రాజనాల మొదలుకొని కైకాల సత్యనారాయణ , కోటా శ్రీనివాసరావు , నర్రా వెంకటేశ్వర్రావు , రామిరెడ్డి, సత్య, అమ్రిష్ పూరి ఇలా చెప్పుకుంటూ పోతే మన విలన్ల లిస్టు పెద్దదే. సినిమాల్లో విలన్లుగా వీళ్లని చూడగానే దడపుట్టేది . ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడంలో హీరో పాత్ర ఎంతుంటుందో,హీరోకి ధీటుగా ఉండే విలన్ పాత్ర కూడా అంతే ఉంటుంది.

ఇప్పటి చిత్రాల్లో విలన్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ప్రకాశ్ రాజ్ . తండ్రిగా ప్రేమని ప్రదర్శిస్తూనే ఒకే సమయంలో విలన్ గా కూడా విలక్షణంగా నటించగల నటుడు ప్రకాశ్ రాజ్ .ప్రభాకర్,అజయ్, ముకేశ్ రుషి, షియాజి షిండే, పరేష్ రావెల్,అశుతోష్ రానా, రోబో చిత్ర విలన్ డాని, మురళి శర్మ వీళ్లందరిది విలనిజంలో విభిన్న పంథా .

నిజానికి మన మనసుల్లో వాళ్లపట్ల ఒక ముద్ర ఉంటుంది. కానీ ఒకప్పుడంటే తారల గురించిన విషయాలు బయటికి వచ్చేవి కావు, కాని ఇఫ్పుడు సోషల్ మీడియా పుణ్యమాని నటులకి సంబంధించిన విషయాలు ఈజిగా తెలిసిపోతున్నాయి.

సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేసేవాళ్లంతా బయట జీవితంలో రియల్ హీరోలు అనిపించుకుంటున్న ఘటనలు ఇటీవల చాలా జరిగాయి .ఉదాహరణకి ప్రకాశ్ రాజ్, సియాజిషిండే , సోనూసూద్ , మరియు రేసు గుర్రం విలన్ రవి కిషన్ వీళ్లంతా బయట సొసైటీలో మంచి పనులు చేస్తూ , సామాజికంగా తమ గొంతు వినిపిస్తూ రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు.

సినిమాల్లో విలనిజాన్ని పండించిన మన విలన్ల భార్యలు ఎలా ఉంటారు? వాళ్ల కుటుంబ సభ్యులెలా ఉంటారు లాంటి డౌట్లు కూడా మనకి అప్పుడప్పుడు వస్తుంటాయి. నిజానికి మన విలన్ల భార్యలందరూ అందగత్తెలే , వాళ్లల్లో కొందరు మనకి తెలిసిన నటీమనులు కూడా, ఉదాహరణకి మురళీ శర్మ భార్య అశ్విని బద్రినాథ్ మూవిలో విలన్ రోల్ చేసింది.

అశుతోశ్ రానా భార్య రేణుక సుహాని ఒకప్పటి బుల్లితెర హోస్ట్ , నటి. సల్మాన్ మాదురి జంటగా వచ్చిన హమ్ ఆప్ కే హై కౌన్ సినిమాలో రేణుక పాత్ర గుర్తుండిపోతుంది. ప్రకాశ్ రాజ్ భార్య రీనా రాయ్ క్యాస్టుమ్ డిజైనర్ . ప్రకాశ్ రాజ్ మొదటి భార్య, డిస్కోశాంతి అక్కా చెల్లెల్లు , అంటే శ్రీహరి, ప్రకాశ్ రాజ్ తోడళ్లుల్లు ఒకప్పుడు.

