తెలుగు తెరపై మంచి కాంబినేషన్ సెట్ అవుతుంది అంటే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారు అంటే ఆ సినిమా క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. తెలుగు తెరపై ఇప్పటి వరకు చాలా మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని హిట్ అయ్యాయి. మరికొన్ని భారీ ఫ్లాపులు అయ్యాయి.
అలా తెలుగు తెరపై ఎన్నో అంచనాల నడుమ వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం…!
1.ఆచార్య:

రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన RRR మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ నటించిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఆచార్య మొదటి రోజు నుండి డిజాస్టర్ టాప్ ను సొంతం చేసుకుని దారుణమైన కలెక్షన్స్ సాధించింది.
2. శంకర్ దాదా జిందాబాద్:మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ కాంబినేషన్ లో, పవన్ కళ్యాణ్ అతిధి పాత్రలో వచ్చిన చిత్రం శంకర్ దాదా జిందాబాద్ మూవీ. ఈ సినిమా కూడా శంకర్ దాదా ఎంబిబిఎస్ లో హిట్ అవుతుందని అంచనా వేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
3. సుల్తాన్:

సూపర్ స్టార్ కృష్ణ రెబల్ స్టార్ కృష్ణంరాజు నందమూరి బాలకృష్ణ కలిసి నటించిన మూవీ సుల్తాన్. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయింది.
4. అశ్వమేధం:

శోభన్ బాబు నటసింహం నందమూరి బాలకృష్ణ కలయికలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తరికెక్కిన మూవీ అశ్వమేధం. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది.
5. రామకృష్ణులు:

నందమూరి తారకరామారావు అక్కినేని నాగేశ్వరరావు హీరోలుగా జగపతి వి రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రామకృష్ణులు. ఈ మూవీ హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నాల హేరా పేరి సినిమాను కాస్త మార్చి తరకెక్కించారు. ఈ మూవీ కూడా అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది.
6. యుద్ధం:

సూపర్ స్టార్ కృష్ణ రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోలుగా నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ యుద్ధం. ఈ సినిమాలో కృష్ణ కృష్ణంరాజు తండ్రి తనయులగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.
7. కృష్ణార్జునలు:

దర్శకరత్న దాసరి డైరెక్షన్ లో సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు కలిసిన నటించిన మూవీ కృష్ణార్జునులు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది.
8.మహాసంగ్రామం:

సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కలిసి నటించిన భారీ మల్టిస్టారర్ మూవీ మహాసంగ్రామం. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది.
Also Read:“అర్జున్ రెడ్డి” వచ్చి 6 ఏళ్లయింది…కానీ క్లైమాక్స్ లో ఈ విషయం ఎప్పుడైనా గమనించారా?





గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ నటించింది. ఆ మూవీ హిట్ అవడంతో ఆమెకు క్రేజ్ వచ్చింది. 2005 లో మళయాళంలో రిలీజ్ అయిన ‘బాయ్ ఫ్రెండ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. 2008 లో ఆలయం మూవీతో తెలుగులో అడుగుపెట్టారు. ఆ తరువాత వర్షం సాక్షిగా లో నటించినా గుర్తింపు రాలేదు. ఆ తరువాత తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు.
2022 లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ తో ఆమెకు మంచి ఫేమ్ లభించింది. కానీ సినిమా ఆఫర్స్ మాత్రం ఎక్కువగా రాలేదు.సినీ అవకాశాలు ఎలా ఉన్నా, హనీ రోజ్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్. ఇతర ఈవెంట్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కి హాజరు అయిన హనీ రోజ్ న్యూ లుక్ లో వెరైటీగా కనిపించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూ హెయిర్ స్టైల్, ఆరంజ్ కలర్ డ్రెస్లో అచ్చం హాలీవుడ్ హీరోయిన్ హనీ రోజ్ కనిపించారు. ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించు కుందని కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. వాటిపై స్పందిస్తూ అవన్నీ రూమర్స్ అని క్లారిటీ ఇచ్చారు. హనీ రోజ్ ప్రస్తుతం మళయాళంలో ‘తేరీ మేరీ’ తెలుగులో ‘గాలి బ్రదర్స్’ సినిమాలలో నటిస్తున్నారు.
ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే. చిరంజీవి గారి పెళ్లి టైం కి ఆయన ఇంకా స్టార్ అవ్వలేదు. అల్లు రామలింగయ్య గారు అప్పటికే ఇండస్ట్రీ లో సీనియర్ నటుడు. అంత పెద్ద నటుడు తన కూతురుకి చిరుని ఇచ్చి ఎలా పెళ్లి చేసారు అని అప్పట్లో అందరు అనుకునే వారు. ఈ ప్రశ్నలకు సీనియర్ హీరోయిన్ జవాబిచ్చింది. చిరంజీవి సురేఖను వివాహం చేసుకోవడానికి సీనియర్ హీరోయిన్ రాజ శ్రీ నే కారణమట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు బయటపెట్టారు.


