దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయిన కార్తి జపాన్, లారెన్స్ జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. రెండు భాషల్లో పండుగకు రిలీజైన సినిమాల్లో ఇవే భారీ బడ్జెట్ మూవీస్ కావడం గమనార్హం. జపాన్ సినిమాకు రాజ్ మురుగన్ డైరెక్టర్.జిగర్ తాండ సీక్వెల్కు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు.
భారీ అంచనాలతో రిలీజైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.తెలుగులో విడుదలైన చిత్రాలు కంటే ఈ డబ్బింగ్ చిత్రాలకి రిలీజ్ ముందు ఎక్కువ క్రేజ్ ఉంది. అయితే ఆ క్రేజ్ నిలబెట్టుకోవడంలో ఈ రెండు చిత్రాలు ఫెయిల్ అయ్యాయి.

కార్తి జపాన్ చిత్రం అయితే మూడు రోజుల్లో వరల్డ్ వైడ్గా 15 కోట్లకు పైగా గ్రాస్, ఏడున్నర కోట్లకు వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో ఈ మూవీ ఇప్పటివరకు మూడున్నర కోట్ల వరకు గ్రాస్ను, కోటి డెబ్బై లక్షల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సినీ ట్రేడ్ వర్గాల సమాచారం.తొలిరోజు జపాన్ మూవీకి కోటికిపైగా కలెక్షన్స్ వచ్చాయి. అయితే నెగెటివ్ టాక్ కారణంగా మూడో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఆదివారం ఈ సినిమా 35 లక్షల వరకు మాత్రమే వసూళ్లు రావడం చూస్తే తెలుస్తుంది ఇది ఏ రేంజ్ డిజాస్టర్ అనేది. జపాన్ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించింది.లారెన్స్, ఎస్జేసూర్య హీరోలుగా నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ తెలుగులో పూర్తిగా నిరాశ పరిచింది. లారెన్స్ కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.

మూడు రోజుల్లో ఈ మూవీకి రెండు కోట్ల నలభై లక్షల వరకు గ్రాస్, కోటి ఇరవై లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మూడో రోజు ఈ సినిమా 50 లక్షల వరకు వసూళ్లు దక్కించుకున్నట్లు తెలిసింది. తెలుగులో కార్తి జపాన్ కంటే జిగర్ తాండ ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. జపాన్ నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజవ్వగా…జిగర్ తాండ డబుల్ ఎక్స్ ఐదున్నర కోట్ల వరకు ప్రీ రిలీజ్ చేసింది. కలెక్షన్స్ చూస్తుంటే రెండు సినిమాలు తెలుగులో బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగానే కనిపిస్తోంది. బయ్యర్స్ కు నష్టాలు తప్పేలాగా లేదు.
Also Read:నాని నెక్స్ట్ సినిమాలో విలన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!








చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఆయన 1942లో కృష్ణాజిల్లాలోని పమిడిముక్కలలో మే 23న జన్మించారు. 1966లో రంగులరాట్నం అనే సినిమాతో చంద్రమోహన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే నంది అవార్డ్ ను అందుకున్నారు. కెరీర్ మొదట్లో హీరోగా నటించిన చంద్రమోహన్, 175 పైగా సినిమాలలో హీరోగా చేశారు. ఆ తరువాత ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించిన ఆయన మొత్తం 932 చిత్రాలలో నటించాడు.
సెకండ్ హీరోగా, హీరోగా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా వైవిధ్యమైన క్యారెక్టర్లలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల ద్వారా ఆయన తెలుగు ఆడియెన్స్ మనసులో చెరిగిపోని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్స్ కి చంద్రమోహన్ను లక్కీ హీరోగా చెబుతారు. ఆయన పక్కన నటించిన హీరోయిన్స్ ఆ తరువాతి కాలంలో టాప్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీని ఏలారు. వారిలో జయప్రద, జయసుధ, శ్రీదేవి, సుహాసిని, విజయశాంతి వరకు చాలా మంది ఉన్నారు. వారంతా కెరీర్ తొలినాళ్లలో చంద్రమోహన్ తో నటించినవారే.
చంద్రమోహన్ కెరీర్ లో ఆయన నటనకు గానూ 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. ఆయన భార్య పేరు జలంధర. మంచి రచయిత్రి. పలు కథా సంకలనాలను రాశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, మధుర మీనాక్షీ అమెరికాలో స్థిరపడింది. రెండవ కుమార్తె మాధవి డాక్టర్ చెన్నైలో స్థిరపడింది.
విషయం తెలియగానే ఇంటికి వచ్చిన బాలిక కుటుంబసభ్యులు రూమ్ బయట వైపు తాళం వేశారు. ఆ తరువాత కొందర్ని పిలిచి ఆ యువకుడి పై దాడి చేశారు. దారుణంగా కొట్టి, దాదాపు 3 గంటల పాటు అతన్ని చిత్ర-హిం-స-ల-కు గురి చేసి, కుమార్తెకు జోలికి మళ్ళీ రావద్దని వార్నింగ్ ఇచ్చి, విడిచిపెట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు తన ఇంటికి వెళ్ళి, కిందపడి అపస్మారక స్థితికి వెళ్లాడు.
కరణ్ కుటుంబసభ్యులు అతన్ని వెంటనే ఘట్కేసర్ గవర్నమెంట్ హాస్పటల్ కి తరలించారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు, అప్పటికే అతడు మరణించినట్టుగా ధ్రువీకరించారు. కరణ్ తల్లి సుశీల కంప్లైంట్ చేయడంతో, ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి, కరణ్ పై దాడి చేసిన 10 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పోలీసులు ఈ సంఘటన పై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ప్రస్తుత రోజుల్లో మానవత్వానికి విలువనివ్వడం లేదు. డబ్బుకి, ఆస్తులకు ఇచ్చే విలువలో సగం కూడా కుటుంబ బంధాలకు ఇవ్వడం లేదు. అలా అనడానికి తాజాగా జరిగిన ఒక సంఘటననే ఉదాహరణగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలంలోని గామాలపాడు చెందిన ఏడుకొండలు, వెంకటరత్నమ్మలకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని తమకున్నంతలో పెంచి, పెద్ద చేసి ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. అయితే వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుమారుడు వెంకటేష్ కు వారు భారమయ్యారు.
ఇక ఆస్తి పంపకాలలో వచ్చిన గొడవల వల్ల వెంకటరత్నం పై కొడుకు, కోడలు దాడి చేశారు. దాంతో వెంకటరత్నం చెయ్యి విరిగింది. విషయం బయటికి వస్తుందని కుమారుడు తల్లి పై కాస్త జాలి కూడా లేకుండా నల్గొండ జిల్లా, మిర్యాలగూడలోని ఒక తండాలోని శ్మశానవాటికలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత అక్కడికి మొక్కలకు నీళ్ళు పోసే పని చేసే గ్రామపంచాయతీ వర్కర్ శ్రీనివాస్ వెళ్లాడు. అక్కడ ఉన్న వెంకటరత్నం చూసి వెంటనే సర్పంచ్ కు తెలియచేశాడు.
దాంతో సర్పంచ్, గ్రామస్తులు వెంకటరత్నం వివరాలు తెలుసుకుని పోలీసులకు తెలిపారు. ఆమె ఇంటికి వెళితే కొడుకు, కోడలు తనను చంపేస్తారని భయాందోళనను వ్యక్తం చేసింది. హాస్పటల్ కి తీసుకు వెళ్లమని కన్నీటితో వేడుకొంది. గాయాలతో బాధపడుతున్న ఆ వృద్ధురాలిని పోలీసులు మిర్యాలగూడ హాస్పటల్ కి తరలించారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి, దాచేపల్లి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.

