దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ గడువును కేంద్రం మరో రెండు వారాలు పెంచింది. కరోనా నివారణ కోసం వైద్యులు, పోలీసులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు.కరోనా సమస్య పై ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి కొందరు పలువురు ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలువినూత్న మార్గాలని ఎంచుకుంటున్నారు.వీడియోల ద్వారా తమ సందేశాలు పంపుతున్నారు , యూట్యూబ్ లో కరోనా మీద వచ్చిన పాటలు అన్ని అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుత తరుణంలో ఇంటికే పరిమితమవుతున్న లక్షలాది మంది ప్రజలకు కాలక్షేపం కల్పించేందుకు, హాస్యంతో వారి భయాందోళనలకు కాసేపైనా దూరం చేసేందుకు సోషల్ మీడియా కళాకారులు తమదైన శైలిలో కృషి చేస్తున్నారు. 
ఇండస్ట్రీకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్స్ తమదైన స్టైల్ లో పాటలు పడుతూ అవగాహనా కల్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు కరోనా ఓ పాటను విడుదల చేశారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. ఇక్కడే చేరింది మహమ్మారి రోగ మొక్కటి పేరడి పాట ప్రస్తుతం ఈ పాట నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంది.కరోనాపై చిరు, నాగ్, తేజూ, వరుణ్ తేజ్ కలిసి కోటి సారథ్యంలో పాట ఆలపించగా, వందేమాతరం శ్రీనివాస్ కూడా తనదైన స్టైల్లో ఓ పాట రూపొందించారు.

చౌరస్తా బ్యాండ్ కరోనాపై ప్రత్యేక సాంగ్స్ రూపొందించింది. వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేలా ‘చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా’ అంటూ ఈ బృందం పాడిన పాట సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కరోనా మీద స్వయంగా తన స్టైల్లో పాట రాసి,పాడారు.కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జియో బాయ్స్ అనే గ్రూప్ కరోనా మీద అద్భుతమైన పాట రాసారు …మీరు కూడా విని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి




రైళ్లు ,సబర్బన్ రైళ్ల రద్దు ని మే 17 వరకు కొనసాగించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది కరోనా వైరస్ నివారించే భాగంగా లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగించడం తో రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. పార్సిల్ , సరకు రవాణా కి ఎటువంటి ఆటకం ఉండదు అంటూ ప్రకటించింది. రైలు టిక్కెట్ల కోసం స్టేషన్లకు రావొద్దు అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చికుక్కున విద్యార్థులు,పర్యాటకులు,వలస కార్మికులు,తీర్థయాత్రికులు, మరే ఇతర కారణాల చేత చిక్కుకున్న ప్రయాణికులు శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయబోతునన్టు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం మేరకు ,కేంద్ర హోమ్ శాఖ మార్గ దర్శకాలనులోబడి శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపబోతుననట్టుగా తెలిపింది.ఈ రైళ్లలో ప్రయాణదలచిన వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవల్సిందిగా సూచించారు.రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రకటించింది వ్యక్తులకి టిక్కెట్లను విడివిడిగా ఇవ్వడం కుదరదు బృందాలకు కూడా టికెట్లు ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి టిక్కెట్ల కోసం నేరుగా రైల్వే స్టేషన్లకు దయచేసి రావద్దు అని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తున్నారు.








































