మన దేశంలో క్రికెట్ కి, క్రికెట్ ప్లేయర్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. వారికి మనందరం చాలా గౌరవం ఇస్తాం. క్రికెటర్లు కూడా వారి కష్టానికి ప్రతిఫలంగా పెద్ద మొత్తాన్ని తీసుకుంటారు. కానీ కొంత మంది క్రికెటర్లు మాత్రం ఎక్కడో ఒక చోట ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు.
అలా బ్లైండ్ క్రికెట్ లో వరల్డ్ కప్ విన్నర్ క్రికెటర్ ఒకరు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తన కుటుంబాన్ని పోషించడం కోసం రోజువారి కూలీ గా ఉద్యోగం చేస్తున్నారు. ఏదైనా ఉద్యోగం ఉంటే కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే, గుజరాత్ కు చెందిన నరేష్ తుమ్డా 2018 లో బ్రాండ్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారు.
షార్జాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా పాకిస్తాన్ పై గెలుపొందింది. నరేష్ ఇప్పుడు నవ్సారి లో రోజువారి కార్మికులుగా పని చేస్తున్నారు. ఆయన సంపాదన రోజుకు 250 రూపాయలు. మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి గారిని కలిసినా కూడా ఎలాంటి ప్రయోజనం రాలేదు అని నరేష్ చెప్పారు. తన కుటుంబాన్ని పోషించడం కోసం ఏదైనా ఉద్యోగ అవకాశం ఉంటే కల్పించాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు నరేష్.