సాధారణంగా రోడ్డు వెడల్పు చేసే పనిలో భాగంగా, చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కానీ, లేదా షాపులను కానీ కూల్చివేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం రోడ్డు వెడల్పు పనిలో భాగంగా తన సొంత ఇంటిలో కూల్చేశారు. ఆయన మరెవరో కాదు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి.
మున్సిపాలిటీ అధికారులు ఇళ్లను కూల్చివేయమని ఆదేశం ఇవ్వడంతో, శనివారం రోజు తన ఇంటిని కూల్చేశారు. ఇదే రోడ్డు మీద ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ మాజీ మంత్రి అయిన షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉంది. మరి ఈ విషయం మీద ఆయన ఎలా స్పందిస్తారో అని చూస్తున్నారు.

అయితే మరొక పక్క రోడ్డు వెడల్పుకి అడ్డుగా ఉంది అని సొంత ఇంటిని కూల్చివేసిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని అంటున్నారు. అంతే కాకుండా రోడ్డు విస్తరించడం కోసం ఇల్లు కూల్చివేసేందుకు ఆ ఇళ్ల యజమానులు సహకరించాలి అని వారిని కోరారు. అప్పటి ప్లాన్ ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుండి రైల్వే గేట్ వరకు 80 అడుగుల విస్తీర్ణంలో రోడ్ నిర్మించాలి అని అనుకున్నారు.

అయితే, ప్రస్తుతం 30 అడుగుల రోడ్డు ఉంది. రోడ్డు విస్తరించడానికి వీలు లేకుండా చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్ళ ముందు షెడ్లు వంటివి కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందుకే రోడ్ విస్తరించడానికి ప్రజలు స్వచ్ఛందంగా వారే ముందుకు రావాలి అని వెంకట రమణారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం నాడు ఆర్ అండ్ బి, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో తానే జేసీబీ దగ్గరుండి తన సొంత ఇంటిని కూల్చివేశారు.

పంచముఖి హనుమాన్ దేవాలయం కూడా ఇదే దారిలో ఉంది. ఆ ఆలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు విస్తీర్ణం చేసే పనులు చేపట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల లోపు రోడ్డు మీద ఉన్న కుళాయి గుంటలు, షెడ్లని వారే స్వచ్ఛందంగా తొలగించి, రోడ్డు అభివృద్ధి కోసం సహకరించాలి అని ప్రజలని కోరారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు మరొక 24 అడుగుల రోడ్డు అదనంగా నిర్మించాలి అని, ఈ పనులన్నీ కూడా నెల రోజుల్లో పూర్తి కావాలి అని అధికారులని ఆదేశించారు. కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేసిన పనికి చాలా మంది ఆయనని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా ఈ రోజు మొదటగా తన ఇంటినే కూల్చి వేసిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు pic.twitter.com/kVz38wpA19
— Katipally Venkata Ramana Reddy BJP (@kvr4kamareddy) January 27, 2024
ALSO READ : గుడిలోకి వెళ్తే వేల ఖర్చు.. చర్చ్ కు, దర్గాకు వెళ్తే రూపాయి ఖర్చు రాదు ఎందుకు..?









సాలూరు శ్మశాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్మశాన అభివృద్ధి కోసం మా కమిటీ నిధులను సేకరిస్తుంటుందని తెలిపారు. నిధుల సేకరణలో భాగంగానే తెలంగాణ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ను సూర్యాపేట కలెక్టర్ ద్వారా తమ కమిటీ సంప్రదించింది. అలా ఎంపీ లింగయ్య ‘ఎంపీ ల్యాడ్స్’ నిధుల నుండి 10 లక్షల రూపాయలు సాలూరు శ్మశాన అభివృద్ధి పనులకు ఇచ్చారు. అయితే ఆ నిధులు సాలూరు పురపాలక సంఘానికి 2023 డిసెంబర్లో చేరాయి. దాంతో గత వారం నుండి సాలూరు శ్మశానంలో పనులు చేపట్టారు.
ఈ విషయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ “రాజ్యసభ సభ్యులు తమ నిధులతో దేశంలో ఎక్కడైనా అభివృద్ధి పనులకు సహాయం చేయవచ్చు. ఆ క్రమంలోనే సాలూరు శ్మశాన అభివృద్ధి కోసం నిధులు ఇచ్చానని వెల్లడించారు. ఇది మంచి పని, చిన్న పని కావడంతో ఇచ్చాను. ఈ విషయంలో రాజకీయం లేదని అన్నారు.



ప్రస్తుతం కరడు గట్టిన నేరస్థులు, గూండాలు మరియు షార్ప్షూటర్లతో కలిసి గోయల్ జైలు జీవితం గడుపుతున్నారు. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 1న అరెస్ట్ అయిన, 4 నెలల నుండి ముంబై ఆర్థర్ రోడ్ ప్రిజన్ లో శిక్షను అనుభవిస్తున్నారు. గోయల్ స్పెషల్ కోర్టుకు హాజరవడం కోసం జైలు నుండి బయటకు రాగా, ఆ టైమ్ లో నేషనల్ మీడియా తీసిన ఫోటో ఇది. జనవరి 26న ప్రైవేట్ హాస్పటల్ వైద్యుల సూచనల మేరకు, తనని ప్రైవేట్ హాస్పటల్ లో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అనుమతించాలాని పిటిషన్లో కోరారు.
జెట్ ఎయిర్వేస్ కంపెనీ కెనరా బ్యాంకు నుండి 848.86 కోట్ల రూపాయల లోన్ తీసుకుంది. అందులో కొంత చెల్లించిన ఆ సంస్థ మిగిలిన 538.62 కోట్ల రూపాయలను చెల్లించడంలో విఫలమైంది. ఈ క్రమంలో సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి జెట్ ఎయిర్వేస్ కెనరా బ్యాంకును మోసం చేసినట్టు గా తేల్చింది. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించిన అంశాలు సైతం ఉన్నాయని తేలడంతో ఈడీ రంగంలోకి దిగి, 2023 సెప్టెంబరు 1న గోయల్ను అరెస్ట్ చేసింది.


స్మితా సబర్వాల్ నిన్న సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ లో ఫొటోలను షేర్ చేశారు. జనవరి 10న ఆమె తల్లి ‘పురబి దాస్’ 79వ బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా స్మితా సబర్వాల్ ‘ఎక్స్’ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియచేసారు. ఆ పోస్ట్ లో తల్లి ఫోటో మరియు తల్లితో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ” నాకు తెలిసిన ఒకే ఒక మహిళ, నా కంటే ఎక్కువ దృఢ నిశ్చయం ఉన్న మహిళ” అంటూ తన తల్లి గురించి రాసుకొచ్చారు. అంతేకాకుండా “79వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని, మీరు ‘ఎక్స్’ లో ఉన్నారని నాకు తెలుసు. రహస్యంగా నన్ను ఫాలో అవుతున్నావని తెలుసు” అంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు పురబి దాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజెన్ “ఈ స్థాయికి వచ్చిన మీ వెనుక వెన్నుదన్నుగా అండగా నిలిచిన అమ్మకు వందనం…!!” అంటూ కామెంట్ చేశారు. “మీలాంటి లీడర్ ను పెంచి పోషించిన నిజమైన లీడర్ కు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఆమెకు మరింత బలాన్ని మరియు సంకల్ప శక్తిని ప్రసాదించాలని” మరొకరు కామెంట్ చేశారు. కొందరు నెటిజెన్లు చిన్నారి స్మితా సబర్వాల్ క్యూట్గా ఉందని కామెంట్స్ చేశారు.