మన జీవితం లో స్మార్ట్ ఫోన్ నిత్యావసరం అయిపొయింది. అయితే.. మనం డౌన్ లోడ్ చేసుకునే ఆప్ ల వలన మనకు ఎక్కడలేని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అయితే.. గూగుల్ సంస్థ మాత్రం ఇటువంటి ఆప్ ల పై ఓ కన్నేసి ఉంచుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకపోతేనే.. వాటిని ప్లే స్టోర్ లో ఉంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.

అయితే.. కొన్ని సార్లు కొన్ని ఆప్ ల వలన మన ఫోన్ లోకి వైరస్ లు వస్తూ ఉంటాయి. అయితే.. ఇలాంటి వాటిని గూగుల్ చాలానే హేండిల్ చేసింది. కానీ.. ఒకప్పుడు గూగుల్ ని ముప్పు తిప్పలు పెట్టేసిన “జోకర్” వైరస్ గుర్తుందా..? ఈ వైరస్ ని డిసేబుల్ చేశామని అనుకున్నప్పటికీ.. ఇది మళ్ళీ ఎనిమిది ఆప్ లలో కనిపిస్తోంది. క్విక్ హీల్ సెక్యూరిటీ లాబ్ లోని పరిశోధకులు ఈ విషయాన్నీ గుర్తించారు. తాజాగా.. గూగుల్ కూడా దీనిని గుర్తించి వెంటనే ఆ ఆప్ లను డిలీట్ చేసేసింది.

అయితే.. గూగుల్ ఆ ఆప్ లను డిలీట్ చేసేసినా.. వాటిని ఇదివరకు ఏ వినియోగదారుడైనా డౌన్ లోడ్ చేసుకుని ఉండి ఉంటె ఆ ఆప్ లు రన్ అవుతూనే ఉంటాయి. వాటివలన ఆ వైరస్ వారి ఫోన్లలోకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ 8 ఆప్ లను డౌన్లోడ్ చేసుకుని ఉండి ఉంటె వెంటనే డిలీట్ చేసేయండి. ఇంతకు ఆ ఎనిమిది ఆప్ లు ఏమిటంటే:
- ఆక్సిలియారి మెసేజ్
- ఫాస్ట్ మేజిక్ SMS
- సూపర్ మెసేజ్
- సూపర్ SMS
- గో మెసేజెస్
- ట్రావెల్ వాల్ పేపర్స్
- ఫ్రీ కామ్ స్కానర్
- ఎలిమెంటరీ స్కానర్


