హస్త సాముద్రిక శాస్త్రం ద్వారా అరచేతిలో ఉండే రేఖలు లేదా గీతల ద్వారా వ్యక్తుల యొక్క జాతకాలను అంచనా వేస్తారనే విషయం అందరికి తెలిసిందే. అరచేతిలోని గీతలు, భవిష్యత్తును సూచిస్తాయని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు.
అయితే అరచేతిలో ఉంటే పుట్టుమచ్చల ద్వారా కూడా మనుషుల యొక్క భవిష్యత్తును అర్థం చేసుకోవచ్చని హస్త సాముద్రిక నిపుణులు చెబుతున్నారు. అయితే హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలో ఉండే పుట్టుమచ్చలు వేటిని సూచిస్తాయో ఇప్పుడు చూద్దాం..
హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి అరచేతిలోని జీవనరేఖ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అంత శుభకరం కాదని, అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. పుట్టుమచ్చ హృదయరేఖ మీద ఉన్నట్లయితే ఆ వ్యక్తులకు ఆరోగ్యపరంగా మంచిది కాదట. అంతేకాక అశుభంగా కూడా పరిగణిస్తారట. పుట్టుమచ్చ కనుక అదృష్ట రేఖ మీద ఉంటే ఆ జాతకుల జీవితం ఎప్పుడూ ఏదో ఒక విషయంలో అలజడికి లోనవుతుందట.
అంతేకాకుండా అరచేతిలోని వివాహ రేఖ మీద పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తులకు పెళ్ళికి సంబంధించిన అంతరాయం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, అరచేతిలో సూర్య పర్వతం మీద పుట్టు మచ్చ ఉన్నట్లయితే అది ఆ వ్యక్తులకు అశుభంగా పరిగణిస్తారట. ఇలా ఉండడం వల్ల ఆ వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీస్తుందని సూచిస్తున్నారు. అంతే కాకుండా ఇతరులు చేసిన తప్పులకు చాలాసార్లు ఈ వ్యక్తులు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
పుట్టుమచ్చ అరచేతిలో ఉండే బుధ పర్వతం మీద ఉంటే ఆ వ్యక్తులకు నష్టాలు కలుగుతాయని సూచిస్తున్నారు. పుట్టుమచ్చ అరచేతిలోని విధి రేఖ మీద ఉన్నట్లయితే ఆ వ్యక్తులకు అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఈ వ్యక్తులు జీవితాంతం ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చేసే పని విషయంలోనూ మరియు ఆర్థికంగానూ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హస్త సాముద్రిక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: మీ నాలుక రంగుని బట్టి మీకున్న అనారోగ్య సమస్యని గుర్తించచ్చు…ఎలాగో తెలుసా.?




చట్ట ప్రకారం వివాహం జరిగిన తరువాత భార్య లేదా భర్త నుండి విడాకులు రాకుండా రెండవ వివాహం చేసుకోవడం అనేది చట్ట విరుద్ధం అవుతుంది. ఒకవేళ అలా చేసుకుంటే కనుక IPC సెక్షన్ 494 ప్రకారం బైగమీ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది మరియు రెండవ వివాహం చెల్లదు. అంటే చట్ట ప్రకారం పెళ్లి జరిగిన తరువాత ఆ వ్యక్తి ఇంకొక పెళ్లి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా విడాకులు రావాల్సిందే.
ఈ విషయం తెలియక చాలా మంది, లేదా ఏం చేస్తారులే అనుకుని రెండవ పెళ్లి చేసుకుంటుంటారు. ఒకవేళ భార్య లేదా భర్త రెండవ పెళ్లి చేసుకున్న భర్త లేదా భర్త మీద కేసు నమోదు చేసే హక్కు ఉంటుందని వెల్లడించారు. అలాంటి సమయంలో రెండవ పెళ్లి చేసుకున్న వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్షపడుతుంది.
హిందూ వివాహచట్టం ప్రకారంగా డైవర్స్ కోరుతూ దాఖలైన పిటిషన్ను ఒప్పుకుంటూ భర్త లేదా భార్య ప్రమాణ పత్రాన్ని ఇచ్చినట్లు అయితే వారి పెళ్లి రద్దువుతుంది. కానీ, విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నా రెండవ వివాహం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి



