పుట్టిన వారు మరణించక తప్పదని భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు ఎప్పుడో బోధించాడు. అయితే, మన నుంచి ప్రాణాన్ని వేరు చేసేది మాత్రం యమ ధర్మరాజు అన్న సంగతి మనకు తెలిసిందే. మనలో చాలా మందికి ఆయన పట్ల భయము, భీతి ఉంటుంది.
ఆయన మన ప్రాణాలను తీసుకెళ్ళిపోతాడన్న భావన కలిగి ఉంటాము. కానీ.. ఇది సృష్టిధర్మం లోని భాగం మాత్రమే. యమధర్మరాజు కూడా మన ప్రాణాలను తీసుకెళ్లే ముందు మనకు నాలుగు సంకేతాలను పంపుతారట. అవేంటో..మనం చూద్దాం..

ఆ సంకేతాలను తెలియచెప్పే కథ ఒకటి ఉంది. యమునా నదీ తీరం లో అమృతుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడట. అతనికి ఎపుడు చూసినా తాను చనిపోతానేమో అని.. ఎపుడు చనిపోతానో అని ఒక దిగులు గా ఉండేదట. ఈ విషయం లో దిగులు పోగొట్టుకోవడం కోసం యమ ధర్మ రాజుని ఉద్దేశించి తపస్సు చేసాడట. అతని తపస్సుకి మెచ్చి యమధర్మ రాజు ప్రత్యక్షం అయి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడట. అయితే, ఆ వ్యక్తి తనకి మరణం ఎప్పుడు వస్తుందో ముందుగానే తెలియచేయమన్నాడట. ఆ విషయం ముందే తెలిస్తే తన బాధ్యతలన్నీ మరొకరికి అప్ప చెప్పేయాలనేది అతని ఆలోచన.

అయితే, యమధర్మ రాజు మరణం ఎప్పుడు వస్తుందో చెప్పలేనని, అయితే అందుకు గుర్తు గా కొన్ని సంకేతాలను మాత్రం పంపగలనని తెలిపాడట. వాటిని బట్టి మరణం వచ్చే విషయం తెలుసుకోవాలని యమధర్మరాజు సూచించారు. ఆ తరువాత ఈ విషయాన్నీ అమృతుడు మర్చిపోతాడు. పెళ్లి చేసుకోవడం, పిల్లలని కనడం, వారికి కూడా పెళ్లిళ్లు అవ్వడం కాలక్రమం లో జరిగిపోతుంటుంది. అయితే, ఓ రోజు అమృతుడికి యమధర్మరాజు తో జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది.

కానీ, ఆయన చెప్పిన సూచనలు ఏవి కనిపించకపోవడం తో తనకు ఇంకా ఆయువు ఉందని అమృతుడు అనుకుంటాడు. కాలక్రమం లో అతని చర్మం ముడతలు పడుతుంది, వెంట్రుకలు తెల్లబడతాయి. పళ్ళు కూడా ఊడిపోతాయి. పక్షవాతం సోకి మంచానికే పరిమితం అవుతాడు. ఓ రోజున యమధర్మరాజు అతని ప్రాణాలు తీసుకుని పోవడానికి వస్తాడు. అయితే, అమృతుడు ఆశ్చర్యం తో నాకు సూచనలు చేస్తానని మాటిచ్చావు. కానీ, ఎలాంటి సూచనలు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతున్నావు. నువ్వు నాకిచ్చిన వరం మాటేమిటి? అని అడుగుతాడు.

నేను నీకు నాలుగు సార్లు సూచనలు చేసినప్పటికీ, నువ్వు గ్రహించలేదు అని చెబుతాడు. ఆ సూచనలేమిటని అమృతుడు యముడిని అడగ్గా, వెంట్రుకలు తెల్లబడడం, చర్మం ముడుచుకోవడం, పళ్ళు ఊడిపోవడం, పక్షవాతం వంటి అనారోగ్యాలను తానూ పంపిన సూచనలు గా యముడు వివరిస్తాడు. అప్పుడు అమృతుడుకి కి విషయం అర్ధం అవుతుంది. అమృతుడు నిజాన్ని ఒప్పుకున్నతరువాత యమధర్మరాజు అతని ప్రాణాలను తీసుకెళ్ళిపోతాడు.