ఈ చిత్రాలలో ప్రతి రాష్ట్రం యొక్క సంప్రదాయం, సంస్కృతి, ఆహారం, అభివృద్ధిని చక్కగా చూపించారు. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. AI వివిధ రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా క్రియేట్ చేసిందో ఈ ఫోటోల ద్వారా చూడవచ్చు.
2. సూరత్ మెట్రోలో ప్రయాణికులను ఇలా చూపించారు. పైన వజ్రాలను AI సృష్టించింది.
3. హర్యానా మెట్రోలో చాలా మంది తమ సంప్రదాయ వస్త్రధారణలో ఉండగా, వారి చేతుల్లో కర్రలు పట్టుకుని హర్యానా సంస్కృతిని ప్రదర్శిస్తున్నారు.
4. చెన్నైమెట్రో అత్యంత ఆసక్తికరంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూర్చుని ప్రయాణం చేస్తుండటం కనిపిస్తుంది.
5. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలిజం ఎక్కువ. అందువల్ల ఛత్తీస్గఢ్ మెట్రోలో ప్రయాణం ఈ విధంగా ఉంటుందని AI చిత్రాన్ని రూపొందించింది.
6. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో సంప్రదాయాలకు చాలా విలువను ఇస్తారు. అందువల్ల కన్యాకుమారి మహిళలు మెట్రోలో ప్రయాణిస్తే ఈ విధంగా ఉంటుందని AI అంచనా వేసింది.
7. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి చెందింది. ఈ విషయం అందరికి తెలిసిందే. అందువల్ల హైదరాబాద్ మెట్రోలో AI బిర్యానీ ఉన్నట్టుగా రూపొందించింది.
8. ఉత్తర ప్రదేశ్ లో దుండగులు నాటు తుపాకులతో తిరుగుతూ ఉంటారు. అందువల్ల యూపీ మెట్రోలో ఈ విధంగా ఉంటుందని AI అంచనా వేసింది.
9. కోటా మెట్రోలో ఈ విధంగా ఉంటుందని AI ఫోటోను రూపొందించింది.
10. కోల్ కతా మెట్రోలో చేపలు పట్టుకుని ప్రయాణిస్తూన్నట్టుగా AI ఫోటోను రూపొందించింది.
11. బీహార్ రాష్ట్రంలో ప్రసిద్ధ వంటకం లిట్టి చోఖా. అందువల్ల అక్కడి మెట్రోలో లిట్టి చోఖా ఉన్నట్టుగా ఫోటోను AI రూపొందించింది.
12. బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. అందువల్ల అక్కడి మెట్రోలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రయాణం చేస్తున్నట్టుగా ఫోటోను AI రూపొందించింది.
13. కాశ్మీర్ లో మంచు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాశ్మీర్ మెట్రోలో మంచు కూరుస్తున్నట్టుగా AI ఫోటోను రూపొందించింది.
14. రాజస్థాన్ ఎడారి, ఒంటెలకు ప్రసిద్ధి చెందింది. అందువల్ల రాజస్థాన్ మెట్రోలో ఎడారిలో ఒంటెలు ఉన్నట్లుగా AI ఫోటోను రూపొందించింది.
15. ఒడిశా మెట్రోలో ఈ విధంగా ఉంటుందని AI ఫోటోను రూపొందించింది. 
AI రూపొందించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు ఈ చిత్రాలపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.




డైలీ స్టార్ ఇచ్చిన నివేదిక ప్రకారం, టైమ్ ట్రావెలర్ గా చెప్తున్న వ్యక్తి కాలంతో ట్రావెల్ చేసి 2714 వ సంవత్సరం నుండి తిరిగొచ్చానని తెలిపాడు. అంతే కాకుండా ప్రమాదకరమైన మహమ్మారితో పాటుగా రాబోయే పదేళ్ళలో జరిగబోయే సంఘటనల గురించి కూడా హెచ్చరించాడు. అలాగే ప్రమాదకరమైన మహమ్మారి ఎక్కడ నుండి వస్తుంది. ఎలా వ్యాప్తి చెందుతుందో కూడా వెల్లడించాడు. అతని చెప్తున్న విషయాల ప్రకారంగా 2024లో మంచు కరిగి, దాని కింద ఉన్న హానికర వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరికి వ్యాపిస్తుంది.
ముప్పై ఐదు కోట్ల మందికి పైగా ఈ వైరస్ బాధితులు అవుతారని తెలిపాడు. ఈ ప్రమాదకర వైరస్ అందరిని తీవ్రంగా భయనికి గురి చేస్తుందని తెలిపాడు. ఈ టైమ్ ట్రావెలర్ పేరు ఎనో అలరిక్. @theradianttimetraveller అనే పేరుతో టిక్టాక్ ద్వారా తన వీడియోను షేర్ చేశాడు. ఈ ఏడాది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎలియన్స్ ని శోధిస్తుందని తెలిపాడు. ఇది ఎన్నో స్టార్స్ నుండి ఎక్కువ మొత్తంలో ఎనర్జీని గ్రహిస్తుందని, అనంతరం సూర్యుడి నుండి కూడా శక్తిని గ్రహిస్తుందని చెప్పాడు.
ఇవే కాకుండా, ఆశ్చర్యపోయే విషయలు కూడా తెలిపాడు. మనషులు 2025లో అంగారక గ్రహానికి వెళ్తారని, అక్కడ వాళ్ళు చూసే విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రోనాట్స్ ల్యాండింగ్ అయిన దగ్గర మనుషుల ఎముకలను చూస్తారని చెప్పాడు. మనుషులు భూమి కన్నా ముందు అంగారక గ్రహం పై జీవించినట్లు సాక్ష్యం అని చెప్పి షాక్ కి గురి చేశాడు. ఇంకా అతిపెద్ద సౌర తుఫాన్ 2026లో భూమిని తాకుతుంది. దాంతో అంతర్జాతీయంగా 6 వారాల వరకు విద్యుత్తు అంతరాయం కలుగుతుందని చెప్పుకొచ్చాడు.
Also Read: 










