చిన్నా.. పెద్దా.. వయసు తేడా లేకుండా.. ఆడ, మగా జెండర్ తేడా లేకుండా అందరు కూల్ డ్రింక్స్ ని ఇష్టపడతారు. ఏదైనా పార్టీ ఉందంటే చాలు కూల్ డ్రింక్స్ తప్పనిసరి. కేక్ కట్ చేసినా.. స్నాక్స్ ఎన్ని ఉన్నా ఓ కూల్ డ్రింక్ బాటిల్ కి మాత్రం తప్పకుండా ప్లేస్ ఇస్తాం. ఇక వేసవి వస్తే వీటిదే రాజ్యం. వేసవి కాలంలో వీటి అమ్మకాలు మరింత పెరుగుతాయి.
అయితే సుడాన్ లో గత కొన్ని నెలలుగా అంతర్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఈ కూల్ డ్రింక్స్ కంపెనీ లు ఇబ్బందుల్లో పడ్డాయి.. ఎందుకంటే పెప్సీ, కోకాకోలా ఇలా ఏం కూల్ డ్రింక్ అయినా తయారు కావాలంటే ప్రధానంగా వాడే పదార్థం గమ్ అరబిక్. ఇవే కాకుండా కాస్మొటిక్స్, కాండీస్ లో కూడా దీన్ని ప్రధానంగా వాడతారు.

సాఫ్ట్ డ్రింక్స్ తయారీలో ఈ పదార్థం లేకపోతే చాలా కష్టం. డ్రింక్ తయారు చేసేందుకు వాడే పదార్థాలన్నింటిని ఈ గమ్ అరబిక్ కలిపి ఉంచుతుంది. ఫలితంగా అవి రుచిని పొందుతాయి. ఒకవేళ డ్రింక్స్ లో ఈ గమ్ అరబిక్ వాడకపోతే.. పదార్థాలన్ని విడిపోయి.. ఎలాంటి రుచి లేకుండా చప్పగా ఉంటాయి. అయితే ఇది పేరుకు తగ్గట్టుగానే ఒక జిగురు. అకాసియా అనే చెట్టు నుంచి వచ్చే ఒకలాంటి జిగురు.

ఈ చెట్లు సుడాన్లో మాత్రమే ఉన్నాయి. అన్నీ దేశాలు ఇక్కడి నుంచే ఈ పదార్థాన్ని దిగుమతి చేసుకుంటాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల త్వరలోనే గమ్ అరబిక్కు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందని కూల్డ్రింక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కూల్ డ్రింక్ తయారీ కంపెనీలు. తమ ఉత్పత్తుల తయారీకి అంతరాయం కలగకుండా ఉండేలా సూడాన్లో మాత్రమే దొరికే ఈ గమ్ అరబిక్కు పదార్థాన్ని భారీ ఎత్తున సమకూర్చుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. సూడాన్లోని సాహెల్ ప్రాంతం నుంచి సుమారు 70 శాతం గమ్ అరబిక్ ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఓ నివేదిక ప్రకారం.. మరో 5-6 నెలల్లో గమ్ అరబిక్తో తయారు చేసిన ఉత్పత్తులు అయిపోవచ్చని తెలుస్తోంది.

గమ్ అరబిక్ లేకపోతే పెప్సీ, కోకాకోలా వంటి దిగ్గజ కూల్ డ్రింక్ కంపెనీలు తమ ఉనికికి కాపాడుకోవడం దాదాపు అసాధ్యం అని అంటున్నారు నిపుణులు. ఈ పదార్థానికి ప్రత్యామ్నాయం లేదని చెబుతున్నారు. మరి ఈ అంతర్యుద్ధం ఇలానే కొనసాగితే.. రానున్న రోజుల్లో కూల్ డ్రింక్ ఉత్పత్తిపై భారీ ప్రభావం పడనుంది. ఇది పరోక్షంగా రానున్న కాలంలో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కారణంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also read: కూల్ డ్రింక్స్ ని ఎప్పుడైనా గమనించారా..? పూర్తిగా ఎందుకు ఫిల్ చేయరు..? దీని వెనుక అసలు కారణం ఇదే..!





పవన్ కల్యాణ్ పేరు వింటేనే ఆయన ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఒక ఫ్యాన్ తమ అభిమాన హీరోతో మూవీ తీస్తే ఎలా ఉంటుందో ‘గబ్బర్ సింగ్’ తో హరీష్ శంకర్ నిరూపించాడు. ఇప్పుడు అదే విషయాన్ని ఇంకా గట్టిగా చెప్పేందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో రానున్నాడు.
సరిగ్గా 11 సంవత్సరాల తరువాత వీరి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం తెరకెక్కుతుంది. గబ్బర్ సింగ్ మూవీ విడుదల అయ్యి నిన్నటికి (మే 11 ) పదకొండు ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ గ్లింప్స్ మూవీ యూనిట్ విడుదల చేసింది. హరీష్ శంకర్ తన అభిమాన హీరోని వెండితెర పై ఆవిష్కరించిన విధానానికి ఈ గ్లింప్స్ స్మాల్ టచ్ అని, మూవీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.
ఈ గ్లింప్స్ మాస్ పోలీస్ ఆఫీసర్గా పవన్ కనిపిస్తున్నారు. “ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతుంది” అని పవర్ స్టార్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దాంతో సోషల్ మీడియా వేదికగా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ సెలెబ్రెటీలు హరీష్ శంకర్ కు అభినందనలు తెలుపుతున్నారు.
అయితే రవితేజ పేరు ఉన్న ట్విట్టర్ ఖాతా నుండి ఒక యూజర్ “హరీష్ ఈసారి గబ్బర్ సింగ్ కంటే పెద్దగా ప్లాన్ చేస్తున్నావు. గుడ్ లక్” అని పోస్ట్ పెట్టారు. ఆ ఖాతాకి బ్లూ టిక్ ఉండడంతో హీరో మాస్ మహారాజ రవితేజ పోస్ట్ అనుకున్న హరీష్ శంకర్ ఎమోషనల్ గా, “అన్నయ్యా ఈ మొక్క నువ్వు నాటిన మొక్క.. ఎన్నిసార్లయినా చెప్తా ఇదే ముక్క” అని రిప్లై ఇచ్చారు. అయితే అది హీరో రవితేజ అకౌంట్ కాకపోవడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూసుకోవాలి కదా అన్నా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

