డబ్బు చాలా శక్తివంతమైనది. డబ్బు వల్ల సంబంధాలు విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒక మనిషి వీలునామా రాయకుండా మరణిస్తే కుటుంబ సభ్యులు ఆస్తిలో ఎవరికి ఎంత వాటా వస్తుంది అనే విషయం పై తగాదాలు పడుతుంటారు. చాలా సార్లు ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆస్తుల కోసం ఎప్పుడు ఊహించని వ్యక్తులు కూడా ఆస్తిలో తమకు వాటా ఉందంటూ తెరపైకి రావచ్చు. అలాంటి వాటికి హిందూ వారసత్వ చట్టం 1956 సమాధానం చెబుతుంది.
హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారంగా ఒక వ్యక్తి సంపాదించిన ఆస్తి పై అతని భార్యకు, పిల్లలకు హక్కు ఉంటుంది. వీరిని షెడ్యూల్లోని క్లాస్-1 గా పరిగణిస్తారు. అంటే ఒక వ్యక్తి ఎలాంటి వీలునామాను రాయకుండా చనిపోతే, భార్యకు, పిల్లలు అతని ఆస్తికి సమాన హక్కుదారులు అవుతారు. అంటే ఒక వ్యక్తికి 10 ఎకరాల పొలం ఉండి, అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండి, అతను వీలునామా రాయకుండా మరణించినట్లయితే షెడ్యూల్లోని క్లాస్-1వర్తిస్తుంది.
షెడ్యూల్లోని క్లాస్-1 ప్రకారం భార్య, కుమారులు, కుమార్తెల అందరికి సమానంగా పంపిణీ చేయబడుతుంది. అలా భార్యకు 2 ఎకరాలు, కుమారులకు, కుమార్తెలకు ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున ఇవ్వబడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి పిల్లలు తల్లికి వాటా ఇవ్వకుండా తామే తీసుకుంటే ఆమె 125 సిఆర్పీసీ ప్రకారం పిల్లలు మేజర్లు అయితే వారిపై ఫామిలి కోర్టులో మెయింటెనెన్స్ పిటిషన్ ను వేసినట్లయితే వెంటనే ఆమెకు మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..







భారతరత్న పురస్కారాన్ని దేశంలో ఏదైనా రంగంలో అత్యుత్తమ కృషి చేసిన వారికి అందించే అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారంను 1954లో జనవరి 2న దేశ తొలి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ మొదలుపెట్టారు. ఈ అవార్డ్ ను ఇప్పటివరకు 49 మంది అందుకోగా, వారిలో శాస్త్రవేత్తలు, మేధావులు, రచయితలు, సాహిత్యకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు తదితరులు ఉన్నారు. వీరిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. భారతరత్న ప్రారంభించిన తరువాత సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తి రాజగోపాలాచారి, ప్రముఖ శాస్త్రవేత్త, డాక్టర్ సివి రామన్ 1954లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
భారతరత్న అవార్డ్ అందుకున్నవారికి రాష్ట్రపతి సంతకంతో ఉన్న ధ్రువీకరణ పత్రం మరియు మెడల్ అందచేస్తారు. ఈ మెడల్ రావి ఆకు రూపంలో ఉంటుంది. దీనిపై ప్రకాశిస్తున్న సూర్యుడు, భారతరత్న అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. మెడల్ వెనుక భగంలో జాతీయ చిహ్నం, దాని కింద సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. ఇక ఈ అవార్డ్ అందుకున్న వారికి నగదు ప్రోత్సాహకం ఉండదు. అయితే ప్రత్యేకమైన ప్రాధాన్యత మరియు సదుపాయాలు లభిస్తాయి. 2024లో ఎల్కే అద్వానీ మరియు కర్పూరి ఠాకుర్ లకు భారత రత్నఅవార్డ్ ప్రకటించారు. వీరితో ఇప్పటి వరకు ఈ అవార్డులు వచ్చిన వారి సంఖ్య యాబైకి చేరింది.