ప్రేక్షకులకు కూడా ఈ టీజర్ బాగా నచ్చి రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఆరాట పడిపోతున్నారు. చిత్ర బృందం కూడా త్వరలోనే ఈ చిత్రం వెండి తెర మీదకు వస్తుంది అని సమాచారం ఇచ్చారు. కానీ ఇప్పుడు జయం రవి ఫాన్స్ కు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రం నేరుగా ఓటీటీ లో విడుదల కాబోతుందట. అది కూడా ఈ జనవరి 26న డైరెక్ట్ గా జి5 లోకి ఈ చిత్రం విడుదల కానుంది అని తెలిసిన వెంటనే ఫాన్స్ అందరూ నిరాశ పడుతున్నారు.
రవి బస్రూర్ తన అసలు పేరు కాదని, తన గతాన్ని, ఎక్కడి నుండి వచ్చాడో ఇంతకు ముందు పలు ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా కన్నడ సరిగమప షోలో పాల్గొన్న రవి బస్రూర్, తన గతాన్ని, పేరు ఎందుకు మార్చుకున్నారో వివరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో తినడానికి కూడా ఏం దొరికేది కాదని, అప్పుడు తన జేబులో ఒక చిట్టీ మాత్రం ఉండేదని, ఏ రోజు, ఏ గుళ్లో ప్రసాదం ఏం పెడతారో అందులో రాసి పెట్టుకునేవారట.
ఆ చిట్టి ప్రకారం ఆ దేవాలయానికి వెళ్లి ప్రసాదం తింటూ తన కడుపు నింపుకునేవారట. అలాంటి సమయంలో కామత్ అనే పెద్దాయన ఆయనను బెంగళూరులోని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాడట. ఇత్తడి, బంగారు వస్తువుల తయారీ వంటి పనులు చేస్తాడని చెప్పాడట. అయితే ఇతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ పని చేస్తుంటాడాని చెప్పి, పనిలోకి తీసకోమని చెప్పాడంట, అయిత పని ఇచ్చిన వ్యక్తి గిటార్ కొనుక్కోవడానికి రూ. 35 వేలు ఇచ్చాడట. అది చూసి ఇద్దరు షాక్ అయ్యారట. పరిచయమే కూడా లేని వ్యక్తి అంత డబ్బు ఇవ్వడమేంటని షాక్ అయ్యారట.
అంతేకాకుండా ఫ్యూచర్ లో మంచి సంగీత దర్శకుడు అవుతాడని చెప్పాడు. ఇక ఇతన్ని కలవాలంటే ఐదు నెలలు అపాయింట్ మెంట్ తీసుకుంటారని అన్నాడట. అయితే అలాంటివాటిని తాను నమ్మనని రవి బస్రూర్ అన్నాడట. కానీ ఆ తరువాత ఆ వ్యక్తి చెప్పిందే జరిగింది. తనకు సాయం చేసిన ఆ వ్యక్తికి ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఆయన పేరు రవి. గౌరవం ఆయనకే దక్కాలనే ఉద్దేశ్యంతో ఆ వ్యక్తి పేరుని, తన గ్రామం పేరుతో కలిపి పెట్టుకున్నారట. అలా కిరణ్ నుండి రవి బస్రూర్ గా మారానని వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.