దివంగత నటుడు రఘువరన్ , నటి రోహిణి భార్యభర్తలు .. రోహిణి బాలనటిగా సినిమారంగ ప్రవేశం చేసింది, బుల్లితెర నటుడు బాలాజి ,రోహిణి ఇద్దరు అక్కాతమ్ముళ్లు. ప్రేమవివాహం చేసుకున్న రోహిణి,రఘువరన్ కొంతకాలం కాపురం తర్వాత విడాకులు తీసుకున్నారు . సినిమాలకు దూరమైన రోహిణి, తల్లి పాత్రల్లో మళ్లీ అలరిస్తున్నారు.

వదల బొమ్మాలి నిన్నొదలా అనే డైలాగ్ తో ప్రేక్షకులని భయపెట్టిన పశుపతి అలియాస్ సోనూసూద్ భార్య సోనాలిసూద్ యాక్టర్, మోడల్ మరియు ప్రొడ్యుసర్.





సాఫీగా సాగిపోతున్న రైలు ప్రయాణంలో తమ రైలు పట్టాలు తప్పిందని ప్రయాణికులు తెలుసుకునేలోగా ట్రైన్స్ ఢీ కొని కొందరిని మృత్యువు కబళించింది. కొందరు స్పాట్లోనే, మరికొందరు బోగీల్లో ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. ప్రమదస్థలం భయనకంగా మారింది. కోచ్లు 30 వరకు నుజ్జునుజ్జయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన విధానానికి మృతదేహాలు చెల్లాచెదురు అయిపోయాయి. బోగీల్లో చిక్కుకున్న బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లి పోయింది. అయితే ఈ ఇంత ఘోర ప్రమాదం జరగడానికి గల కారణం బయటకు వచ్చింది.
ఇప్పటిదాకా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, కోరమండల్ ట్రైన్ ను ఢీకొడితే, అది వెళ్ళి గూడ్స్ ఢీకొట్టినట్టు అధికారులు చెప్పారు. అయితే అది నిజం కాదని తేలింది. జరిగిన యాక్సిడెంట్ కు సిగ్నలింగ్ మరియు టెలికమ్యూనికేషన్ ఫెయిల్యూరే కారణం. వేగంగా వస్తున్న కోరమాండల్ ట్రైన్ కి దారి ఇవ్వడం కోసం ఆ ట్రాక్ పైన ఉన్న గూుడ్స్ ని రైల్వే అధికారులు లూప్ లోకి పంపారు. అయితే 110కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కోరమాండల్ ట్రైన్ బహెనాగ్ రైల్వే స్టేషన్ కు వచ్చాన తరువాత సిగ్నలింగ్ లోపం వల్ల గూడ్స్ ఉన్న లూప్ లైన్లో కి వెళ్లింది.
కానీ సిగ్నల్ ప్యానెల్ లో ఆ ట్రైన్ మెయిన్ లైన్ లోనే వెళ్తున్నట్టు చూపించింది. దాంతో మెయిన్ లైన్ వెళ్తుందనుకుని లూప్ లైన్లో వెళ్లి ఆ ట్రాక్ మీద ఉన్న గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టింది. దాంతో కోరమాండల్ భోగీలు కొన్ని గూడ్స్ భోగీల మీద ఎక్కాయి. కోరమాండల్ భోగీలు కొన్ని పక్కనే ఉన్న వేరే ట్రాక్ పై పడ్డాయి. కాసేపటికి పక్క ట్రాక్ పైకి వచ్చిన యశ్వంత్ పూర్ ట్రైన్ ట్రాక్ పై పడిన కోరమాండల్ భోగీలను ఢీకొట్టింది.|
కోరమాండల్ ట్రైన్ గూడ్స్ ని ఢీకొని 16 నిముషాలు అయినా అటువైపు వస్తుున్న యశ్వంత్ పూర్ ట్రైన్ ను మరో స్టేషన్ లో ఆపలేదు. శుక్రవారం నాడు మొత్తం సిగ్నలింగ్ వ్యవస్థ కుప్పకూలింది. ఈ ఘోరప్రమాదానికి కారణం సిగ్నల్ మరియు టెలి కమ్యూనికేషన్ టెక్నికల్ సమస్య అని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇదంతా 15 నిముషాల వ్యవధిలోనే జరిగిందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఓటీటీలకు ఉన్న క్రేజ్ ఏమిటో అందరికి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఓటీటీలు ప్రతివారం కొత్త చిత్రాలు, సిరీస్ లు విడుదల చేస్తూ వాటి స్పేస్ ను పెంచుకుంటున్నాయి. అయితే ఓటీటీలో ఇప్పటివరకు ధూమపానం మరియు మద్యపానం గురించిన చట్టం ఏది లేదు. దాంతో ఓటీటీలో వచ్చే కంటెంట్ లో విచ్చల విడిగా సిగరెట్ మరియు మద్యం తాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారం అయ్యే కంటెంట్ లో ఇక పై ధూమపానంకు సంబంధించిన దృశ్యాలు వచ్చినపుడు స్కిన్ క్రింది భాగంలో కనిపించేలా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిపే హెచ్చరికను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ రూల్ ను అమలు చేయనట్లయితే కేంద్ర ఆరోగ్య, ప్రసార, సమాచార, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖలు ఆ ఓటీటీలకు నోటీసులు జారీ చేయడం జరుగుతుంది.
వివరణ ఇచ్చేందుకు, అలాగే మార్పులు చేయడానికి తగిన టైంను ఇస్తాయి. ఇక ఈ నిబంధనలు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఆడియో-విజువల్ ప్రోగ్రాములు, సీరియల్స్, టెలివిజన్ ప్రోగ్రాములు, వెబ్ సిరీస్, పాడ్కాస్ట్లు వంటి ఇతర కంటెంట్కు కూడా వర్తిస్తాయి.



