గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి కన్నడ సినిమాల హవా నడుస్తోంది. స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలు ఇస్తూ, హిట్ మీద హిట్ కొడుతోంది కన్నడ ఇండస్ట్రీ. కన్నడ ఇండస్ట్రీలో తనదైన శైలి సినిమాలతో పేరు తెచ్చుకున్న నటుడు రక్షిత్ శెట్టి. రక్షిత్ శెట్టి మంచి నటుడు మాత్రమే కాదు, మంచి కంటెంట్ ని ఎంకరేజ్ చేసే నిర్మాత కూడా. ఇప్పుడు రక్షిత్ శెట్టి హీరోగా, హేమంత్ రావు దర్శకత్వంలో వచ్చిన సప్త సాగర దాచె ఎల్లో సినిమాని తెలుగులో డబ్ చేసి, సప్త సాగరాలు దాటి పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : సప్త సాగరాలు దాటి (సైడ్ A)
- నటీనటులు : రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, అచ్యుత కుమార్, శరత్ లోహితాశ్వ.
- నిర్మాత : రక్షిత్ శెట్టి
- దర్శకత్వం : హేమంత్ ఎం రావు
- సంగీతం : చరణ్ రాజ్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 22, 2023

స్టోరీ :
మను (రక్షిత్ శెట్టి) ఒక కారు డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. మను యజమాని శేఖర్ గౌడ (అవినాష్) ఒక పెద్ద వ్యాపారవేత్త. ప్రియ (రుక్మిణి వసంత్) సింగర్ కావాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మను, ప్రియ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. వారిద్దరూ కలిసి ఒక ఇల్లు కట్టుకొని, అందులో సంతోషంగా ఉండాలి అని ప్రియ కలలు కంటూ ఉంటుంది. అయితే, మను యజమాని కొడుకు డ్రైవింగ్ కారణంగా ఒక వ్యక్తి చనిపోతాడు.

దాంతో శేఖర్ గౌడ, ఈ కేసుని మను మీద వేసుకోమని, కొద్ది రోజుల్లోనే విడిపిస్తాను అని దాంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఇస్తాను అని మనుకి చెప్తాడు. ప్రియ వద్దు అని చెప్పినా కూడా వినకుండా, ఇలా వచ్చే డబ్బులతో ప్రియతో కలిసి సంతోషంగా బతకచ్చు అని ఆలోచించి మను ఆ కేసుని తన మీద వేసుకొని జైలుకి వెళ్తాడు. కానీ అక్కడ మను అనుకోని సంఘటనలు ఎదుర్కొంటాడు. మనుకి బెయిల్ రాదు. శేఖర్ గౌడ గుండెపోటుతో చనిపోతాడు.

అక్కడ జైలులో మను సోమ అనే ఒక వ్యక్తి గ్యాంగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. పిఎ ప్రభు (అచ్యుత కుమార్) ఈ కేసును పక్కదారి పట్టించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇతని మాటలు విని శేఖర్ గౌడ మోసపోతాడు. మను బయటికి వచ్చాడా? మనుని బయటికి తీసుకురావడానికి ప్రియ ఎలాంటి పోరాటం చేసింది? ప్రియ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంది? మనుకి జైల్ లో ఉండే ఒక గ్యాంగ్ ఖైదీలతో గొడవ ఎందుకు అవుతుంది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
కిరిక్ పార్టీ నుండి ఇటీవల వచ్చిన చార్లీ 777 వరకు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకోవడంలో ముందు ఉన్న యంగ్ హీరో రక్షిత్ శెట్టి. ఒక సినిమాకి, మరొక సినిమాకి పోలిక ఉండకుండా, ప్రతి పాత్ర కోసం తనని తాను మార్చుకుంటూ, ఇంత గొప్ప కంటెంట్ ఉన్న సినిమాలని తానే నిర్మిస్తూ, కన్నడలో ఒక మంచి నటుడిగా, ఒక మంచి ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు. అతడే శ్రీమన్నారాయణ సినిమా నుండి రక్షిత్ శెట్టి నటించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి.

ఈ సినిమా తెలుగు ప్రెస్ మీట్ లో భాగంగా రక్షిత్ శెట్టి మాట్లాడుతూ, “కన్నడలో సినిమా రిలీజ్ చేశాక, ఈ సినిమాని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా రిలీజ్ చేస్తాము అని మాకు ముందే తెలుసు” అని చెప్పారు. ఒక సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు ఏ రకంగా ఆదరిస్తారో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. డబ్బింగ్ సినిమా అయినా, స్ట్రైట్ తెలుగు సినిమా అయినా కంటెంట్ బాగుంటే తెలుగు వాళ్ళు ఆ సినిమాని కచ్చితంగా ఆదరిస్తారు. ఈ సినిమా ఇప్పటికే కన్నడలో చాలా పెద్ద హిట్ అయ్యింది.

