Ads
మహేంద్ర సింగ్ ధోనీ. పరిచయం అక్కర్లేని వ్యక్తి. క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధోనీ, ఎన్నో రికార్డులను కూడా నెలకొల్పారు. ధోనీ కేవలం తన ఆట తీరుకి మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా విషయాలకి ఫేమస్ అయ్యారు.
Video Advertisement
ధోనీ ప్రవర్తన విధానం, బయట ఎన్నో ఇంటర్వ్యూలలో ధోనీ మాట్లాడే తీరు అవన్నీ కూడా ధోనీకి ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. అయితే ధోనీ గురించి మరొక ఆసక్తికరమైన విషయం కూడా బయటికి వచ్చింది.
అదేంటంటే, ధోనీ ఇప్పటికి కూడా ఒక గాజు గ్లాస్ లో టీ తాగుతారు. సాధారణంగా గాజు గ్లాస్ లో టీ తాగడం అనేది వింత ఏమి కాదు. కానీ ఇలా తాగడం వెనుక ఉన్న కథ చూస్తే ధోనీ నిజంగా గొప్పవారు కదా అనిపిస్తుంది. ఇటీవల టీం ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
ఇందులో ధోనీ గురించి మాట్లాడుతూ ధోనీ ఇప్పటికి కూడా ఒక గాజు గ్లాస్ లో టీ తాగుతారు అని చెప్పారు. అలా గాజు గ్లాస్ లో టీ తాగిన ప్రతి సారి తాను ఎక్కడ నుండి వచ్చాను అనే విషయం తనకి గుర్తొస్తుంది అని ధోనీ అంటారట. అందుకే ఎప్పుడూ కూడా ఆ గాజు గ్లాసులో మాత్రమే టీ తాగుతారు. ఇంటర్వ్యూలో ప్రసాద్ మాట్లాడుతూ ధోనీ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పారు.
ధోనీ టీం కోసం ఎంత రిస్క్ అయినా చేస్తారు అని, ఒక సారి తాను సెలెక్టర్ గా ఉన్నప్పుడు ధోనీ తనకి వెన్నునొప్పి ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి మరి మ్యాచ్ ఆడారు అని చెప్పారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. అలా కొన్ని విషయాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రసాద్ గుర్తుచేసుకొని ప్రేక్షకులతో పంచుకున్నారు.
watch video :
End of Article