వికారం, ఉబ్బరం, అజీర్తి, డయేరియా, వాంతులు, కడుపునొప్పి, స్కిన్ రాషెస్, ఆకలి లేకపోవడం


గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్లో నివసిస్తున్న హీరాబెన్ తన ముగ్గురు కుమార్తెలతో పాటు జీవించేది. తన పిల్లల బాగోగులు చక్కగా చూసుకునేది. ఆమెకు బీపీ రావడంతో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా గుండెపోటు వచ్చి కన్ను మూసింది. దాంతో ఆ ముగ్గురు సోదరీమణులు తల్లి లేని వారు అయ్యారు. తల్లి మరణించిన 6 నెలల వరకు ఆమె ఆలోచనలతోనే గడిపారు. అప్పుడు వారికి తల్లి తిరిగి తీసుకురాలేము కానీ ఆమె ఆమె విగ్రహాన్ని అయితే తీసుకురావచ్చని, 6 అడుగుల ఎత్తైన తల్లి విగ్రహాన్ని తేరు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు.
హీరాబెన్ తన జీవితాంతం వరకు తన కుమార్తెలకు ప్రతి విషయంలో మద్దతుగా ఉంది. తమ తల్లి విగ్రహానికి రోజూ హారతి ఇస్తారు. తమ కళ్ళ ముందు అమ్మ ఉన్నట్టుగానే భావిస్తున్నారు. ఇప్పుడు ఆ సోదరీమణులు తమ తల్లి లేదని బాధపడటం లేదు. విగ్రహంలోనే తమ తల్లిని చూసుకుంటున్నారు.
రోజూ విగ్రహాన్ని చూస్తూ కబుర్లు చెబుతూ తల్లి లేని లోటును మర్చిపోతున్నామని చెబుతున్నారు ఈ అక్కచెల్లెల్లు. అలాగే ఆమె జ్ఞాపకార్థం ఒక ఫౌండేషన్ను ప్రారంభించి, దాని ద్వారా పలువురికి సంక్షేమ సహాయాన్ని అందిస్తున్నారు. అనాథ పిల్లలకు అన్నదానం, చదువు లేనిపిల్లలకు వారి చదువు కోసం సహాయం చేస్తున్నారు.