లవ్ స్టోరీస్ అంటే ఒక రకమైన టెంప్లేట్ ఉంటుంది అని ప్రేక్షకుల మెదడులో ఒక భావన ఏర్పడిపోయింది. కానీ ఈ సినిమా ఆ టెంప్లేట్ కి కాస్త భిన్నంగా ఉంటుంది. సినిమా మొత్తం ఒక ప్రశాంతమైన టోన్ లో సాగుతూనే, చాలా బలమైన ఎమోషన్స్ ని తెరపై చూపించింది. కెరీర్ గురించి కలలు కనే యువతి, నిజాయితీ ఉన్న ఒక యువకుడు, వారిద్దరూ ప్రేమలో పడడం. ఒకరితో ఒకరు జీవితాన్ని ఊహించుకోవడం. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది.

ఆ తర్వాత దర్శకుడు సినిమా ముందుకు తీసుకువెళ్లడానికి ఎంచుకున్న పాయింట్ మాత్రం సినిమా అయిపోయాక కూడా వెంటాడుతూ ఉంటుంది. సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ సహజమైన బ్యాక్ డ్రాప్ లో సినిమా నడవడం. వారు మాట్లాడుకునే మాటలు, ప్రవర్తించే విధానం, వారు ఎదుర్కొనే సంఘటనలు ఇవన్నీ దర్శకుడు చాలా సహజంగా చూపించడానికి ప్రయత్నించాడు. అంతే కాకుండా, సినిమాలో చాలా వరకు జైలులో హీరో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని చూపించారు.

కొన్ని దశాబ్దాల నుండి జైలు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఏ సినిమాలో కూడా ఇలాంటి సంఘటనలు చూపించలేదు అని చెప్పవచ్చు. చాలా సినిమాల్లో జైళ్ళని చాలా సినిమాటిక్ గా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో అలా కాకుండా అసలు నిజంగా జైళ్లు ఎలా ఉంటాయో వెళ్లి చూసి, అలాగే సెట్ డిజైన్ చేసి చూపించారు. అలాగే జైల్లో ఖైదీల మధ్య జరిగే గొడవలు కూడా ఏదో డిజైన్ చేసినట్టు కాకుండా, నిజంగానే కొంత మంది వ్యక్తులు గొడవ పడితే ఎలా ఉంటుందో అలాగే ఉండేలాగా రూపొందించారు.

ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో హీరో హీరోయిన్లు ఉన్నారు అనడం కంటే, గొప్ప నటులు ఉన్నారు అనడం కరెక్ట్ ఏమో. రక్షిత్ శెట్టి మను పాత్రలో చాలా బాగా నటించారు. అలాగే ప్రియ పాత్రలో నటించిన రుక్మిణి వసంత్ రక్షిత్ శెట్టి తో సమానంగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అయితే ఆమె పర్ఫార్మెన్స్ పక్కన ఉన్న వాళ్ళని ఓవర్ షాడో చేసింది. అంత బాగా నటించారు. అలాగే మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించిన అవినాష్, అచ్యుత కుమార్ కూడా వారి పాత్రలకి తగ్గట్టుగా నటించారు.

లొకేషన్స్ కూడా బాగున్నాయి. చరణ్ రాజ్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా టోన్ ని పర్ఫెక్ట్ గా తెర మీద చూపించింది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. సైడ్ బి లో ఏం జరగబోతోంది అనేది ఈ పార్ట్ లోనే చివరిలో చూపించారు. ఈ సినిమా కూడా ఇంకా కొద్ది రోజుల్లోనే విడుదల అవుతుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం సినిమా చాలా స్లోగా అనిపిస్తుంది. దర్శకుడు ఆ ఎమోషన్ ని తెరపై బాగా చూపించే ప్రయత్నంలో సీన్స్ చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- ఎమోషనల్ సీన్స్
- సంగీతం
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
మైనస్ పాయింట్స్:
- నిడివి ఎక్కువగా ఉన్న కొన్ని సీన్స్
- స్లోగా నడిచే కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా అవి ప్రేక్షకులకి పెద్దగా కనిపించవు. సినిమా చూసి థియేటర్ నుండి బయటికి వచ్చాక కూడా చాలా కాలం వరకు ఆ సీన్స్ ప్రేక్షకులని వెంటాడుతూనే ఉంటాయి. అంటే ఈ సినిమాలోని ఎమోషన్స్ అంత ప్రభావితం చేస్తాయి. ఇటీవల కాలంలో వచ్చిన ఒక బెస్ట్ ఎమోషనల్ లవ్ స్టోరీ సినిమాగా సప్త సాగరాలు దాటి సినిమా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : కూతురి గురించి విజయ్ అంటోని ఎమోషనల్ లెటర్..! “నా కూతురు చాలా ధైర్యవంతురాలు..!” అంటూ..?




