పవర్ స్టార్ గా ఎదిగి, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దాదాపు పది సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ నుండి ఎంతో మందికి సేవ చేశారు. పార్టీ గుర్తు కూడా కొత్తగా ఉంటుంది. ఎన్నికల్లో పార్టీకి గాజు గ్లాసు గుర్తుని ప్రకటించారు. అప్పటి నుండి గాజు గ్లాస్ చూసిన ప్రతిసారి జనసేన పార్టీ గుర్తొస్తుంది. అయితే జనసేన పార్టీ జెండా లో ఉండే చిహ్నానికి కూడా చాలా అర్థం ఉంది. ఒకసారి దీని అర్థం తెలుసుకుంటే, ఇంత ఆలోచించి ఒక పార్టీ జెండా చిహ్నం తయారు చేశారా అని అనిపిస్తుంది. దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

# బ్యాక్ గ్రౌండ్ లో తెలుపు రంగు ఉంటుంది. ఇది శాంతిని, ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉన్న భారతీయ నాగరికతను, సంప్రదాయాన్ని సూచిస్తుంది.
# చిహ్నం ఎరుపు రంగులో ఉంటుంది. ఇది విప్లవానికి గుర్తు. మన పురాతన జాతీయ ధర్మాలని, ఇప్పటి మార్పులతో, వాటిని ఇంకా అభివృద్ధి చేసి చెప్పాలి అనే ఉద్దేశంతోనే తెలుపు మీద ఎరుపు రంగు వచ్చేలాగా డిజైన్ చేశారు.
# చిహ్నంలో నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రానికి ఆరు దిక్కులు ఉంటాయి. ఈ ఆరు దిక్కులు పార్టీ పాటించే ఆరు సూత్రాలని తెలియజేస్తాయి. ఈ సూత్రాలు, విలువలు మనకి మన తరతరాల నుండి వస్తున్నాయి అని దీని అర్థం. నక్షత్రం మధ్యలో ఉండే తెలుపు రంగు స్వయం ప్రకాశాన్ని తెలియజేస్తుంది. మన విలువల వల్ల మన దారిలో మనం సొంతంగా వెలుగుతాం అని దీని అర్థం వచ్చేలాగా డిజైన్ చేశారు.
# నక్షత్రం మధ్యలో ఉండే చుక్క ఆత్మని తెలియజేస్తుంది. మన ఆత్మ మన నిజం. ఈ చుక్కని మధ్యలో పెట్టడానికి కారణం ఏంటంటే, ఇది మన దేశానికి మనం నిజంగా ఏం చేస్తున్నాం అనేది తెలియజేస్తుంది. ఇదే గుండె అంత ముఖ్యమైనది. అందుకే ఈ చుక్క ని మధ్యలో పెట్టారు.
# ఎంబ్లెమ్ చుట్టూ బ్లాక్ లైనింగ్ ఉంటుంది. ఇది విప్లవానికి, అందుకు వచ్చే వ్యతిరేకతని బ్యాలెన్స్ చేసి, సామరస్యంగా ఉంచడానికి సూచిస్తుంది.
# ఈ పార్టీ ఎంబ్లెమ్ అనేది మన దేశం యొక్క జీవితాన్ని, అందుకోసం పోరాటం చేసిన వారి పోరాటాన్ని సూచిస్తుంది.
ఒక్క చిహ్నంలో ఇంత భావం ఉండేలాగా పార్టీ జెండా రూపొందించారు.

ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో రాహుల్ గాంధీ ఒకరు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. ఇంత వయసు వచ్చినా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన పెళ్లి చాలా సార్లు చర్చలు జరిగాయి. ఎందుకు చేసుకోలేదు అంటూ అడుగుతూనే ఉన్నారు. దేశంలోని పలువురు ప్రముఖులు, హీరోయిన్లు సైతం రాహుల్ గాంధీని వివాహం చేసుకుంటాం అని ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇంతగా చర్చకు దారితీసిన పెళ్లి గురించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా సమాధానం చెప్పారు. 2022లో సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 137 రోజుల సుదీర్ఘ పాదయాత్రను శ్రీనగర్లోని చారిత్రాత్మక లాల్ చౌక్లో ముగించారు. ఈ యాత్ర 12 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు ఐదు నెలల్లో 4,080 కిలోమీటర్లు సాగింది.
ఆ సమయంలో రాహుల్ గాంధీ పూర్తిగా ప్రజల్లో ఉంటూ సామాన్యులను కలిసి మంచి చెడ్డలు తెలుసుకున్నారు. ఆ క్రమంలో కాలేజ్ స్టూడెంట్స్తో కూడా ముచ్చటించారు. అయితే వారిలో ఒక స్టూడెంట్ పెళ్లి గురించి రాహుల్ గాంధీని అడిగారు. ఆ ప్రశ్నకు ‘తన పనులు మరియు పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నం అయినందువల్ల వివాహం గురించి ఆలోచించలేదని రాహుల్ గాంధీ వెల్లడించారు.
నారా లోకేష్ మంగళగిరిలో ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యార్థులు మరియు యువతతో ఆగస్టు 16న ‘హలో లోకేష్’ పేరుతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి గుంటూరు, విజయవాడ నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, మరియు యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ జవాబు చెప్పారు.
ఈ క్రమంలోనే ఒక యువతి నారా లోకేష్ ను బ్రాహ్మణితో పెళ్లి విషయల గురించి అడిగింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్తూ, నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. లోకేష్ మాట్లాడుతూ “తనది బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని అన్నారు. అయితే ‘ముద్దుల మామయ్య (నందమూరి బాలకృష్ణ) దగ్గర అంత సాహసం చేసేవాడ్ని కాదని వెల్లడించారు.
ఇంట్లో అమ్మానాన్నవాళ్ళు ఒక వెకేషన్ కు వెళ్తే అక్కడ చెప్పారు. ఇలా మేము అనుకుంటున్నాం. నీ అభిప్రాయం ఏంటని అడిగారు. నా అభిప్రాయం మీకు తెలుసు కదా. వాళ్ళు ముందు అలా ప్రతిపాదించారు. 










