Ads
ఆసియా కప్ 2022 లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో భారత్ కు తొలి ఓటమి ఎదురైంది. లీగ్ దశలో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి సూపర్ 4 కు చేరిన రోహిత్ సేన దాయాదుల చేతిలో ఖంగు తింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడా తో పాకిస్తాన్ భారత్ పై విజయం సాధించింది.
కాగా పాక్ చేతిలో ఓటమి తర్వాత భారత్ ఫైనల్స్ కు చేరగలదా..?? భారత్ కు ఉన్న అవకాశాలేంటి..? దీనికి పాక్ సహకారం అవసరమా..?? అదెలాగో చూద్దాం..
Video Advertisement
సూపర్ 4 లో ఇప్పటికే శ్రీలంక, పాకిస్థాన్ ఒక్కో విజయం తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ 2 లో నిలిచాయి. తర్వాతి భారత్, ఆఫ్గానిస్తాన్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. సూపర్ 4 లోని నాలుగు జట్లూ మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి. ఓవరాల్ గా శుక్రవారంతో ఈ మ్యాచ్ లు ముగియనున్నాయి. అప్పటికి పాయింట్ల పట్టికలో టాప్ 2 లో ఉన్న రెండు జట్లు ఫైనల్స్ ఆడతాయి. సెప్టెంబర్ 11 ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
భారత్ ఫైనల్స్ కు చేరాలంటే..??
# పాక్ చేతిలో ఓడిపోయిన భారత్ తర్వాత రెండు మ్యాచ్ లు శ్రీలంక యాహూ మంగళ వారం , ఆఫ్గానిస్తాన్ తో గురువారం ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్ లలో ఇండియా విజయం సాధిస్తే ఆఫ్గానిస్తాన్ ఫైనల్ రేస్ నుంచి తప్పుకుంటుంది.
# పాక్ తన రెండు మ్యాచ్ లను శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ తో ఆడుతుంది. ఈ రెండిటిలో పాక్ విజయం సాధిస్తే శ్రీలంక కూడా ఇంటి బాట పడుతుంది. అదే జరిగితే భారత్ ఫైనల్స్ ఆడేందుకు మార్గం సుగమం అవుతుంది.
# ఒకవేళ పాకిస్థాన్, శ్రీలంక జట్లు రెండు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి ఫైనల్ రేసులో నిలిస్తే? అప్పుడు నెట్ రన్రేట్ కీలకం కానుంది. కాబట్టి భారత్ తాను ఆడబోయే రెండు మ్యాచ్ లలో భారీ తేడాతో గెలవడం ముఖ్యం.
End of Article