్దది అని బయట నుండి చూస్తుంటేనే అర్థం అవుతుంది.

అంతే కాకుండా సెక్యూరిటీ కూడా చాలా గట్టిగా ఉండేలాగా చూసుకున్నారు. గోడలకి కంచె ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, ఒక సెక్యూరిటీ గార్డ్ ని నియమించి, ఇప్పటి కాలంలో బయట సెక్యూరిటీ గార్డ్ కి ప్రత్యేకంగా ఒక షెల్టర్ లాంటిది ఎలా అయితే ఉంటుందో, అలాంటి షెల్టర్ అప్పట్లోనే నిర్మించారు. ఇప్పటికి కూడా ఆ షెల్టర్ అలాగే ఉంది. ఎటువైపు నుండి కూడా ఎవరు ఆగంతకులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండేలాగా ఇంటి చుట్టూ భద్రత బాగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇంట్లోకి ఇప్పటికీ ఎవరికీ ప్రవేశం లేదు. ఆ ఇంటిని భద్రంగా అలాగే ఉంచారు. అంతే కాకుండా ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గర చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉండేవారు. వారిలో సావిత్రి గారు కూడా ఉన్నారు. చెన్నైలో కూడా ఎన్టీఆర్ గారి ఇంటిని ఇప్పటికీ అలాగే భద్రంగా ఉంచారు అని అంటే అక్కడివారికి కూడా ఎన్టీఆర్ గారు అంటే ఎంత అభిమానమో మనమే అర్థం చేసుకోవాలి.
watch video :
ALSO READ : షూటింగ్ సెట్ లోనే హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన హీరో భార్య..! అసలు ఏం జరిగిందంటే..?







కన్నెగంటి బ్రహ్మానందం 1956లో ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లిలోని చాగంటి వారి పాలెం గ్రామంలో ఫిబ్రవరి 1న జన్మించారు. ఆయన తండ్రి పేరు నాగలింగాచారి, తల్లి పేరు లక్ష్మీ నర్సమ్మ. బ్రహ్మానందం ఎనిమిది మంది పిల్లలలో ఒకరు. తండ్రి వడ్రంగి పనిచేసేవారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసి, పశ్చిమగోదావరిలోని అత్తిలిలో బ్రహ్మానందం తెలుగు లెక్చరర్గా చేరారు. లెక్చరర్గా పనిచేస్తున్న సమయంలో థియేటర్లో మరియు మిమిక్రీ ఆర్టిస్ట్గా కూడా పనిచేశారు.
నవలా రచయిత ఆది విష్ణు ఆయనని దూరదర్శన్ (డిడి) ఎన్సివి శశిధర్కు పరిచయం చేశారు. అలా ఆయన 1985లో డిడి తెలుగు ఛానెల్ లో ప్రసారం అయిన పకపకలు షోతో టెలివిజన్లోకి అడుగుపెట్టారు. అందులో లో ఆయన నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. షోలో ఆయన నటన చూసిన దర్శకుడు జంధ్యాల అహ నా పెళ్లంట సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ అద్భుతమైన పాత్ర ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తరువాత వరుస అవకాశాలు రావడంతో స్టార్ కమెడియన్ గా ఎదిగారు.
గిన్నీస్ బుక్ రికార్డ్ మరియు పద్మ శ్రీతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన సోషల్ మీడియా మరియు మీమ్ కంటెంట్ మొదలైన తరువాత జిఫ్ గాడ్, గాడ్ ఆఫ్ మీమ్స్ అని పిలుస్తున్నారు. ఆయన లేకుండా మీమ్స్ ను ఊహించడం నేటి తరానికి అసాధ్యం అని చెప్పవచ్చు. ఆయన పుట్టిన రోజు(ఫిబ్రవరి 1) సందర్భంగా ఉదయం నుండి ఆయన మీమ్స్, ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన అరుదైన ఫోటోలను మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18. 

