మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలే అని కొన్ని కొన్ని చేదు అనుభవాలను బట్టి అనుకుంటుంటాం.. కాని మానవ సంబంధాలు హార్ధిక సంబంధాలే అని కొంతమంది మానవతావాదులు ఎప్పటికప్పుడు మనకి సమాజం మీద నమ్మకాన్ని కలిగిస్తుంటారు.. అందులో ఒకామె నస్రీన్.. ఈ హార్థిక సంబంధాలని నిలబెట్టుకోవడానికి డబ్బులతో పనిలేదని…గుండె తడి ఉన్న మానవతావాదులెవరైనా కూడా ఈ హార్థిక సంభంధాలను కొనసాగించగలరని నిరూపించిందామే..

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్కి చెందిన నస్రీన్ పేపర్ ప్లేట్స్ కంపెనీలో పనిచేస్తుంది.. రోజుకు వచ్చే 160 రూపాయలు సంపాదనతో జీవనం సాగిస్తోంది. పెరుగిన ధరలు, ఖర్చుల దృష్ట్యా చూసుకుంటే ఆ 160రూ. చాలా తక్కువే, అయినప్పటికి ఆ వచ్చిన డబ్బులో సగాన్ని మాత్రమే కుటుంబానికి ఖర్చుపెట్టింది..మిగతా సగం డబ్బులను కూడబెట్టింద. అలా కూడబెట్టిన మొత్తం డబ్బులు 15వేలు కాగా, వాటితో నిరుపేదల ఆకలి తీర్చింది.

తను కూడబెట్టిన డబ్బుతో బియ్యంతోపాటు నాలుగు రకాల నిత్యావసర వస్తువులు, కూరగాయలను కొనుగోలు చేసి, 50 మంది నిరుపేదలకు పంపిణీ చేసింది. ఇలాంటి విపత్తు సమయాల్లో మనం నిండు మనసుతో ఒకరికి సాయం చేసినా అది చాలా గొప్ప పనే.. 50మందికి పంపిణి చేయడం మామూలు విషయం కాదు. సాయం చేయాలనే గుణం ఉంటే చాలు, లక్షలు ఉండాల్సిన పనిలేదని మరోసారి నిరూపించింది.

మొన్నటికి మొన్న ఓ యాచకుడు వలస కూలీల ఆకలి బాధను చూసి తన దగ్గరున్న డబ్బుతో వారి ఆకలిని తీర్చాడు. ముంబాయ్ ఆటోడ్రైవర్ శీతల్ పేదవారికి తన ఆటోలో ఉచితంగా రవాణా సౌకర్యం సాయం చేస్తోంది..ఇప్పుడు నస్రీన్ తనకొచ్చే 160రూ..సగాన్ని పేదలకు కేటాయించింది..వీళ్లేవరూ డబ్బున్నవాళ్లు కాదు..కేవలం సాయం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు..మానవత్వం ఉన్నవాళ్లు..

అన్నట్టు చెప్పడం మర్చిపోయా మే 5వ తేదీ కారల్ మార్క్స్ జయంతి.. మానవ సంబంధాలు ఆర్దిక సంబంధాలని చెప్పింది ఆయనే..ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందని కొందరు నిరూపిస్తుంటే , హార్దిక సంబంధాలని నస్రీన్,శీతల్ లాంటి వాళ్లు నిరూపిస్తున్నారు..కరోనా కష్ట కాలంలో ఎవరికి వారు తమకు తోచిన రీతిలో సాయం చేయడానికి ముందుకు రావడం నిజంగా అభినందనీయం.






























మూగ జీవాల మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎవరైనా మూగ జీవాలకు హాని కలిగించే ఫొటోస్ వీడియో చూశారంటే చాలు…వారి పై ఒక రేంజ్ లో తిడుతుంటారు. పెట్స్ ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన సరే.అనవసరంగా కొట్టిన రష్మీ వారి పై ఫైర్ అవుతూ ఉంటారు..తాజాగా రష్మీ ఒక వీడియో పై ఇలా చెబుతూ అందులోని మనుషుల ప్రస్తావన పై నిప్పులు చెరిగారు ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే.
రష్మీ పెట్ లవర్ ని అందరూ చెబుతూ ఉంటారు.వాటి మీద ప్రేమను చూపిస్తూ ఉంటారు కూడా వీధి కుక్కలు ఎక్కడ కనిపించిన వాటికి ఆహరం పెడుతూ ఉంటారు.సోషల్ మీడియా లో ఎవరైనా పెట్స్ కి బాగోలేదనో,ఆహరం కోసమేనా తన వద్ద చెబితే చాలు క్షణాల్లో స్పందిస్తారు.తగిన సహాయం కూడా చేస్తారు.లాక్ డౌన్ కారణంగా కుక్కలకి సరైన ఆహరం దొరకడం లేదు.ఇక తానే స్వయంగా రంగంలోకి దిగింది.బకెట్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ మూగజీవాల ఆకలిని తీర్చింది. వీటికి సంబందించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి కూడా.
మూగ జీవాలని హింసిస్తున్న ఒక వీడియో రష్మీ దృష్టికి వచ్చింది..ఢిల్లీలోని ఒక కాలనీ లో కొందరు ఆకతాయిలు మూగ జీవులని వెంటాడి వెంటాడి మరి హింసించారు.అడ్డుపడిన వారిని కూడా బెదిరించి తప్పుకున్నారు. కుక్కలని కొట్టిన ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.ఆ వీడియో పై స్పందించిన రష్మీ…’నోరు లేని మూగజీవాలపై మీ బలాన్ని చూపడం మగతనం అనిపించుకోదు’ ఇలాంటి పనులను మనం ఖండించాలి. పెట్స్ ను కాపాడుకోవడం, పోషించడం తప్పు కాదని చెప్పుకొచ్చారు.









