మెగాస్టార్ సినిమా అంటే ఇటు ప్రేక్షకుల్లో , అటు సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అందుకే చిరు సినిమాలకి సంబందించి ఏ న్యూస్ అయినా హాట్ టాపికే . ప్రస్తుతం చిరంజీవి 152 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకుడు . ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చిరంజీవ్ లుక్ పట్ల ఎన్నో ఆసక్తికరమైన వార్తలు హల్ చల్ చేస్తుంటే , మరో హాట్ న్యూస్ బయటికి వచ్చింది అదేంటంటే , ఈ సినిమాలో చరణ్ నటించబోతున్నారు, కాదు బన్నీ కాదు కాదు మహేశ్ నటించబోతున్నారు . ఇంతకీ చిరు సినిమాలో ఎవరు నటిస్తున్నారు, ఏ పాత్ర పోషిస్తున్నారో తెలుసుకోవాలంటే చదవండి.
చిరు152 వ సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్ అనుకుంటన్నారు .ఈ సినిమాలో చిరు ఓ కమ్యునిస్ట్ గా కనిపించబోతున్నట్టు ఇటీవల లీక్ అయిన ఓ పిక్ చూస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. అయితే ఈ చిత్రంలో యంగ్ చిరంజీవి పాత్ర ఓ లెక్చరర్ అని , అసలు లెక్చరర్ గా ఉన్న ‘ఆచార్య’ నక్సలైట్ గోవింద గా ఎలా మారడానికి దారి తీసిన పరిస్ధితులు ఏంటి.. అన్నది అసలైన కథ . లెక్చరర్ ఆచార్య పాత్ర గురించే ఇప్పుడు డిస్కషన్ .

రెండున్నర గంటల సినిమాలో సుమారు 40 నిమిషాల పాటు ఉండే లెక్చరర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట . అందుకే ఈ క్యారెక్టర్ చేయడానికి అంతే పవర్ ఫుల్ యాక్టరైతే బాగుంటుందని చరణ్ ని అనుకున్నారు . అయితే రాజమౌళి తెరక్కిస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉంది. అందులోనూ 2021 జనవరి 8 అంటూ విడుదల తేదీ కూడా అనౌన్స్ చేసేసారు. కాబట్టి ఆ పాత్ర చరణ్ చేయడం కుదరట్లేదు.

బన్నీతో చేయిద్దాం అని స్వయంగా చిరునే చరణ్ తో చెప్పారట . ‘రుద్రమదేవి’ చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రని బన్నీ చాలా బాగా చేసాడు కాబట్టి… తనే కరెక్ట్ అని సిఫార్స్ చేసారట చిరు. కానీ మహేశ్ అయితే బెటరని దర్శకుడు శివ అభిప్రాయం . దాంతో బన్నీని తీసుకుందామా ? మహేశ్ ని తీసుకుందామా? అనే మీమాంసలో మహేశ్ ఫైనల్ అయినట్టు సమాచారం. అల్లు అర్జున్ సుకుమార్ సినిమాతో బిజీ, ఆ సినిమా కోసం లుక్ కూడా మార్చి లావయ్యాడు . సో మహేశ్ బాబు ఫిక్స్.

ఈ పాత్ర మహేశ్ ఒప్పుకోవడానికి రీజన్స్ ఉన్నాయి . చరణ్ కి మహేశ్ కి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది, డైరెక్టర్ శివ ఇప్పటికి మహేశ్ కి రెండు హిట్స్ ఇచ్చాడు.మరోవైపు మహేష్ సినిమా కూడా డిలే అయ్యింది. సో మొత్తంగా షూటింగ్ పార్ట్ కు 30 రోజుల కాల్షీట్స్ కు ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఇంకేంటి అటు మెగాస్టార్ ఫ్యాన్స్ కి, ఇటు ప్రిన్స్ ఫ్యాన్స్ మొత్తంగా తెలుగు సినిమా అభిమానులకి పండగే.










ప్రస్తుతం చాలా మంది సినిమాలను థియేటర్ కి వెళ్లకుండా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటి ప్లాటుఫార్మ్స్ లో సినిమాలు చూస్తున్నారు. సినిమా విడుదలైన రెండు నెలలకే అందులో రావడంతో థియేటర్స్ పై ఎక్కువ మక్కువ చూపించట్లేదు. విదేశాల్లో అయితే ఇది మరి ఎక్కువ.
అయితే అలా వైకుంఠపురంలో సినిమాకి ఓటిటి ప్లాటుఫార్మ్స్ లో లభించదు తెలిసి చాలా మంది థియేటర్ కి వెళ్లి చూసారు. పాజిటివ్ టాక్ రావడంతో అందరు థియేటర్ కి వెళ్లారు. అయితే ఇప్పుడు ఇలా నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమయ్యేసరికి అందరు ఆశ్చర్యపోతున్నారు. మమ్మల్ని థియేటర్లకు రప్పించడంకోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారా అంటూ సినిమా యూనిట్ పై ఫైర్ అవుతున్నారు నెటిజెన్స్.














సంక్రాంతికి సూపర్ హిట్ అయిన చిత్రం “అల వైకుంఠపురంలో”…అల్లు అర్జున్ నటన, థమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ డైరెక్షన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో ఎత్తు. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ విశాఖపట్నంలో జరిగింది.ఈ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ “అల వైకుంఠపురములో సినిమా గురించి ఇప్పటికే చాలా చెప్పాము. కానీ ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా కొన్ని చెప్పాలి. ఈ సినిమాని తన భుజం మీద మోసుకొచ్చాడు థమన్. విలువలతో సినిమా తీయండి. మేమెందుకు ఆదరించమో.. చూపిస్తాం అని మీరంతా చెప్పారు. అది మాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది.



