జనవరి 22న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు దేశవ్యాప్తంగా పలుమూలల నుంచి విపరీతమైన జనసంఖ్య అయోధ్యకు బాల రాముని దర్శనం కోసం హాజరయింది. అందులో ఒక ముసలి వృద్దురాలు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కోసం వెళ్లి తన పర్సుని పోగొట్టుకుంది. ఆ పర్సు నిండా నోట్లు ఉన్నాయి అని తెలిపింది ఆ ముసలావిడ.

టీవీ 9 కథనం ప్రకారం..వివరాలలోకి వస్తే తమిళనాడుకు చెందిన బిలియనర్ శ్రీధర్ వెంబు తన తల్లి జానకి తో కలిసి అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట కి వెళ్లారు. జానకికి 80 ఏండ్లు నిండాయి. బాలరాముడు దర్శనం కోసం వెళ్తుండగా తన పర్సు పోయింది అని తనకి తెలిసింది. అందులో 63 వేల విలువ కలిగిన నగదు, ఆధార్ కార్డు కూడా ఉన్నాయి. బాలరాముడి దగ్గరకు వెళ్లి తన పర్స్ తిరిగి రావాలి అని కోరుకుంది జానకి.
శ్రీధర్ అక్కడ ఉన్న పోలీసులకు పర్స్ పోయిందన్న విషయం తెలిపారు వాళ్లు ఆ పర్స్ కోసం గాలిస్తామని చెప్పారు. శ్రీధర్ తన తల్లి జానకి తో తిరిగి తమిళనాడు వచ్చేశారు. చూస్తే ఆ పర్స్ 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిద్వార్ కు చెందిన ఒక సాధువు దగ్గర ఉంది. తను కూడా బాలరాముడు ప్రాణ ప్రతిష్ట కోసం అయోధ్యకు వచ్చినప్పుడు తెలియకుండా తన సంచిలో ఈ పర్స్ పడిపోయిందని. చూడగా అందులో జానకి ఆధార్ కార్డు ఉందని వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తెలిపారు.
ఆ పైన పోలీసులు శ్రీధర్ కి ఈ విషయం తెలుపగా వాళ్ళు వచ్చి ఆ పర్స్ నీ తీసుకున్నారు. అందులో డబ్బులు ఆధార్ కార్డుతో పాటు ఒక చిన్న గంట కూడా ఉందని ఆ గంట జానకి పూజ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడూ ముఖ్యమైన సామాగ్రి అని, ఇది తిరిగి తన దగ్గరికి రావడానికి కారణం శ్రీరాముడే. తనే స్వయంగా ఇది నా దగ్గరికి వచ్చేలా చేశారు అని నమ్ముతుంది జానకి. ఈ విషయం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ రాముడి అనుగ్రహమే ఇది అని కామెంట్ చేస్తున్నారు.





సాలూరు శ్మశాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్మశాన అభివృద్ధి కోసం మా కమిటీ నిధులను సేకరిస్తుంటుందని తెలిపారు. నిధుల సేకరణలో భాగంగానే తెలంగాణ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ను సూర్యాపేట కలెక్టర్ ద్వారా తమ కమిటీ సంప్రదించింది. అలా ఎంపీ లింగయ్య ‘ఎంపీ ల్యాడ్స్’ నిధుల నుండి 10 లక్షల రూపాయలు సాలూరు శ్మశాన అభివృద్ధి పనులకు ఇచ్చారు. అయితే ఆ నిధులు సాలూరు పురపాలక సంఘానికి 2023 డిసెంబర్లో చేరాయి. దాంతో గత వారం నుండి సాలూరు శ్మశానంలో పనులు చేపట్టారు.
ఈ విషయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ “రాజ్యసభ సభ్యులు తమ నిధులతో దేశంలో ఎక్కడైనా అభివృద్ధి పనులకు సహాయం చేయవచ్చు. ఆ క్రమంలోనే సాలూరు శ్మశాన అభివృద్ధి కోసం నిధులు ఇచ్చానని వెల్లడించారు. ఇది మంచి పని, చిన్న పని కావడంతో ఇచ్చాను. ఈ విషయంలో రాజకీయం లేదని అన్నారు.



