సంక్రాంతి పండుగ కానుకగా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిలో వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ప్రేక్షకుల ఆదరణ తెచ్చుకోలేకపోయింది. సినిమా కథ బాగున్నప్పటికీ కూడా రాంగ్ టైం రిలీజ్ సినిమాని బాగా దెబ్బ తీసింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాథ్, రుహాణి శర్మ, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ముకేశ్ రిషి, జిషు సేన్ గుప్త, తమిళ నటుడు ఆర్య ముఖ్య పాత్రలు పోషించారు.

ఇది ఇలా ఉంటె ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన బడ్జెట్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ సినిమాకి 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంట. తమిళ నటుడు ఆర్యకి రూ. 5 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చారని తెలిసింది.ఇక మిగతా వాళ్ళకి ఇచ్చిన పారితోషికాలు కలుపుకుంటే ఈ సినిమాకి నిర్మాత బోయినపల్లి వెంకట్ చాలా ఖర్చు పెట్టారని తెలిసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ విడుదలకి ముందు బిజినెస్ కేవలం రూ.25 కోట్లు మాత్రమే అయిందని తెలుస్తోంది. ఒటిటి ద్వారా ఈ లాస్ కొంచెం రికవర్ అవుతుండొచ్చు.












సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమాని ఏ క్షణం మొదలు పెట్టారో కానీ, మొదటి నుండి ఆటంకాలు, ఆ తరువాత హీరోయిన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం, పలు రకాల ప్రచారాలు వచ్చాయి. ఓ దశలో ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు వచ్చాయి. ప్రకటించిన రిలీజ్ డేట్ కే విడుదల చేయాలని నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన పాటలు ట్రోలింగ్ బారిన పడ్డాయి.
ఆ సినిమా కాపీ అంటూ కొందరు, ఆ నవల కాపీ అంటూ మరికొందరు నెట్టింట్లో ఈ మూవీ పై విమర్శలు చేశారు. థియేటర్ల విషయంలోనూ వివాదాలు ఏర్పడ్డాయి. చివరికి విమర్శల మధ్యనే మూవీ రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో నెగెటివిటీ మొదలైంది. బుక్ మై షో యాప్ లో మూవీ రిలీజ్ కాకముందే 70 వేల మంది నెగెటివ్ రివ్యూలు ఇచ్చినట్టు చిత్ర యూనిట్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా మూవీ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. అయితే మహేష్ బాబు వల్లే కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు.
తాజాగా రవితేజ నటించిన దరువు మూవీలోని సీన్ ను త్రివిక్రమ్ కాపీ చేశారని, అదే సీన్ ను గుంటూరుకారంలో మహేష్ బాబుతో చేశారంటూ దరువు సీన్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియో పై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నిజమే అంటుండగా, కొందరు అదేం కాదని అంటున్నారు.
సంగీత దర్శకులు తమ సినిమాలలో ఒకటి లేదా రెండు పాటలు పడడం అందరికీ తెలిసిందే. అయితే ఆర్పీ పట్నాయక్ మాత్రం సినిమాలోని అన్ని పాటలు ఆయనే పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆర్పీ లాగే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా చాలా సినిమాలలో మొత్తం పాటలు పాడారు. అయితే టాలీవుడ్ లో ఈ సినిమా కోసం తెలుగు టాప్ 10 సంగీత దర్శకులు కలిసి ఒక పాటను పాడారు. ఆ సినిమా పేరు అందమైన మనసులో.
సంగీత దర్శకుడిగా ఎన్నో సినిమాలకు పనిచేసిన తరువాత, ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వైపుకు వెళ్లారు. అలా 2008 లో మొదటి సారిగా ‘అందమైన మనసులో’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రాజీవ్, రమ్య నంబీషన్ జంటగా నటించారు. ఈ సినిమాలోని “అమ్మాయి నవ్వింది.. అబ్బాయికి నచ్చింది” అనే పాటను పది మంది ప్రముఖ సంగీత దర్శకులు ఆలపించారు.
ఈ పాటను ఆలపించిన వారిలో ఆస్కార్ గ్రహీత ఎం ఎం కిరవాణి, రాజ్, కోటి, ఎస్ ఏ రాజ్ కుమార్, ఆర్ పి పట్నాయక్, రమణ గోగుల, చక్రి, శ్రీ కొమ్మినేని, వందేమాతరం శ్రీనివాస్, దేవి శ్రీ ప్రసాద్ ఉన్నారు. పది మంది అగ్ర సంగీత దర్శకులు కలిసి పాడటం అనేది ప్రత్యేకమైనది. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పాడటం అరుదైన విషయం అని చెప్పవచ్చు. మళ్ళీ ఇలాంటి పాట తెలుగులో రాదేమో. ఈ పాటకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.