ఇది దాదాపుగా ఒక సంవత్సరంలో 4000 వేల నుంచి 5000 కార్లు మాత్రమే తయారుచేస్తారు. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం. ఇది బుక్ చేసిన తర్వాత ప్రత్యేకమైన ఎంపికలో ఆప్షన్లను బట్టి మూడు నెలల నుంచి సంవత్సర కాలం పట్టవచ్చు.. ఎందుకో ఒకసారి చూడండి..?
ఈ కారులో బాడీపై ఉండే లోహపు రేకులను తప్ప మిగతా భాగాలన్నీ చేతులతో తయారు చేసినవే. కారు లోపల మరియు బయట వేయడానికి సంస్థ దగ్గర 44,000 రంగులు అందుబాటులో ఉంటాయట. ఈ పెయింటింగ్ ను ఐదు పొరల్లో ఇరవై రెండు దశలుగా సుమారు 50 కిలోల పెయింటింగ్ తో వారం రోజుల పాటు చేస్తారట. ఈ ఒక్క పని మాత్రం రోబోలు చేస్తాయట. మిగతా అన్ని పనులు మనుషులు చేస్తారని, అది కూడా ఎలాంటి మిషన్లు వాడకుండా చేతుల ద్వారానే చేస్తారట.
అయితే ఈ కారు పై పెయింటింగ్ వేసే వ్యక్తి ఒక్కరే ఉన్నారట. ఆయన గత 18 సంవత్సరాలుగా రోల్స్ రాయిస్ కారుపై గీతలు వేయడానికి మూడు గంటల సమయం తీసుకొని పూర్తి చేస్తారట. ఆ రంగులు వేయడంలో ఆయన వాడే బ్రష్ లు కూడా ప్రత్యేకమైనవే. అందులో ఎద్దు, ఉడుత వెంట్రుకలతో తయారుచేస్తారు
కారు లోపల పైకప్పు నక్షత్ర మండలాన్ని పోయినట్టు ఉండడం. 1600 ఫైబర్ ఆప్టిక్ లైట్లు అమరుస్తారు. ఇది కూడా కళాకారులు చేతితోనే రెండు వారాల పాటు చేస్తారట. దీనికోసం దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు ఉండే వైర్లను వాడతారు. అలాగే కారులో ఉండే సీట్లను ప్రత్యేకంగా పెంచిన ఎడ్ల చర్మం నుండి తీసి పదిహేను రోజులపాటు తయారుచేస్తారు.
అయితే ఈ కారులో ముఖ్యంగా ప్రత్యేకమైన చెట్టు నుంచి తీసుకున్న చెక్కను మాత్రమే వాడతారు. మరీ ముఖ్యంగా రోల్స్ రాయిస్ కార్ల టైర్ల పై ఉన్న లోగో టైర్ తిరుగుతున్నా కానీ నిలువుగానే కనపడుతూ ఉంటుంది. ఇది దీనికి ఉన్న ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇవే కాకుండా రోల్స్ రాయల్ కార్ లో అనేక ప్రత్యేకమైన వెసులు బాట్లు ఉండటం వలన దీని తయారీకి ఇంత సమయం పడుతుంది రేటు కూడా ఆ విధంగానే ఉంటుంది.




