కోహ్లీ ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశాడు..? చూసుకోవాలి కదా..?

కోహ్లీ ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశాడు..? చూసుకోవాలి కదా..?

by kavitha

Ads

వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్‌ను టీంఇండియా 191 పరుగులకు ఆలౌట్ చేసింది.

Video Advertisement

అయితే ఈ మ్యాచ్ ఆరంభంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చేసిన ఒక పొరబాటు నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే జరిగిన పొరబాటును తెలుసుకుని కోహ్లీ వెంటనే సరిదిద్దుకున్నాడు. అయినప్పటికీ నెటిజన్లు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఆ పొరపాటు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే అందరి దృష్టి దాని పైనే ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రపంచకప్ లో  భాగంగా అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్తాన్‌ మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో పాక్ 191 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ బ్యాటింగ్ దిగింది. అయితే ఈ మ్యాచ్ మొదట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఘటన చోటుచేసుకుంది.
భారత స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లి చిన్న మిస్టేక్ చేశాడు. అయితే వెంటనే దానిని గుర్తించిన కోహ్లీ సరిచేసుకున్నాడు. ఇక కోహ్లీకి సంబంధించిన ఏ విషయం అయిన క్షణాల్లో వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. కోహ్లీ తన పొరపాటును సరిచేసుకునేలోపే ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. మ్యాచ్ ఆరంభంలో భారత జట్టు ప్లేయర్స్ అంతా ఒక జెర్సీ ధరించి వచ్చారు. అయితే విరాట్ కోహ్లి ఒక్కడు వేరే జెర్సీని ధరించి వచ్చాడు.
ఈ విషయాన్ని గుర్తించిన కోహ్లీ మ్యాచ్ మధ్యలోనే వెళ్ళి, జెర్సీని మార్చుకుని వచ్చాడు. అయితే మిగతా భారత క్రికెటర్ల జెర్సీ, కోహ్లి ధరించిన జెర్సీ ఒకేలా ఉన్నాయి. కానీ జెర్సీ భుజం పైన ఉన్న స్ట్రిప్స్ ఒక్కటే డిఫరెంట్ గా ఉన్నాయి. మిగతా టీమిండియా ప్లేయర్ల జెర్సీ పై మూడు రంగుల స్ట్రిప్ ఉంది. అయితే కోహ్లి వేసుకున్న జెర్సీకి వైట్ లైన్స్ ఉన్నాయి. ఈ విషయన్ని గమనించిన కోహ్లీ వెంటనే జెర్సీని మార్చుకుని వచ్చేశాడు. అయితే అప్పటికే ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Also Read: ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి ఇప్పుడు ఇండియాలోనే పెద్ద క్రికెటర్ అయ్యాడు..! ఎవరో తెలుసా..?


End of Article

You may also like