చిన్నతనంలోనే కుటుంబాన్ని పోషించే తండ్రి కన్నుమూయడంతో పిల్లలను పెంచడం కోసం వంట మనిషిగా మారిన తల్లిని చూస్తూ పెరిగిన ఒక యువకుడు. తల్లి పడిన కష్టంతో చదివి సివిల్స్లో ర్యాంకును తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి కష్టం అనే మాటకి అర్థం తెలియదని చెప్పవచ్చు.
తల్లిదండ్రులు అన్ని సమకూరుస్తున్నా, ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నా, చిన్న చిన్న వాటికే బాధ పడుతున్నారు. కొందరు అయితే వాటికి భయపడి జీవితానికి అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కానీ ఒక యువకుడి మాత్రం చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు పడుతూ అనుకున్నది సాధించాడు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆసిఫాబాద్ జిల్లాలోని రిబ్బెన మండలంలోని తుంగెడకు చెందిన మనోహర్, విస్తారిల కుమారుడు డోంగ్రి రేవయ్య. అతని తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. తల్లి విస్తారి గవర్నమెంట్ స్కూల్ లో వంట మనిషిగా పని చేస్తుంది. ఇక రేవయ్య చదువు చిన్నతనం నుండి గవర్నమెంట్ స్కూల్ లోనే కొనసాగింది. కాగజ్ నగర్ శిశుమందిర్లో 5వ తరగతి వరకు, ఆ తరువాత టెన్త్ క్లాస్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం లో చదువుకున్నాడు. ఆ తర్వాత రేవయ్య హైదరాబాద్ సాంఘిక సంక్షేమ కాలేజ్ లో ఇంటర్ చేశాడు.
మద్రాస్ ఐఐటీ కాలేజ్ లో బీటెక్ చేసి, ప్రైవేట్ కంపెనీలో జాబ్ సాధించాడు. అయితే రేవయ్యకు ఆ జాబ్ లో సంతృప్తి కలగలేదు. దాంతో జాబ్ చేస్తూ, సివిల్స్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. జాబ్ వల్ల సరిగా ప్రిపేరు అవట్లేదని రేవయ్య జాబ్ ను వదిలి పూర్తిగా ప్రిపరేషన్ పై పోకస్ చేశాడు. అందుకు తల్లి కూడా మద్దతు తెలిపి, ఫ్యామిలీ పోషణ అంతా విస్తారి చూసుకుంది.
తాను ఉద్యోగం మానేయడం వల్ల తల్లి పని చేస్తూ, కష్టపడటం చూసి బాధ కలిగినా, తన లక్ష్యం కోసం బాగా చదివి, తాను అనుకున్న లక్ష్యాన్ని సాదించాడు. తాజాగా రిలీజ్ అయిన యూపీఎస్సీ రిజల్ట్స్ లో రేవయ్యకు 410వ ర్యాంక్ వచ్చింది. ఆలిండియా ర్యాంక్ సాదించిన రేవయ్యను ప్రశంసిస్తున్నారు.
Also Read: ఈ ఫోటో వెనుక ఉన్న కథ ఎంటో తెలిస్తే… హ్యాట్సాఫ్ అనాల్సిందే..!



































తన వదిన విషయంలో ఒక మరిది చేసిన పని అందరిని షాక్ అయ్యేలా చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో కొంత మంది నెటిజెన్లు అతనిపై ప్రశంసలను కురిపిస్తూ ఉన్నారు. అయితే ఆ మరిది ఏం చేశాడంటే అతను తన అన్న భార్యను వివాహం చేసుకున్నాడు. షాక్ అయ్యారా? అదేంటి వదినను పెళ్లి చేసుకోవడం తప్పు. అతన్ని మెచ్చుకోవడం ఎందుకు అనుకుంటున్నారు కదా. ముగ్గురు పిల్లలు ఉన్న ఆ మహిళ భర్త మరణించడంతో పిల్లల బాధ్యత చూసుకుంటూ ఒంటరిగా బ్రతుకుతోంది. అయితే ముగ్గురు పిల్లల బాధ్యతలను తీసుకోవాలని మారిది అనుకున్నాడు
ఈ క్రమంలోనే తన అన్న భార్యను వివాహం చేసుకున్నాడు. శంబాజీ అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. శంబాజీకి భార్య, ఎనిమిది నెలల కొడుకు, ఇద్దరు కవలల ఉన్నారు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న వదినను, అన్న పిల్లలను చూసి బాధపడిన శంబాజీ తమ్ముడు రాహుల్ వినోద్ ఒంటరిగా బ్రతుకుతున్న వదినకు తోడు ఉండడానికి, తన అన్న పిల్లల బాధ్యతలను తీసుకోవడానికి అన్న భార్యను పెళ్లి చేసుకున్నాడు. అందువల్లనే అతని పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.















కవల ఆడపిల్లలు పుట్టారని ఓ తండ్రి భార్యని, పిల్లలను వదిలిపెట్టాడు. దాంతో ఆ ఇద్దరు ఆడ పిల్లలను తాతయ్య, అమ్మమ్మలు చదివించారు. వారి కష్టం వృధా కాలేదు. ఆ ఆడ పిల్లలు బాగా చదువుకుని ఎస్ఎస్సి రిజల్ట్స్ లో 10 జిపిఏ తెచ్చుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలంలోని కేశవ పట్నం అనే గ్రామానికి చెందిన రిటైర్ ఉద్యోగి అయిన అల్లంకి వీరేశంకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
వీరేశం కుమార్తె కవితను పెద్దపల్లి కలెక్టరేట్ లో ఔట్సోర్సింగ్ విభగంలో ఎలక్ట్రానిక్స్ జిల్లా మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. 16 సంవత్సరాల క్రితం కవితను డెలివరీ కోసం ఏడవ నెలలో భర్త పుట్టింటికి పంపించాడు. అయితే కవితకు కవల ఆడపిల్లలు జన్మించడంతో భర్త ఆమెను పుట్టింట్లోనే వదిలేశాడు.
ఇక అప్పటి నుండి కవితను, ఆమె పిల్లలను అమ్మ వనజ, నాన్న వీరేశం చూసుకుంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలు శార్వాణి, ప్రజ్ఞాని 5వ తరగతి వరకు ప్రైవేట్ బడిలో , 6 వ తరగతి నుండి మోడల్ స్కూల్లో చదువును కొనసాగించారు. తాజాగా రిలీజ్ అయిన 10 వ తరగతి ఫలితాల్లో శార్వాణి, ప్రజ్ఞాని 10 జిపిఏ తెచ్చుకుని రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా శార్వాణి, ప్రజ్ఞాని మీడియాతో మాట్లాడుతూ తమ అమ్మమ్మ తాతయ్యలు, తమ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి ప్రోత్సాహంతో బాగా చదివి 10 జిపిఏ సాధించగలిగామని వెల్లడించారు.