చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, ఒకపూట తింటే మరో పూట పస్తులు, చదువుకునే స్థితి లేని జీవితం. అటువంటి దుర్భుర స్థితిని అనుభవించిన ఒక యువకుడు ఇండియాలోనే అతి పెద్ద విమానయాన సంస్థను స్థాపించి, దేశంలోనే అత్యంత ధనవంతుడుగా పేరు గాంచాడు.
చిన్నప్పటి నుండే ‘నువ్వు ఏది చేస్తే అదే నిన్ను చేరుతుంది.. మంచి చేస్తే మంచే వస్తుంది’ అని తన తల్లి చెప్పే మాటలను వింటూ పెరిగిన ఆ వ్యక్తి, ఆర్ధిక నేరానికి పాల్పడి అరెస్ట్ అయ్యి, నేరస్థుల మధ్య జైలు జీవితం గడుపుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం..
సాక్షి కథనం ప్రకారం…పైన కనిపిస్తున్న ఫోటోలో తెల్లని గడ్డంతో, సాధారణ బట్టలతో కనిపిస్తున్న వ్యక్తి. ఒకప్పుడు ఎయిర్ లైన్స్ రంగంలో రారాజులా కీర్తించబడిన పెద్ద బిజినెస్ మెన్. వేల కోట్లల్లో ఆస్తులు, వంద సంఖ్యలో విమానాలు ఉన్న ఆయన ప్రపంచ ధనవంతులలో ఒకరు. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో కాదు, జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్. రూ.538.62 కోట్ల బ్యాంకు లోన్స్ ఎగవేత కేసులో జైలు పాలయ్యారు.
ప్రస్తుతం కరడు గట్టిన నేరస్థులు, గూండాలు మరియు షార్ప్షూటర్లతో కలిసి గోయల్ జైలు జీవితం గడుపుతున్నారు. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 1న అరెస్ట్ అయిన, 4 నెలల నుండి ముంబై ఆర్థర్ రోడ్ ప్రిజన్ లో శిక్షను అనుభవిస్తున్నారు. గోయల్ స్పెషల్ కోర్టుకు హాజరవడం కోసం జైలు నుండి బయటకు రాగా, ఆ టైమ్ లో నేషనల్ మీడియా తీసిన ఫోటో ఇది. జనవరి 26న ప్రైవేట్ హాస్పటల్ వైద్యుల సూచనల మేరకు, తనని ప్రైవేట్ హాస్పటల్ లో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అనుమతించాలాని పిటిషన్లో కోరారు.
జెట్ ఎయిర్వేస్ కంపెనీ కెనరా బ్యాంకు నుండి 848.86 కోట్ల రూపాయల లోన్ తీసుకుంది. అందులో కొంత చెల్లించిన ఆ సంస్థ మిగిలిన 538.62 కోట్ల రూపాయలను చెల్లించడంలో విఫలమైంది. ఈ క్రమంలో సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి జెట్ ఎయిర్వేస్ కెనరా బ్యాంకును మోసం చేసినట్టు గా తేల్చింది. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించిన అంశాలు సైతం ఉన్నాయని తేలడంతో ఈడీ రంగంలోకి దిగి, 2023 సెప్టెంబరు 1న గోయల్ను అరెస్ట్ చేసింది.
Also Read: లేడీ టీచర్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్… అక్కా అక్కా అంటూనే అతను మాస్టర్ ప్లాన్ వేసి..?




స్మితా సబర్వాల్ నిన్న సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ లో ఫొటోలను షేర్ చేశారు. జనవరి 10న ఆమె తల్లి ‘పురబి దాస్’ 79వ బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా స్మితా సబర్వాల్ ‘ఎక్స్’ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియచేసారు. ఆ పోస్ట్ లో తల్లి ఫోటో మరియు తల్లితో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ” నాకు తెలిసిన ఒకే ఒక మహిళ, నా కంటే ఎక్కువ దృఢ నిశ్చయం ఉన్న మహిళ” అంటూ తన తల్లి గురించి రాసుకొచ్చారు. అంతేకాకుండా “79వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని, మీరు ‘ఎక్స్’ లో ఉన్నారని నాకు తెలుసు. రహస్యంగా నన్ను ఫాలో అవుతున్నావని తెలుసు” అంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు పురబి దాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజెన్ “ఈ స్థాయికి వచ్చిన మీ వెనుక వెన్నుదన్నుగా అండగా నిలిచిన అమ్మకు వందనం…!!” అంటూ కామెంట్ చేశారు. “మీలాంటి లీడర్ ను పెంచి పోషించిన నిజమైన లీడర్ కు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఆమెకు మరింత బలాన్ని మరియు సంకల్ప శక్తిని ప్రసాదించాలని” మరొకరు కామెంట్ చేశారు. కొందరు నెటిజెన్లు చిన్నారి స్మితా సబర్వాల్ క్యూట్గా ఉందని కామెంట్స్ చేశారు.

సానియా మీర్జాకి షోయబ్ మాలిక్తో పెళ్లి జరగక ముందు, ఆమె తన ఫ్రెండ్ సోహ్రాబ్ మీర్జాతో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. సానియా హైదరాబాద్ లో ప్రముఖ బేకరీ అయిన యూనివరల్ బేకర్స్ ఓనర్ సోహ్రబ్ మీర్జాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జులై 2009లో ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు సైతం మార్చుకున్నారు.
సానియా, సోహ్రబ్ హైదరాబాద్ లో సెయింట్ మేరీస్ కాలేజీలో కలిశారు. సానియా చదువుకునే రోజుల్లో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ కాలేజీలో సోహ్రబ్ కామర్స్ చదివాడు. అనంతరం యూకేలో ఎంబీఏ పూర్తిచేసి, బిజినెస్ లోకి వచ్చారట. అయితే, వీరి వివాహానికి కొన్నిరోజుల ముందు సానియా, షోయబ్ మాలిక్తో ప్రేమించడంతో సోహ్రాబ్తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.
ఆ తరువాత సానియా పెద్దలను ఒప్పించి షోయబ్ మాలిక్ను వివాహం చేసుకుంది. ఇక వీరు విడాకులు తీసుకున్న వార్త వైరల్ అవడంతో నెటిజెన్లు సోహ్రాబ్ మీర్జాను పెళ్లి చేసుకొని ఉంటే సానియా లైఫ్ ఇలా అయ్యేది కాదని ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోహ్రాబ్తో ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకున్నా, వారి ఫ్యామిలీలు ఇప్పటికీ కూడా సన్నిహితంగానే ఉన్నాయి.