రామాయణంలో కీలకమైన ఘట్టాలలో సీతాదేవి అపహరణ కూడా ఒకటి. అదే రావణాసురుడి చావుకు కారణం అయ్యింది. వనవాసంలో ఉన్న సమయంలో రావణాడు సీతాదేవిని ఎత్తుకెళ్లడం, ఆ తరువాత అశోకవనంలో బంధించిన విషయం తెలిసిందే. అయితే ఆదిపురుష్ లో రావణాడు సీతను పట్టుకోకుండా గాల్లో తీసుకెళ్తాడు. వాల్మీకి రామాయణంలో సీతాదేవి ఉన్న భూమిని పెకిలించి తీసుకెళ్లినట్టుగా ఉంటుంది. మరి రావణాడు సీతమ్మను తాకకుండా తీసుకెళ్లాడానికి కారణం కుబేరుడి కుమారుని శాపం.
రావణాసురుడు తనకి కోడలితో సమానం అయిన రంభను ఒకసారి బలవంతం చేస్తే, రంభ ప్రియుడు అయిన కుబేరుడి కుమారుడు నలకుబేరుడు రావణాసురుడు పరాయి స్త్రీని బలవంతంగా ముట్టుకుంటే రావణాసురుడి పది తలలు పగిలిపోయేలా శాపం పెడుతాడు. రావణాసురుడు సీతాదేవి అనుమతి లేకుండా ముట్టుకుంటే తన పది తలలు పగిలిపోతాయి. అందుకే రావణాడు సీతను గాల్లో తీసుకెళ్తాడు.
ఆ తరువాత రావణాసురుడు సీతాదేవి తాకకుండా అశోకవనంలో ఉంచుతాడు. శ్రీ రాముడు ఆంజనేయుడి సహాయంతో లంకలో ఉన్న సీతాదేవి జాడను కనుగొని, వారధి కట్టి, రావణాసురుడితో యుద్ధం చేసి రావణుడిని సంహరించి సీతాదేవి తీసుకుని అయోధ్యకు చేరుకుంటాడు. నల కుబేరుడు శాపం వల్ల రావణాసురుడు సీతాదేవిని తాకడానికి భయపడతాడు.













అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ గ్రాండ్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో తిరుపతి, అనంత పద్మనాభస్వామి దేవాలయం, షిర్డీ లాంటి దేవాలయాలకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. దేశంలోనే ఈ దేవాలయాలు అత్యంత ధనిక దేవాలయాలుగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. పుణ్యక్షేత్రాలకు ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. అది కూడా ఫ్యామిలీ అంతా వెళ్తుంది. దీనివల్ల ట్రాన్స్ పోర్ట్, రెస్టారెంట్లు, హోటల్స్ తో పాటు ఇతర బిజినెస్ లకు డిమాండ్ కూడా పెరుగుతుంది.
వివిధ రంగాలకు ఆదాయం పెరగడంతో టాక్స్ ల రూపంలో గవర్నమెంట్స్ కు పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరుతుంది. ఇటీవల శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల తాకిడితో 2 నెలలకు గాను 357 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన నేపథ్యంలో ఆధ్యాత్మిక టూరిజం పేరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది.
ఎస్బీఐ నివేదిక ప్రకారం, యూపీలో రామ మందిరం నిర్మాణం మరియు అదనపు చర్యల వల్ల 2024-25 లో యూపీ గవర్నమెంట్ కు అదనంగా 25 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ మొత్తం సందర్శకుల రాకతో సమకూరనుంది. దీనివల్ల రోడ్డు, రైలు, వాయురవాణా పెరిగే ఛాన్స్ ఉంది. భక్తుల సేవల గాను హోటల్స్, హాస్పటల్స్ సైతం పెరుగుతాయి. 2027 వరకు మహారాష్ట్రతో పాటుగా ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లను అధిగమించి, దేశ జీడీపీలో యూపీ వాటా పది శాతంగా ఉంటుందని తెలిపింది.