సలార్ సినిమాతో హిట్ కొట్టి, ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ నిన్న విడుదల చేశారు. భీమవరంలో భారీ కటౌట్ ఏర్పాటు చేసి ఈ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ప్రభాస్ కి సంబంధించి కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. ప్రభాస్ ఈ సినిమాలో ఒక కామెడీ పాత్రలో కనిపిస్తారు అనే వార్త వచ్చింది. అంతే కాకుండా ఈ సినిమా హారర్ కామెడీ అని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారు అని కూడా అంటున్నారు.

ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే ఇదిలా ఉండగా, సినిమా పోస్టర్ మీద కామెంట్స్ వస్తున్నాయి. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుంగీతో కనిపిస్తున్నారు. లుక్ కొత్తగానే ఉంది. అయితే పోస్టర్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేసినట్టు ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పోస్టర్ కలర్ ఫుల్ గా ఉన్నా కూడా సహజంగా అనిపించట్లేదు. ప్రభాస్ ఇప్పుడు కొంచెం మారారు.

ఈ కారణంగా ఇటీవల విడుదల అవుతున్న చాలా పోస్టర్స్ లో ప్రభాస్ ని కొంచెం ఎడిట్ చేసి విడుదల చేస్తున్నారు. ప్రభాస్ బయట ఇంటర్వ్యూలలో కనిపించేటప్పుడు బానే ఉంటున్నారు. అసలు ఎడిటింగ్ అవసరం లేదు. కానీ పిక్చర్స్ మాత్రం చాలా హెవీగా ఎడిట్ చేసి విడుదల చేస్తున్నారు అని చూస్తే అర్ధం అవుతుంది. ఇటీవల విడుదల చేసిన కల్కి పోస్టర్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టర్ కూడా అలాగే ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పోస్టర్ లో కాళ్లు, చేతుల మూమెంట్ కూడా అలాగే ఉంది అంటూ, ఇది ఒరిజినల్ పోస్టర్ కాదు అని అంటున్నారు.

ప్రభాస్ లుక్ సినిమాలో ఇలాగే ఉంటుంది. కాకపోతే పోస్టర్ లో చూపించినంత ఎడిటెడ్ గా అయితే ఉండదు. అంతే కాకుండా పోస్టర్ లో మరొక పొరపాటు కూడా జరిగింది. అదేంటంటే, ప్రభాస్ పేరులో ఒక ఎస్ (S) అక్షరం ఎక్కువగా పడింది. చాలా మంది ప్రభాస్ న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకున్నారు అని అన్నారు. కానీ సినిమా బృందం ఇది కేవలం పొరపాటు మాత్రమే అని చెప్పింది. ఏదేమైనా సరే ఒక పెద్ద హీరో పోస్టర్ విడుదల చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
watch video :

ఆదిత్య హాసన్ తెరకెక్కించిన 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ అప్పటి తరం పిల్లలు, తల్లి తండ్రులు, 90లలోని పరిస్థితులను, ఎమోషన్స్, ఆకట్టుకునే డైలాగ్స్ తో పాటు మ్యూజిక్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్ 120 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఐఎండిబిలో 9.6 రేటింగ్ పొందింది. శివాజీ, వాసుకీ ఆనంద్, మౌళి, వసంతిక, రోహన్ రాయ్ నటించారు.
శివాజీ కూతురు దివ్య పాత్రలో వసంతిక మచ్చ నటించింది. ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సిరీస్ కన్నా ముందు ఆమె పలు చిత్రాలలో బాలనటిగా నటించి, మెప్పించింది. 90స్ సిరీస్ తో పాపులర్ అవడంతో వసంతిక నటించిన మూవీకి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నాని హీరోగా నటించిన ఓ సినిమాలో వసంతిక బాలనటిగా కనిపించింది.
నాని, మెహ్రీన్ పిర్జాద జంటగా నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ మూవీ 2016 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వసంతిక బాలనటిగా కనిపించింది. నాని, వసంతిక ఉన్న సీన్ మరియు 90స్ లోని సీన్ కలిపి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ‘ఓరిని ఈ పాప అప్పుడే పెద్దది అయిపోయిందా’ అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశారు. నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

























గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ నటించింది. ఆ మూవీ హిట్ అవడంతో ఆమెకు క్రేజ్ వచ్చింది. 2005 లో మళయాళంలో రిలీజ్ అయిన ‘బాయ్ ఫ్రెండ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. 2008 లో ఆలయం మూవీతో తెలుగులో అడుగుపెట్టారు. ఆ తరువాత వర్షం సాక్షిగా లో నటించినా గుర్తింపు రాలేదు. ఆ తరువాత తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు.
2022 లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ తో ఆమెకు మంచి ఫేమ్ లభించింది. కానీ సినిమా ఆఫర్స్ మాత్రం ఎక్కువగా రాలేదు.సినీ అవకాశాలు ఎలా ఉన్నా, హనీ రోజ్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్. ఇతర ఈవెంట్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కి హాజరు అయిన హనీ రోజ్ న్యూ లుక్ లో వెరైటీగా కనిపించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూ హెయిర్ స్టైల్, ఆరంజ్ కలర్ డ్రెస్లో అచ్చం హాలీవుడ్ హీరోయిన్ హనీ రోజ్ కనిపించారు. ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించు కుందని కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. వాటిపై స్పందిస్తూ అవన్నీ రూమర్స్ అని క్లారిటీ ఇచ్చారు. హనీ రోజ్ ప్రస్తుతం మళయాళంలో ‘తేరీ మేరీ’ తెలుగులో ‘గాలి బ్రదర్స్’ సినిమాలలో నటిస్తున్నారు.
ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే. చిరంజీవి గారి పెళ్లి టైం కి ఆయన ఇంకా స్టార్ అవ్వలేదు. అల్లు రామలింగయ్య గారు అప్పటికే ఇండస్ట్రీ లో సీనియర్ నటుడు. అంత పెద్ద నటుడు తన కూతురుకి చిరుని ఇచ్చి ఎలా పెళ్లి చేసారు అని అప్పట్లో అందరు అనుకునే వారు. ఈ ప్రశ్నలకు సీనియర్ హీరోయిన్ జవాబిచ్చింది. చిరంజీవి సురేఖను వివాహం చేసుకోవడానికి సీనియర్ హీరోయిన్ రాజ శ్రీ నే కారణమట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు బయటపెట్టారు.


ప్రేక్షకులకు కూడా ఈ టీజర్ బాగా నచ్చి రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఆరాట పడిపోతున్నారు. చిత్ర బృందం కూడా త్వరలోనే ఈ చిత్రం వెండి తెర మీదకు వస్తుంది అని సమాచారం ఇచ్చారు. కానీ ఇప్పుడు జయం రవి ఫాన్స్ కు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రం నేరుగా ఓటీటీ లో విడుదల కాబోతుందట. అది కూడా ఈ జనవరి 26న డైరెక్ట్ గా జి5 లోకి ఈ చిత్రం విడుదల కానుంది అని తెలిసిన వెంటనే ఫాన్స్ అందరూ నిరాశ పడుతున్నారు.
రవి బస్రూర్ తన అసలు పేరు కాదని, తన గతాన్ని, ఎక్కడి నుండి వచ్చాడో ఇంతకు ముందు పలు ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా కన్నడ సరిగమప షోలో పాల్గొన్న రవి బస్రూర్, తన గతాన్ని, పేరు ఎందుకు మార్చుకున్నారో వివరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో తినడానికి కూడా ఏం దొరికేది కాదని, అప్పుడు తన జేబులో ఒక చిట్టీ మాత్రం ఉండేదని, ఏ రోజు, ఏ గుళ్లో ప్రసాదం ఏం పెడతారో అందులో రాసి పెట్టుకునేవారట.
ఆ చిట్టి ప్రకారం ఆ దేవాలయానికి వెళ్లి ప్రసాదం తింటూ తన కడుపు నింపుకునేవారట. అలాంటి సమయంలో కామత్ అనే పెద్దాయన ఆయనను బెంగళూరులోని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాడట. ఇత్తడి, బంగారు వస్తువుల తయారీ వంటి పనులు చేస్తాడని చెప్పాడట. అయితే ఇతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ పని చేస్తుంటాడాని చెప్పి, పనిలోకి తీసకోమని చెప్పాడంట, అయిత పని ఇచ్చిన వ్యక్తి గిటార్ కొనుక్కోవడానికి రూ. 35 వేలు ఇచ్చాడట. అది చూసి ఇద్దరు షాక్ అయ్యారట. పరిచయమే కూడా లేని వ్యక్తి అంత డబ్బు ఇవ్వడమేంటని షాక్ అయ్యారట.
అంతేకాకుండా ఫ్యూచర్ లో మంచి సంగీత దర్శకుడు అవుతాడని చెప్పాడు. ఇక ఇతన్ని కలవాలంటే ఐదు నెలలు అపాయింట్ మెంట్ తీసుకుంటారని అన్నాడట. అయితే అలాంటివాటిని తాను నమ్మనని రవి బస్రూర్ అన్నాడట. కానీ ఆ తరువాత ఆ వ్యక్తి చెప్పిందే జరిగింది. తనకు సాయం చేసిన ఆ వ్యక్తికి ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఆయన పేరు రవి. గౌరవం ఆయనకే దక్కాలనే ఉద్దేశ్యంతో ఆ వ్యక్తి పేరుని, తన గ్రామం పేరుతో కలిపి పెట్టుకున్నారట. అలా కిరణ్ నుండి రవి బస్రూర్ గా మారానని వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.