సాధారణంగా ఏ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ లో అయినా డాక్టర్ ని కలవాలి అంటే కచ్చితంగా కన్సల్టేషన్ ఫీజ్ చెల్లించాలి. అంతే కాదు.. వాళ్ళు అడిగిన టెస్ట్ లకి వేరే బిల్స్ ఉంటాయి. ఇక మందుల సంగతి సరే సరి. ప్రైవేట్ ఆసుపత్రిలో ఇవన్నీ చాలా సాధారణం అయిపోయాయి.
కానీ.. హైదరాబాద్ లో ఉన్న ఈ ప్రైవేట్ ఆసుపత్రి మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఇక్కడ డాక్టర్ కి చూపించుకోవాలంటే ముందుగా క్యాష్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ మాటకి వస్తే.. అసలు క్యాష్ కౌంటర్ అనేదే ఈ హాస్పిటల్ లో ఉండదు.
ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేస్తారు. ఈ హాస్పిటల్ పేరు షాదాన్ హాస్పిటల్. కులమత భేదం లేకుండా.. వైద్యం, మందులు, టెస్ట్ లు ఇలా అన్ని ఈ హాస్పిటల్ లో ఉచితంగానే అందిస్తారు. హిమాయత్ సాగర్ రోడ్డులో ఈ హాస్పిటల్ ఉంది. “డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ ఫ్రీ మెగా క్యాంపు” పేరిట ఇక్కడ ఉచితంగా వైద్యం అందిస్తారు. చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లోని ప్రజలు ఇక్కడకి వచ్చి వైద్యం చేయించుకుంటారు. ఇందుకోసం పలు రూట్లలో ఆసుపత్రి వారే రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసారు.
కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు, పంటి సమస్యలు, ఆర్థోపెడిక్ సమస్యలు ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం అందిస్తారు. ఉచితంగానే అధునాతన వైద్యం అందిస్తూ అందరి ప్రశంసలను పొందుతున్నారు. చికిత్స కోసం వచ్చిన వారికి భోజన సదుపాయాలు, రవాణా సదుపాయాలు కూడా అందిస్తున్నారు. గైనిక్ సర్జరీలు, చెవి, ముక్కు, గొంతు . ఆర్ధోపెడిక్ సర్జరీలను కూడా ఉచితంగానే అందిస్తున్నారు. CT స్కాన్, MRI , 2 D ఎకో వంటి వైద్య పరీక్షలు కూడా ఇక్కడ ఉచితంగా చేస్తారు. ఇక్కడ రోజుకు 30 నుంచి 40 సర్జరీల వరకు చేస్తుంటారు.
రోజు 300 లకు పైగా ఇన్ పేషెంట్లు చేరుతున్నారు. రోజుకు కనీసం 12 వందల మంది రోగులు ఉచితంగా చికిత్స చేయించుకుంటున్నారు. షాదాన్ సొసైటీ ఆధ్వర్యంలోనే ఎన్నో ఏళ్లుగా ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరుకు హెల్త్ క్యాంప్స్ లో 7500 ల మంది రోగుల వరకు చికిత్సను అందించారు. చిన్న చిన్న రోగాలకు కూడా ముక్కుపిండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ ఉన్న ఈ రోజుల్లో.. ఇలా పేదల కోసమే అన్నిటిని ఉచితంగా అందించగలగడం నిజంగా స్ఫూర్తినిచ్చే విషయం.












ఢిల్లీ ఎన్ పి ఆర్ మార్కెట్ లో 15 రోజుల కిందట కిలో చికెన్ 180 రూపాయలు ఉంటే రిటైల్ ధర ప్రస్తుతం 260 చేరింది. ఇక ఆన్లైన్లో బుక్ చేసుకునే వారైతే కిలోకి 320 రూపాయల నుంచి 340 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. గత 15 రోజులుగా హోల్సేల్ మార్కెట్ లో చికెన్ ధరలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పౌల్ట్రీ వ్యాపారం దెబ్బతింది.
ఈ ప్రభావం ధరలపై కనిపిస్తోందని వ్యాపారస్తులు చెబుతున్నారు. అందుకే 15 రోజులుగా హోల్సేల్ మార్కెట్ లో చికెన్ కొరత ఏర్పడిందని దీనిద్వారా ధరలు పెరిగాయని అంటున్నారు. గత రెండు వారాల ముందు ధర 180 రూపాయల నుంచి 200 రూపాయలకు ధర అందుబాటులో ఉండేదన్నారు.
కానీ ప్రస్తుతం దీని ఖర్చు మార్కెట్ ధరలు 200 వరకు రావడంతో వ్యాపారస్తులు 250 నుంచి 2020 వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇలా రోజురోజుకు ధర పెరుగుతూ, ఢిల్లీలో కిలో చికెన్ ధర 245 రూపాయల నుండి 270 వరకు ఉన్నది. ఇక ఆన్లైన్లో మాత్రం ధర దాదాపు కిలోకి 350 పైనే ఉంది.మళ్లీ ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో, చికెన్ ప్రియులకు శుభవార్త ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.


ఈ వాహనానికి రిజిస్ట్రేషన్, సబ్సిడీ ఫ్రీగా కేంద్రం అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎడాపెడా ఎలక్ట్రికల్ వాహనాలు కొనేస్తున్నారు. రోజుకో మోడల్ చొప్పున వివిధ రకాల కంపెనీలు మార్కెట్లోకి ఈ ఎలక్ట్రికల్ మోటార్ సైకిళ్లను తీసుకొస్తున్నాయి. ఇక మన హైదరాబాద్ నగరంలో సుమారుగా 5 నుంచి 6 కంపెనీలు వాహనాలను తయారు చేస్తూ ఉన్నాయి.
ఇక్కడే మొదలైంది అసలు బాధ. ఇప్పటివరకు ఈ వాహనాలు కొనుగోలు చేసిన వాటిలో చాలా వాహనాలు కాలిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్ట్రికల్ మోటార్ వాహనాల్లో ఒక్కసారిగా మంటలు రావడం, ఛార్జింగ్ పెడుతున్న సమయంలో బ్యాటరీలు పేలడం వంటి ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటన జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
ఈ విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంలో మంటలు వ్యాపించడానికి ప్రధానకారణం బ్యాటరీ లో లోపాలు అని వారు నివేదికలో తెలియజేశారు. ఆ లోపం వల్లనే ఛార్జింగ్ పెట్టే సమయంలో బ్యాటరీలు పేలడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు.



