2023 వన్డే ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 16న సెమీఫైనల్స్, 19 ఫైనల్స్ మ్యాచ్ జరగనున్నాయి. సెమీఫైనల్స్ లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ని ఓడించాలని అటు భారత జట్టుతో పాటు ఇటు యావత్తు భారత అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
నిన్న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన విజృంభించి ఆడింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీం 410 పరుగుల భారీ స్కోరు చేసింది.మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్, కే.ఎల్ రాహుల్ అయితే సెంచరీలతో చెలరేగిపోయారు. రోహిత్ శర్మ, కోహ్లీ, శుభమన్ గిల్ అయితే టీం కి మంచి ఆరంభాన్ని అందించారు.

వీళ్ళందరి సమిష్టి కృషితో భారత భారీ స్కోర్ చేయగలిగింది.తర్వాత బ్యాటింగ్ కి దిగిన నెదర్లాండ్స్ కూడా నిలకడగానే ఆడింది. భారత్ కి విజయం లాంచనమని తెలిసిపోయాక రోహిత్ శర్మ బ్యాటర్ ల చేత కూడా బౌలింగ్ చేయించాడు. కోహ్లీ బౌలింగ్ వేసి ఒక వికెట్ తీసుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్, గిల్ కూడా బౌలింగ్ చేశారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బౌలింగ్ చేయగా ఆఖరి వికెట్ అతనికి దక్కింది దీంతో 9 మ్యాచ్ లలోను భారత్ విజయాన్ని నమోదు చేసింది.ఈ సమిష్టి విజయాల పైన కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. వరల్డ్ కప్పుకి ముందు ప్రతి ఒక్కరం ఒక్కో మ్యాచ్ ను గెలుచుకుంటూ వెళ్లాలని ప్రణాళిక రచించినట్లుగా తెలిపాడు. అన్ని మ్యాచ్ లపై ఒకేసారి దృష్టిపెట్టే కంటే ఏ మ్యాచ్ ని ఆ మ్యాచ్ స్పెషల్ గా చూసామని తెలిపారు.

మైదానంలో కూడా దానికి తగ్గట్టు నడుచుకుంటూ టీం విజయం కోసం పోరాడమని తెలియజేశాడు.టీంలో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారని ఇది టీం కి శుభ సూచకమని, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా మాలో ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. అభిమానులకు మాపైన భారీ అంచనాలు ఉన్న అవన్నీ పక్కనపెట్టి కేవలం ప్రదర్శన మీదే దృష్టి పెట్టామని అన్నారు.ఇక సెమీఫైనల్ మ్యాచ్ మీద తమ దృష్టి ఉందని అన్నారు.భారత్ సెమీఫైనల్ నెగ్గి ఫైనల్ కి చేరి కప్పు కొట్టాలని 150 కోట్ల భారత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. రోహిత్ సేన కూడా ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ సాధించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు చూపెట్టిన ప్రదర్శనమే కొనసాగిస్తే కప్పు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు.
Also Read:టీం ఇండియాకి ఉన్న అతి పెద్ద టెన్షన్ ఇదేనా..? ఈ ఒక్క లోటు తీరితే కప్ కొట్టినట్టే..!

చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఆయన 1942లో కృష్ణాజిల్లాలోని  పమిడిముక్కలలో మే 23న జన్మించారు.  1966లో రంగులరాట్నం అనే సినిమాతో చంద్రమోహన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే నంది అవార్డ్ ను అందుకున్నారు. కెరీర్ మొదట్లో హీరోగా నటించిన చంద్రమోహన్,  175 పైగా సినిమాలలో హీరోగా చేశారు. ఆ తరువాత ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించిన ఆయన మొత్తం 932 చిత్రాలలో నటించాడు.
సెకండ్ హీరోగా, హీరోగా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా వైవిధ్యమైన క్యారెక్టర్లలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల ద్వారా ఆయన తెలుగు ఆడియెన్స్ మనసులో చెరిగిపోని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్స్ కి చంద్రమోహన్ను లక్కీ హీరోగా  చెబుతారు. ఆయన పక్కన నటించిన హీరోయిన్స్ ఆ తరువాతి కాలంలో టాప్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీని ఏలారు. వారిలో జయప్రద, జయసుధ, శ్రీదేవి, సుహాసిని, విజయశాంతి వరకు చాలా మంది ఉన్నారు. వారంతా కెరీర్ తొలినాళ్లలో చంద్రమోహన్ తో నటించినవారే. 
చంద్రమోహన్ కెరీర్ లో ఆయన నటనకు గానూ 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఆరు నంది అవార్డులు అందుకున్నారు.  ఆయన భార్య పేరు జలంధర. మంచి రచయిత్రి. పలు కథా సంకలనాలను రాశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, మధుర మీనాక్షీ అమెరికాలో స్థిరపడింది. రెండవ కుమార్తె మాధవి డాక్టర్ చెన్నైలో  స్థిరపడింది.
 విషయం తెలియగానే ఇంటికి వచ్చిన బాలిక కుటుంబసభ్యులు రూమ్ బయట వైపు తాళం వేశారు. ఆ తరువాత  కొందర్ని పిలిచి ఆ యువకుడి  పై దాడి చేశారు. దారుణంగా కొట్టి, దాదాపు 3 గంటల పాటు అతన్ని చిత్ర-హిం-స-ల-కు గురి చేసి, కుమార్తెకు జోలికి మళ్ళీ రావద్దని వార్నింగ్ ఇచ్చి, విడిచిపెట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు  తన ఇంటికి వెళ్ళి, కిందపడి అపస్మారక స్థితికి వెళ్లాడు.
కరణ్ కుటుంబసభ్యులు అతన్ని వెంటనే ఘట్కేసర్ గవర్నమెంట్ హాస్పటల్ కి  తరలించారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు, అప్పటికే అతడు మరణించినట్టుగా ధ్రువీకరించారు. కరణ్ తల్లి సుశీల కంప్లైంట్ చేయడంతో, ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి, కరణ్  పై దాడి చేసిన 10 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పోలీసులు ఈ సంఘటన పై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ప్రస్తుత రోజుల్లో మానవత్వానికి విలువనివ్వడం లేదు. డబ్బుకి, ఆస్తులకు ఇచ్చే విలువలో సగం కూడా కుటుంబ బంధాలకు ఇవ్వడం లేదు. అలా అనడానికి తాజాగా జరిగిన ఒక సంఘటననే ఉదాహరణగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలంలోని గామాలపాడు చెందిన ఏడుకొండలు, వెంకటరత్నమ్మలకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని తమకున్నంతలో పెంచి, పెద్ద చేసి ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. అయితే వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుమారుడు వెంకటేష్ కు వారు భారమయ్యారు.
 ఇక ఆస్తి పంపకాలలో వచ్చిన గొడవల వల్ల వెంకటరత్నం పై కొడుకు, కోడలు దాడి చేశారు. దాంతో వెంకటరత్నం చెయ్యి విరిగింది. విషయం బయటికి వస్తుందని కుమారుడు తల్లి పై కాస్త జాలి కూడా లేకుండా నల్గొండ జిల్లా, మిర్యాలగూడలోని ఒక తండాలోని శ్మశానవాటికలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత అక్కడికి మొక్కలకు నీళ్ళు పోసే పని చేసే గ్రామపంచాయతీ వర్కర్ శ్రీనివాస్ వెళ్లాడు. అక్కడ ఉన్న వెంకటరత్నం చూసి వెంటనే సర్పంచ్ కు తెలియచేశాడు.
దాంతో సర్పంచ్,  గ్రామస్తులు వెంకటరత్నం వివరాలు తెలుసుకుని పోలీసులకు తెలిపారు. ఆమె ఇంటికి వెళితే కొడుకు, కోడలు తనను చంపేస్తారని భయాందోళనను వ్యక్తం చేసింది. హాస్పటల్ కి తీసుకు వెళ్లమని కన్నీటితో  వేడుకొంది. గాయాలతో బాధపడుతున్న ఆ వృద్ధురాలిని పోలీసులు మిర్యాలగూడ హాస్పటల్ కి తరలించారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి, దాచేపల్లి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.