ప్రస్తుతం కరడు గట్టిన నేరస్థులు, గూండాలు మరియు షార్ప్షూటర్లతో కలిసి గోయల్ జైలు జీవితం గడుపుతున్నారు. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 1న అరెస్ట్ అయిన, 4 నెలల నుండి ముంబై ఆర్థర్ రోడ్ ప్రిజన్ లో శిక్షను అనుభవిస్తున్నారు. గోయల్ స్పెషల్ కోర్టుకు హాజరవడం కోసం జైలు నుండి బయటకు రాగా, ఆ టైమ్ లో నేషనల్ మీడియా తీసిన ఫోటో ఇది. జనవరి 26న ప్రైవేట్ హాస్పటల్ వైద్యుల సూచనల మేరకు, తనని ప్రైవేట్ హాస్పటల్ లో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అనుమతించాలాని పిటిషన్లో కోరారు.
జెట్ ఎయిర్వేస్ కంపెనీ కెనరా బ్యాంకు నుండి 848.86 కోట్ల రూపాయల లోన్ తీసుకుంది. అందులో కొంత చెల్లించిన ఆ సంస్థ మిగిలిన 538.62 కోట్ల రూపాయలను చెల్లించడంలో విఫలమైంది. ఈ క్రమంలో సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి జెట్ ఎయిర్వేస్ కెనరా బ్యాంకును మోసం చేసినట్టు గా తేల్చింది. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించిన అంశాలు సైతం ఉన్నాయని తేలడంతో ఈడీ రంగంలోకి దిగి, 2023 సెప్టెంబరు 1న గోయల్ను అరెస్ట్ చేసింది.


స్మితా సబర్వాల్ నిన్న సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ లో ఫొటోలను షేర్ చేశారు. జనవరి 10న ఆమె తల్లి ‘పురబి దాస్’ 79వ బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా స్మితా సబర్వాల్ ‘ఎక్స్’ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియచేసారు. ఆ పోస్ట్ లో తల్లి ఫోటో మరియు తల్లితో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ” నాకు తెలిసిన ఒకే ఒక మహిళ, నా కంటే ఎక్కువ దృఢ నిశ్చయం ఉన్న మహిళ” అంటూ తన తల్లి గురించి రాసుకొచ్చారు. అంతేకాకుండా “79వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని, మీరు ‘ఎక్స్’ లో ఉన్నారని నాకు తెలుసు. రహస్యంగా నన్ను ఫాలో అవుతున్నావని తెలుసు” అంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు పురబి దాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజెన్ “ఈ స్థాయికి వచ్చిన మీ వెనుక వెన్నుదన్నుగా అండగా నిలిచిన అమ్మకు వందనం…!!” అంటూ కామెంట్ చేశారు. “మీలాంటి లీడర్ ను పెంచి పోషించిన నిజమైన లీడర్ కు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఆమెకు మరింత బలాన్ని మరియు సంకల్ప శక్తిని ప్రసాదించాలని” మరొకరు కామెంట్ చేశారు. కొందరు నెటిజెన్లు చిన్నారి స్మితా సబర్వాల్ క్యూట్గా ఉందని కామెంట్స్ చేశారు.

సానియా మీర్జాకి షోయబ్ మాలిక్తో పెళ్లి జరగక ముందు, ఆమె తన ఫ్రెండ్ సోహ్రాబ్ మీర్జాతో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. సానియా హైదరాబాద్ లో ప్రముఖ బేకరీ అయిన యూనివరల్ బేకర్స్ ఓనర్ సోహ్రబ్ మీర్జాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జులై 2009లో ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు సైతం మార్చుకున్నారు.
సానియా, సోహ్రబ్ హైదరాబాద్ లో సెయింట్ మేరీస్ కాలేజీలో కలిశారు. సానియా చదువుకునే రోజుల్లో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ కాలేజీలో సోహ్రబ్ కామర్స్ చదివాడు. అనంతరం యూకేలో ఎంబీఏ పూర్తిచేసి, బిజినెస్ లోకి వచ్చారట. అయితే, వీరి వివాహానికి కొన్నిరోజుల ముందు సానియా, షోయబ్ మాలిక్తో ప్రేమించడంతో సోహ్రాబ్తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.
ఆ తరువాత సానియా పెద్దలను ఒప్పించి షోయబ్ మాలిక్ను వివాహం చేసుకుంది. ఇక వీరు విడాకులు తీసుకున్న వార్త వైరల్ అవడంతో నెటిజెన్లు సోహ్రాబ్ మీర్జాను పెళ్లి చేసుకొని ఉంటే సానియా లైఫ్ ఇలా అయ్యేది కాదని ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోహ్రాబ్తో ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకున్నా, వారి ఫ్యామిలీలు ఇప్పటికీ కూడా సన్నిహితంగానే ఉన్నాయి.