భారతదేశంలో సంస్కృతికి పెద్ద పీట వేస్తారు అనే సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశమంటే ముందుగా గుర్తొచ్చేది ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు. భారతదేశం అంటే ఆలయాలకు కూడా ప్రసిద్ధి. ఎన్నో ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.
విదేశాల నుండి ఎంతో మంది ఈ ఆలయాలకి వచ్చి దేవుడిని దర్శించుకొని వెళ్తారు. ఇంక పండగల సమయంలో అయితే ఆలయాల రద్దీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి ప్రత్యేక రోజుల్లో దేవుడిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే, ఆలయాల్లో దేవుడిని దర్శించుకునే ముందు పూజలకి డబ్బులు కట్టాలి. టికెట్ తీసుకోవాలి.

ఇలా దేవుడు దర్శనానికి కొంత మొత్తాన్ని చెల్లించాలి. కానీ చర్చికి, దర్గాకి వెళ్తే అక్కడ ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీనికి కారణం ఏంటి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇదే విషయాన్ని బీజేపీ స్పోక్స్ పర్సన్ అయిన రాణి రుద్రమని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సిగ్నేచర్ స్టూడియోస్ అనే ఒక ఛానల్ యాంకర్ అడిగారు. ఈ విషయం మీద రాణి రుద్రమ తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ముందుగా యాంకర్ అడిగిన ప్రశ్న సరైనది అని అన్నారు.

తర్వాత ఈ విషయం మీద రాణి రుద్రమ మాట్లాడారు. ఇటీవల కరీంనగర్ లో బండి సంజయ్ గారు కట్టించిన మహాశక్తి ఆలయానికి వెళ్లారు అని, అక్కడ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం రాలేదు అని అన్నారు. ఇందుకు కారణం ఏంటి అని బండి సంజయ్ ని అడగగా, “మేము అలాంటి పద్ధతులకు వ్యతిరేకం” అని చెప్పారు. ప్రభుత్వం కొంత మొత్తాన్ని గుళ్ళ డెవలప్మెంట్ కి ఇవ్వాలి అని అన్నారు.

డెవలప్మెంట్ కోసం ఇదంతా కమర్షియల్ అయిపోయింది కానీ, ఇదంతా ప్రభుత్వం చూసుకోవాలి అని ఈ విషయం మీద వివరంగా చెప్పారు రాణి రుద్రమ. ఇది మాత్రమే కాకుండా, ఆడపిల్లల మీద ఎలాంటి అన్యాయం జరిగినా కూడా వెంటనే స్పందించాలి అని అన్నారు. ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుతూ, బీజేపీ ఇలాంటి వాటికి తొందరగా స్పందిస్తుంది అని, అలా ప్రతి ఒక్క పార్టీ కూడా ఇలాంటి సమస్యల మీద వెంటనే స్పందించాలి అని అభిప్రాయపడ్డారు.
watch video :






సాలూరు శ్మశాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్మశాన అభివృద్ధి కోసం మా కమిటీ నిధులను సేకరిస్తుంటుందని తెలిపారు. నిధుల సేకరణలో భాగంగానే తెలంగాణ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ను సూర్యాపేట కలెక్టర్ ద్వారా తమ కమిటీ సంప్రదించింది. అలా ఎంపీ లింగయ్య ‘ఎంపీ ల్యాడ్స్’ నిధుల నుండి 10 లక్షల రూపాయలు సాలూరు శ్మశాన అభివృద్ధి పనులకు ఇచ్చారు. అయితే ఆ నిధులు సాలూరు పురపాలక సంఘానికి 2023 డిసెంబర్లో చేరాయి. దాంతో గత వారం నుండి సాలూరు శ్మశానంలో పనులు చేపట్టారు.
ఈ విషయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ “రాజ్యసభ సభ్యులు తమ నిధులతో దేశంలో ఎక్కడైనా అభివృద్ధి పనులకు సహాయం చేయవచ్చు. ఆ క్రమంలోనే సాలూరు శ్మశాన అభివృద్ధి కోసం నిధులు ఇచ్చానని వెల్లడించారు. ఇది మంచి పని, చిన్న పని కావడంతో ఇచ్చాను. ఈ విషయంలో రాజకీయం లేదని అన్నారు.



ప్రస్తుతం కరడు గట్టిన నేరస్థులు, గూండాలు మరియు షార్ప్షూటర్లతో కలిసి గోయల్ జైలు జీవితం గడుపుతున్నారు. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 1న అరెస్ట్ అయిన, 4 నెలల నుండి ముంబై ఆర్థర్ రోడ్ ప్రిజన్ లో శిక్షను అనుభవిస్తున్నారు. గోయల్ స్పెషల్ కోర్టుకు హాజరవడం కోసం జైలు నుండి బయటకు రాగా, ఆ టైమ్ లో నేషనల్ మీడియా తీసిన ఫోటో ఇది. జనవరి 26న ప్రైవేట్ హాస్పటల్ వైద్యుల సూచనల మేరకు, తనని ప్రైవేట్ హాస్పటల్ లో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అనుమతించాలాని పిటిషన్లో కోరారు.
జెట్ ఎయిర్వేస్ కంపెనీ కెనరా బ్యాంకు నుండి 848.86 కోట్ల రూపాయల లోన్ తీసుకుంది. అందులో కొంత చెల్లించిన ఆ సంస్థ మిగిలిన 538.62 కోట్ల రూపాయలను చెల్లించడంలో విఫలమైంది. ఈ క్రమంలో సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి జెట్ ఎయిర్వేస్ కెనరా బ్యాంకును మోసం చేసినట్టు గా తేల్చింది. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించిన అంశాలు సైతం ఉన్నాయని తేలడంతో ఈడీ రంగంలోకి దిగి, 2023 సెప్టెంబరు 1న గోయల్ను అరెస్ట్ చేసింది.


స్మితా సబర్వాల్ నిన్న సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ లో ఫొటోలను షేర్ చేశారు. జనవరి 10న ఆమె తల్లి ‘పురబి దాస్’ 79వ బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా స్మితా సబర్వాల్ ‘ఎక్స్’ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియచేసారు. ఆ పోస్ట్ లో తల్లి ఫోటో మరియు తల్లితో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ” నాకు తెలిసిన ఒకే ఒక మహిళ, నా కంటే ఎక్కువ దృఢ నిశ్చయం ఉన్న మహిళ” అంటూ తన తల్లి గురించి రాసుకొచ్చారు. అంతేకాకుండా “79వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని, మీరు ‘ఎక్స్’ లో ఉన్నారని నాకు తెలుసు. రహస్యంగా నన్ను ఫాలో అవుతున్నావని తెలుసు” అంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు పురబి దాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజెన్ “ఈ స్థాయికి వచ్చిన మీ వెనుక వెన్నుదన్నుగా అండగా నిలిచిన అమ్మకు వందనం…!!” అంటూ కామెంట్ చేశారు. “మీలాంటి లీడర్ ను పెంచి పోషించిన నిజమైన లీడర్ కు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఆమెకు మరింత బలాన్ని మరియు సంకల్ప శక్తిని ప్రసాదించాలని” మరొకరు కామెంట్ చేశారు. కొందరు నెటిజెన్లు చిన్నారి స్మితా సబర్వాల్ క్యూట్గా ఉందని కామెంట్స్ చేశారు.