మీడియాతో చాలా తక్కువగా మాట్లాడే విజయ్ ఆంటోనీ గతంలో ఆత్మహత్యకు వ్యతిరేక అవగాహన కలిగించే ప్రోగ్రామ్స్ కు ప్రచారకర్తగా పాల్గొన్నారు. అప్పుడు మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన కుమార్తె అలా చేసుకోవడం అందరినీ వేదనకు గురిచేస్తోంది. మీరా మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మీరా స్కూల్, ఆమె ఫ్రెండ్స్ ను విచారించారు. మీరా ల్యాప్టాప్ మొదలుకొని ఆమె ఉపయోగించే వస్తువులను పరీక్షిస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తులో మీరా సోమవారం రాత్రి 11 గంటల వరకు తన ల్యాప్టాప్ను ఉపయోగించిందని, ఆ తర్వాత మీరా ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. మీరా పాఠ్యపుస్తకంలో ఒక లెటర్ దొరికిందని అంటున్నారు. ఆ లెటర్ లో మీరా తన ఫ్రెండ్స్ ను, టీచర్స్ ను మిస్ అవుతున్నానని పేర్కొంది. అందరూ సురక్షితంగా మరియు సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్ !! థాంక్యూ ఆల్ !! అని రాసినట్టు చెబుతున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సంచలనంగా మారాడు. సెలెబ్రెటీ కానప్పటికీ. సాధారణ వ్యక్తిగా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన ప్రశాంత్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. షో ప్రారంభం అయ్యి, రెండు వారాలు పూర్తి కాగా, రెండుసార్లు ప్రశాంత్ నామినేషన్స్ లో నిలిచాడు. కానీ టోటల్ ఓటింగ్ లో నలబై శాతం ఓట్లు అతనికే వస్తున్నాయని సమాచారం.
పల్లవి ప్రశాంత్ బలమైన కంటెస్టెంట్ అని హౌజ్ మెంబర్స్ ఇప్పటికే పసిగట్టారు. దాంతో జనాల్లో రైతుబిడ్డ పై సింపథీ పోగొట్టడానికి ట్రై చేస్తున్నారు. అందుకే రెండవ వారం నామిషన్స్ లో రితికా రోజ్, అమర్ దీప్ చౌదరి, ప్రియాంక, తేజా, శివాజీతో పాటు కొందరు ప్రశాంత్ పై అటాక్ చేశారు. సింపథీ మాటలు మాట్లాడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ప్రశాంత్ కున్న క్రేజ్ తగ్గకపోగా మరింతగా పెరిగిందని తెలుస్తోంది.
పల్లవి ప్రశాంత్ తెలంగాణకు చెందిన వ్యక్తి. రైతుబిడ్డగా పాపులర్ అయిన ప్రశాంత్ ఫ్యామిలీ కాస్త డబ్బు ఉన్న ఫ్యామిలీ అని సమాచారం. పల్లవి ప్రశాంత్ కి దాదాపు 26 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉందని అంటున్నారు. అది మాత్రమే కాకుండా సొంత ఊరిలో పెద్ద ఇల్లుతో పాటుగా, కాస్ట్లీ లగ్జరీ కారు కూడా ఉందని టాక్. ప్రశాంత్ పొలం, హౌజ్ విలువ కోట్లలో ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ వ్యవసాయ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తాయని టాక్. ఈ న్యూస్ లో నిజమెంతో తెలియదు కానీ నెట్టింట్లో వైరల్ గా మారింది.
మీరా మరణానికి కారణం చదువుల్లో ఒత్తిడి అని తెలుస్తోంది. అయితే ఈ వార్తల పైన, తన కుమార్తె మీరా చనిపోవడం పైన విజయ్ ఆంటోని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకనట చేయలేదు. కుమార్తె చనిపోయి, బాధలో ఉన్న విజయ్ ఆంటోనికి ప్రముఖులు, ఫ్యాన్స్ ధైర్యాన్ని చెబుతున్నారు. మీరా మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే గతంలో బలవన్మరణం ఆలోచనల గురించి విజయ్ ఆంటోని మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు బలవన్మరణంకు ఎందుకు పాల్పడుతారు?
గతంలో పవన్ కల్యాణ్ పూజలు, జాతకాలకు అంటే కాస్త దూరంగా ఉంటారని టాలీవుడ్ లో టాక్ ఉండేది. కానీ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ లో ఆధ్యాత్మికంగా మార్పు కనిపిస్తోందని టాక్. జ్యోతిష్యు పండితులను కలిసి, జాతకంలో ఉన్న దోషాలను సరిద్దిద్దుకోనే ప్రయత్నం చేశారట. హరిద్వార్ లాంటి పుణ్యక్షేత్రంలో పర్యటించారు. ఇటీవల అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన విషయం తెలిసిందే.
చంద్రబాబును కలిసిన అనంతరం, పవన్ కళ్యాణ్, బాలయ్య, నారా లోకేష్ లతో పాటు మీడియాతో మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో పవన్ చేతి వేళ్లకు ఉన్న రింగ్స్ హైలెట్ అయ్యాయి. అప్పటి నుండి వాటి గురించే చర్చ జరుగుతోంది. ఆ ఉంగరాల విశిష్టత ఏమిటా అని చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెట్టుకున్న రెండు రింగ్స్ లో ఒకటి నాగ బంధం, రెండవది కూర్మావతారం. ఈ రెండు కూడా బంగారు రింగ్స్. పెద్ద సైజులో కూడా ఉన్నాయి.
నాగ బంధం, కూర్మావతారం రింగ్స్ కు విశిష్టత ఉందని, ఇవి పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. నాగ బంధం రింగ్ వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అనుకోని ప్రమాదాలు లేదా గండాల నుంచి కపడుతుంది. దుష్ట శక్తుల,రాహు కేతు దోషాలు మరియు నరదిష్టి దోషాల నుంచి కాపాడుతుందని పండితులు చెబుతున్నారు. కానీ నాగ బంధం ఉంగరాన్ని జోతిష్యం ఆధారంగా మాత్రమే ధరించాలని పండితులు చెబుతున్నారు.
ఇక తాబేలు లేదా కూర్మావతారం రింగ్ ధరించడం వల్ల అధికార యోగం మరియు ధన యోగం కలుగుతుందని, అధికార యోగం కోసం దైవబలం కోరుకునేవారు తాబేలు రింగ్ ను ధరిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్ గా మారే అవకాశం ఈ రెండు రింగ్స్ వల్ల వస్తుందని జోతిష్య పండితులు అంటున్నారు.














