Ads
టీమిండియా దిగ్గజ కెప్టెన్గా, మిస్టర్ కూల్ గా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సైతం తన మార్క్ ను చూపించాడు. 41 సంవత్సరాల వయసులో ఐపీఎల్ లో చెన్నై సూపర్కింగ్స్ జట్టును 5వ సారి విజేతగా నిలిపి తన సత్తాను చాటుకున్నాడు. కెప్టెన్గా భారత జట్టుకు 3 ఐసీసీ ట్రోఫీలు సాధించిన ధోని, వివిధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా, ప్రకటనలలో రూపంలో కూడా సంపాదిస్తున్నాడు.
Video Advertisement
ఇప్పటికే పలు బిజినెస్ లలో పెట్టుబడి పెట్టిన ధోని, సినీ రంగంలోను అడుగు పెట్టాడు. ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ అనే పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. మరి ఈ సంస్థకు సీఈఓ ఎవరో? ధోనీకి ఏం అవుతారో ఇప్పుడు చూద్దాం..
మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సీఎస్కే కెప్టెన్ గా ధోని ఇప్పటి దాకా సీఎస్కేను ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ధోని భారత జట్టు ఫినిషర్గా ఎన్నో మరుపురాని విజయాలు అందించారు. ధోని కెరీర్లో అంతర్జాతీయంగా 90 టెస్ట్ మ్యాచులు, 350 వన్డే మ్యాచులు, 98 టీ20 మ్యాచులు ఆడాడు. ఇక టెస్టుల్లో 4876 పరుగులు, వన్డేల్లో 10773 పరుగులు, టీ20ల్లో 1617 పరుగులు చేశాడు. 2020లో ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మిస్టర్ కూల్, ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉండగా 2010లో జూలై 4న ధోని సాక్షిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2015లో ఫిబ్రవరి 6న కుమార్తె జన్మించింది. ఆమె పేరు జివా. రిటైర్మెంట్ తరువాత ఫ్యామిలీతో గడుపుతున్న ధోనీ, బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. ఇటీవల తన పేరుతోనే ఒక ప్రొడక్షన్ హౌజ్ ను ప్రారంభించి సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఆ ప్రొడక్షన్ హౌజ్ కు సీఈఓ బాధ్యతను ధోనీ తన అత్తగారికి అప్పగించారు. ఆమె ధోనీ భార్య సాక్షి సింగ్ తల్లి షీలా సింగ్. తన నిర్మాణ సంస్థలో ఫ్యామిలీ మెంబర్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కోసం భార్య సాక్షి సింగ్, అత్తగారు షీలా సింగ్కు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించాడని తెలుస్తోంది. ఇక ఈ సంస్థ విలువ సుమారు 800 కోట్లని అంచనా వేస్తున్నారు. ఈ సంస్థలో సాక్షి సింగ్ అతిపెద్ద షేర్హోల్డర్గా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: కెప్టెన్ కూల్ “ధోని” ఇరుక్కున్న 5 కాంట్రవర్సిలు ఏంటో తెలుసా.? 5 వ ది చాలామందికి తెలియకపోవచ్చు.!
End of Article