కోటిన్నర విలువైన భూమిని హిందూ మహిళలు మసీదు కట్టడం కోసం ఇచ్చేసి పెద్ద మనసుని చాటుకున్నారు. పైగా అది చనిపోయిన తమ తండ్రి చివరి కోరిక. మరి ఇక దీని కోసం వివరాలని చూస్తే.. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కాశీపూర్ పట్టణంలో ఇది జరిగింది.
20 ఏళ్ల కిందట తండ్రి మరణించినా ఆయన కోరికని వీళ్ళు తీర్చారు. కాశీపూర్ పట్టణానికి చెందిన రైతు లాలా బ్రజ్నందన్ ప్రసాద్ రస్తోగి తన భూమి లో కొంత భాగాన్ని మసీదుకు ఇవ్వాలనుకున్నాడు.

కానీ ఇది అవ్వకుండానే 2003 లో 80 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. ఈ విషయాన్ని బ్రతికున్నప్పుడే బంధువులకి ఆయన చెప్పడంతో.. వాళ్ళ ద్వారా ప్రసాద్ కుమార్తెలు సరోజ్, అనితలకు ఈ మధ్యే తెలిసింది. సరోజ్, అనితలు తమ సోదరుడు రాకేశ్ రస్తోగికి ఈ విషయం చెప్పగా.. అంతా కలిసి నాలుగు ఎకరాల భూమిని మసీదుకు దానం చేయడానికి సిద్ధం అయ్యారు.

తమ వాటాగా వచ్చిన భూమిని మసీదుకు సరోజ్, అనితలు ఆదివారం ఇవ్వడం జరిగింది. ఆయన ఆఖరి కోరిక తీర్చడం మా బాధ్యత అన్నారు కూతుళ్లు. అలానే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది అని రాకేష్ అన్నారు. ఇద్దరు అక్కా చెల్లెళ్లు మత ఐక్యతకు ప్రత్యక్ష ఉదాహరణ అని కాశీపూర్ మసీదు కమిటీ చీఫ్ హసిన్ ఖాన్ అన్నారు.

లాలా బతికున్నప్పుడు ఏదైనా ముఖ్య కార్యక్రమాలకు ఆయన నుంచే తొలి విరాళం మేము పొందే వాళ్ళం అని హసిన్ చెప్పారు. లాలా ముస్లింలకు మసీదు వద్ద ముస్లీములకి పండ్లు, స్వీట్లు పంచిపెట్టేవారని కూడా అన్నారు. లాలా మరియు మా తండ్రి మహ్మద్ రజా ఖాన్ మంచి స్నేహితులని.. వారిది 50 ఏళ్ల అనుబంధమని చెప్పారు.

కోయంబత్తూరు సోమయం పాల్యంకు చెందినటువంటి ప్రశాంత్.. రఘునాథ పురానికి చెందినటువంటి హెచ్.తేజస్విని ఒక ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని చాలా దగ్గర అయిపోయారు. అది ఎంతలా అంటే ఒకరికొకరు ఏదైనా చేసే అంత.
ఈ క్రమంలో ప్రశాంత్ ఆన్లైన్ బెట్టింగ్స్ కు చాలా అలవాటు పడ్డాడు. వాటి కోసం పదిహేను లక్షల రూపాయల వరకు అప్పు చేసి బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. దీంతో అప్పిచ్చిన వాళ్లంతా ప్రశాంత్ పై ఒత్తిడి చేయడంతో ఆ విషయాన్ని తన లవర్ తేజస్వికి చెప్పుకున్నాడు. దీంతో ఇద్దరూ ఎలాగైనా మనీ సంపాదించాలని ఈజి మని కోసం దొంగతనాల బాటపట్టారు. తేజస్వినికి స్కూటీ కూడా ఉంది. ఆ బండి పై తొండమూత్తూరు వైపు వెళ్లారు.
అక్కడ ఫైర్ స్టేషన్ సమీపంలో మేకలు కాస్తున్న వృద్ధురాలి దగ్గరికి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెళ్లారు. ఆ ముసలావిడను అడ్రస్ అడిగినట్టే అడిగి మెడ నుంచి గోల్డ్ చైన్ లాక్కొని స్కూటీపై ఇద్దరు పరారయ్యారు. దీంతో ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ పరిశీలించి తమదైన శైలిలో విచారణ చేపట్టి తేజస్విని బైక్ నెంబర్ ను గుర్తించారు. దాని ఆధారంగా అడ్రస్ పట్టుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ స్టైల్ లో విచారించగా జరిగిన విషయం అంతా ఒప్పుకున్నది. కొన్ని నెలల కిందట ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారం కూడా కనిపించడం లేదని ప్రశాంత్ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో ప్రశాంత్ ఆ బంగారాన్ని దొంగిలించినట్లు కూడా తేలింది. ఈ డబ్బంతా ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టి పోగొట్టుకున్నామని ప్రశాంత్ తెలియజేశాడు. దీంతో ఇద్దరిని కోర్టులో హాజరు పరిచారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ప్రశాంత్ మరియు తేజస్విని తల్లిదండ్రులు ఇద్దరు బడా వ్యాపారస్తులే..


#2
#3
#4
#5
#6
#7