1. చిరంజీవి, సాయి ధరమ్ తేజ్:
2. వెంకటేష్ – నాగ చైతన్య:
3. నాగార్జున -సుమంత్:
4. మహేష్ బాబు – గల్లా అశోక్:
5. చిరంజీవి – వైష్ణవ్ తేజ్:
6. నాగార్జున – సుశాంత్:
7. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్:
8. అల్లు అరవింద్ – రామ్ చరణ్:
9. నాగబాబు – సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్:
10. అర్జున్ సర్జ – చిరంజీవి సర్జ:
11. అర్జున్ సర్జ – ధృవ సర్జ:
12. ఆమీర్ ఖాన్ – ఇమ్రాన్ ఖాన్:
13. మహేష్ భట్ – ఇమ్రాన్ హష్మి:
హీరోగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ హష్మి తన కంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకున్నారు.
సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నిర్మాతగా మారి తీసిన తమిళ చిత్రం ఫైట్ క్లబ్. ఈ చిత్రంలో విజయ్ కుమార్, మోనీషా మోహన్ మీనన్ జంటగా నటించారు. ఏ రహమత్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. 5 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను, 9 కోట్ల రూపాయలకు కు పైగా షేర్ ను వసూలు చేసింది. జనవరి 27 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, నార్త్ చెన్నై ప్రాంతంలో సెల్వ (విజయ్ కుమార్) అనే యువకుడు ఫుట్బాల్ ప్లేయర్ కావాలని కలలు కంటాడు. అయితే ఆ ప్రాంతంలో పిల్లలు స్కూల్ కి వెళ్ళకుండా గూండాలు మరియు డ్రగ్ పెడలర్స్ గా మారుతుంటారు. అక్కడి పరిస్థితులను మార్చాలనుకునే బెంజిమన్(కార్తికేయన్ సంతానం), సెల్వ ఫుట్బాల్ ప్లేయర్ ఎదగడానికి సహకరిస్తుంటాడు. రౌడీ కిర్బా (శంకర్ థాస్) బెంజీని అతని బ్రదర్ జోసెఫ్ (అవినాష్ రఘుదేవన్)తోనే హత్య చేయిస్తాడు. ఆ తరువాత పోలీసులు జోసెఫ్ ను జైలుకు పంపిస్తారు. బెంజి మరణంతో సెల్వ జులాయిగా, రౌడీగా మారతాడు.
రౌడీ కిర్బా రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. జైలు నుంచి రిలీజ్ అయిన జోసెఫ్ కిర్బా తనను మోసం చేసినట్టు గ్రహిస్తాడు. అతని పై పగ తీర్చుకోవడానికి సెల్వను వాడుకోవాలనుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఫుట్బాల్ ప్లేయర్ కావాలని కలలు కన్న సెల్వ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది మిగిలిన కథ. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఫైట్ క్లబ్ మంచి ఛాయిస్.


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ప్రియమణి నటించిన ‘నెరు’ మూవీ ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయ్యి, తెలుగు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీ డిసెంబర్ 21 న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో కీలక పాత్ర సారా మహమ్మద్. ఈ పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. చూపు లేని అమ్మాయి పాత్రలో అనశ్వర రాజన్ అద్భుతంగా నటించింది. ఆమె నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది.
కంప్లీట్ స్టార్ గా పేరుగాంచిన మోహన్ లాల్ తో నటించడం అంత సులభమైన విషయం కాదు. అయితే అనశ్వర పాత్ర మోహన్ లాల్ తో పాటు ట్రావెల్ అవుతూ ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు మళ్లించడంలో విజయం సాధించింది. అందువల్లే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె ఎవరా అంటూ నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. ఆమె కేరళలో ‘కరివెల్లూర్’ అనే టౌన్ లో 2002లో సెప్టెంబరు 8న జన్మించింది. అక్కడే పెరిగింది.
అనశ్వర 2017లో ‘ఉదాహరణం సుజాత’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 2019 లో తన్నీర్ మథన్ దినంగల్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. పలు చిత్రాలలో నటించి, ఫాలోయింగ్ ను పెంచుకుంది. మలయాళ యంగ్ హీరోలకు మొదటి ఆప్షన్ గా నిలిచింది. యారియాన్ 2 మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. నెరు మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. ఈ చిత్రం ప్రస్తుతం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లోస్ట్రీమింగ్ అవుతోంది.