#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
మహాలక్ష్మి, రవీందర్ చంద్రశేఖరన్ను పెళ్లి చేసుకోవడంతో ఆమె అతని డబ్బు కోసమే అని విమర్శించారు. ఆ తరువాత వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. అయితే మహాలక్ష్మీ దంపతులు సోషల్ మీడియా ద్వారా తమ అందమైన ఫొటోలను షేర్ చేస్తూ, విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు. ఆ మధ్యన మహాలక్ష్మి రవీందర్ బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసింది.
ఇది ఇలా ఉంటే తాజాగా రవీందర్ చిక్కుల్లో పడ్డాడు. ఒక వ్యాపారవేత్తను మోసం చేశారని, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నిర్మాత రవీందర్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ వార్త సంచలనంగా మారింది. సాలిడ్ వెస్ట్ నుంచి కరెంట్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టడం ద్వారా చాలా లాభాలు వస్తాయని రవీందర్ చెన్నై వ్యాపారవేత్త అయిన బాలాజీని నమ్మించాడట. సదరు ప్లాంట్ కోసం డూప్లికేట్ పేపర్స్ ను క్రియేట్ చేసి, బాలాజీని నమ్మించి అందులో పార్ట్నర్ గా చేశాడు. దానికి గాను బాలాజీ నుండి దాదాపు పదహారు కోట్లు తీసుకున్నారని, రవీందర్ పై ఆరోపణలు వచ్చాయి.
ఈ ఒప్పందం తర్వాత రవీందర్ చెప్పినట్లుగా ఏ పని జరగలేదని, బాలాజీ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినా, ఎలాంటి స్పందన రవీందర్ నుండి రాలేదట. దాంతో బాలాజీ రవీందర్ పై చర్యలు తీసుకోవాలని చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో పోలీసులు నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అరెస్ట్ చేశారు.