Ads
వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు అదరగొడుతోంది. అశ్విన్ 5 వికెట్లు తీయడంతో మొదటి రోజే విండీస్ 150 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. తొలి టెస్టులో భారత జట్టు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల కోల్పోయి 312 పరుగులు చేసింది.
Video Advertisement
యశస్వి జైశ్వాల్ మొదటి టెస్టులోనే సెంచరీతో నాటౌట్ గా నిలవగా, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్ టెస్టుల్లోకి అడుగు పెట్టారు. అయితే వికెట్ కీపర్ కేఎస్ భరత్ను తుది జట్టు నుండి తొలగించారు. భరత్ను తొలగించడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
టీమిండియా మేనేజ్మెంట్ తెలుగు ప్లేయర్ కేఎస్ భరత్ ను వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ కు పక్కనపెట్టింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల్లో కేఎస్ భరత్కు వికెట్ కీపర్గా ఛాన్స్ ఇచ్చింది. కానీ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ కు భరత్ స్థానంలో యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు మొదటిసారి టెస్టుల్లో అవకాశాన్ని ఇచ్చింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ మరియు డబ్ల్యూటీసీ ఫైనల్లో కేఎస్ భరత్కు వికెట్ కీపర్గా భారత జట్టు తరఫున ఆడే ఛాన్స్ లభించింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భరత్ వికెట్ కీపింగ్లో సత్తా చాటినా, బ్యాటింగ్లో తడబడ్డాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా వికెట్ కీపర్గా కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ లలో ఎవరిని ఆడించాలనే చర్చ జరిగింది. వికెట్ కీపింగ్లో సత్తా చాటిన భరత్ నే మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ముఖ్యమైన మ్యాచ్లలో వికెట్ కీపర్గా భరత్ రాణించినా, బ్యాటింగ్లో తడబడ్డాడు. వెస్టిండీస్ టూర్ కు భరత్ ను సెలెక్ట్ చేసినప్పటికీ, తుది జట్టులో స్థానం దక్కలేదు.
భరత్ ను తప్పించడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ల్లో అవకాశం ఇచ్చి, ఇప్పుడు వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టులో తప్పించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భరత్ను తప్పించి ముంబై ఇండియన్స్ జట్టు ఇషాన్ కిషన్కు ఛాన్స్ ఇచ్చావా అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ పై సెటైర్లు వేస్తున్నారు. భరత్ బ్యాటర్గా మెరుగైన ఛాయిస్ కాకపోవచ్చు. అయితే వికెట్ కీపర్గా ఇషాన్ కంటే అతడే బెటర్ అని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
Also Read: “ధోని” కావాలనే రన్ అవుట్ అయ్యాడు..! యువరాజ్ సింగ్ తండ్రి కామెంట్స్..!
End of Article