ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరికి వస్తుండడంతో ప్రతి నాయకుడు ప్రచారం పనిలో ఉన్నారు. మార్చి రెండో వారం నాటికి షెడ్యూల్ ఖరారు అవుతుంది. ఒకపక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 6 విడతల్లో అభ్యర్థులను ఖరారు చేయగా, మరొక పక్క తెలుగుదేశం-జనసేన పార్టీ కూటమి అభ్యర్థుల జాబితా ఇంకా వెలువడలేదు.
అందుకు కారణం సీట్ల పంపకం ఇంకా జరుగుతూనే ఉంది. ఇందులో సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ఈ కారణంగానే ఆలస్యం అవుతోంది. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీని కూడా వారితో కలుపుకోవడానికి ఈ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో, కాపు నాయకుడు మాజీ మంత్రి అయిన చేగొండి హరిరామ జోగయ్య చర్చల్లో నిలిచారు. తెలుగు వన్ ఇండియా కథనం ప్రకారం… ఆయన పవన్ కళ్యాణ్ కి ఒక లెటర్ రాశారు. రాబోతున్న ఎన్నికలకు సంబంధించిన సూచనలు, సలహాలు పవన్ కళ్యాణ్ కి ఇచ్చారు. ఇందులో ఏ లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేయాలి అనే విషయాలని వివరించారు. జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడ అయితే గెలిచే అవకాశం ఉందో, ఆ నియోజకవర్గాలను హరిరామ జోగయ్య వెల్లడించారు. ఇవి ఏడు స్థానాలు ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీతో సీట్ల పంపకాలు విషయంలో చర్చలు జరిపి, ఈ ఏడు స్థానాలు దక్కించుకోవాలి అని చెప్పారు. ఇందులో కాపు, బలిజ సామాజిక వర్గాలకి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండే లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు నిలబడితే సరిగ్గా ఉంటుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, మచిలీపట్నం, తిరుపతి, నర్సాపురం, రాజంపేట ప్రాంతాల్లో లోక్ సభలో పోటీ చేయాలి అని చెప్పి, అభ్యర్థుల పేర్లను కూడా పేర్కొన్నారు. వారిలో,
# అనకాపల్లి – కొణిదెల నాగబాబు (కాపు)/బొలిశెట్టి సత్యనారాయణ (కాపు)/కొణతల రామకృష్ణ (గవర)
# కాకినాడ- సానా సతీష్ (కాపు), నర్సాపురం- మల్లినీడి తిరుమలరావు (కాపు)
# విజయనగరం – గెదెల శ్రీనివాస్ (తూర్పు కాపు)
# మచిలీపట్నం – వల్లభనేని బాలశౌరి (కాపు)
# తిరుపతి- వర ప్రసాద్ (ఎస్సీ), రాజంపేట- ఎస్ బాలసుబ్రహ్మణ్యం (బలిజ)
# నర్సాపురం- మల్లినీడి తిరుమలరావు (కాపు)
# రాజంపేట- ఎస్ బాలసుబ్రహ్మణ్యం (బలిజ)
వీరిని అభ్యర్థులుగా ప్రకటించాలి అని చేగొండి హరిరామ జోగయ్య సూచించారు.
ALSO READ : ఈ 4 ప్రభాస్ సినిమాలని రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అన్నారు.. కానీ తర్వాత సూపర్ హిట్ అయ్యాయి.!









60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారనే భ్రమల్లో ఉండవద్దని ఏ ఇరవై ఐదు సీట్లో ముష్టి వేస్తాడు” అని అన్నారు. జనసేన, టీడీపీ ఎలెక్షన్స్ కు సిద్ధంగా లేవని, సీట్ల లెక్కల్లో ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రిగా చరిత్రలో వైఎస్ జగన్ నిలిచిపోతారని వెల్లడించారు. ఎవరెన్ని చీలికలు చేసినా, పద్మ వ్యూహాలు పన్నినా వాటిని ఛేదించి రాగల అర్జునుడు జగన్ అని అన్నారు.
అన్యాయాలు, అక్రమాలు చేసిన బాలశౌరి బఫూన్ బాలశౌరి బఫూన్ అని విమర్శించారు. టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతున్నాడని అన్నారు. ఇది ఇలా ఉంటే ఆదివారం నాడు జరిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల భేటీ పై కూడా మినిస్టర్ అంబటి రాంబాబు స్పందించారు. ‘‘మోయటానికి ఎందుకులే భేటీలు..!’’ అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ఒక కార్టూన్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబులను తన భుజాల పై మోస్తున్నట్టుగా ఆ కార్టూన్ ఉంది. ఆ తరువాత మీడియాతో ఆయన మాట్లాడుతూ, వీరిద్దరూ భేటీ అవడం కొత్త విషయం కాదన్నారు. సీట్ల కోసం లేదా నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లిద్దరే చెప్పాలని కామెంట్స్ చేశారు. రెండేళ్లుగా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నా, ఇప్పటికీ సీట్ల విషయం తేల్చుకోలేకపోయారని విమర్శించారు.















