Ads
శ్రీలంకలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మరియు శ్రీలంక పార్లమెంటు మధ్య ఆధిపత్య పోరు కారణంగా రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో నేడు శ్రీలంక ఎంతటి దౌర్భాగ్యమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిందే. ఆర్థిక మాంద్యంతో లంక అతలాకుతలం అవుతుంది.
ఇటీవల జరిగిన పలు హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం ఈ కొత్త ప్రభుత్వం సంక్షోభం నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంది.
Video Advertisement
విదేశీ మారక నిల్వలు కూడా భారీగా తగ్గిపోవడంతో వస్తువులను దిగుమతి చేసుకోవడం ఒకింత కష్టంగా మారింది. దీంతో ఇంధన సంక్షోభాన్ని సైతం తీవ్రస్థాయిలో ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో అక్కడ కొత్త ప్రభుత్వం అనవసర ప్రయాణాలను తగ్గించుకోమని ప్రజలకను కోరింది. అయినా ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోలేదు. అందువలన అక్కడ పెట్రోల్ బంక్ల వద్ద జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు.
అయితే శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ సిరివర్ధనే మహానామా అందరికీ తెలిసే ఉంటాడు. శ్రీలంక తరపున 1996 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడు. టెస్ట్ చరిత్రలో డే-నైట్ టెస్ట్ మ్యాచ్లో మ్యాచ్ రిఫరీగా నిలిచిన మొదటి వ్యక్తి. రోషన్ పెట్రోల్ బంక్ల వద్ద నుంచొని ఉన్న ప్రజలకు టీలు, స్నాక్స్ సర్వ్ చేసి తన ఉదారాన్ని చాటుకున్నాడు.
ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. క్యూలో చాలాసేపు నిల్చొని ఉండటంతో వారికి బాగా ఆకలిగా ఉంటుంది. అందువల్ల మనం వారికి సాయం చేయాల్సిన అవసరం ఎతైనా ఉందని ఆయన తెలిపారు .
ప్రస్తుత సంక్షోభ పరిస్థితులలో ప్రతి ఒక్కరిని తమ కోసం కాకపోయినా, ఇతర కోసమైనా ఆహార పదార్థాలు తీసుకెళ్లమని సలహా ఇస్తున్నాడు. ఎవరికైన అత్యవసరమైతే నెంబర్ 1990కి కాల్ చేయమని సూచిస్తున్నాడు. ఈ సందర్భంగా ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఒకరికొకరు సాయంగా ఉంటూ, మద్దతు ఇచ్చుకోవాలని పిలుపునిచ్చారు మాజీ క్రికెటర్ రోషన్ మహానామా.
End of Article