Ads
నిన్న ఆదివారం సిడ్నీ వేదికగా యాషెస్ సిరీస్లో భాగంగా నాలుగో టెస్టు మ్యాచ్ ముగిసిన సంగతి తెలిసిందే. నిన్న చివరి రోజు కాగా… ఆ మ్యాచ్ చివరివరకు నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా తో పోటీ పడ్డారు.
Video Advertisement
ఆస్ట్రేలియా ఫీల్డర్లు బ్యాటింగ్ చేస్తున్న బ్రాడ్, అండర్సన్ పై విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపూ ఆస్ట్రేలియా టీం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూనే ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఈ మ్యాచ్ డ్రా గానే మిగిలింది.
అయితే, ఈ మ్యాచ్ ని ఉద్దేశించి ఐపీఎల్ ప్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ ట్విట్టర్ ఓ ఫోటో ను పోస్ట్ చేసింది. అంతే కాదు.. ఈ మ్యాచ్ లోని క్లాసిక్ మూవ్ టీ20 ఫార్మాట్లో మాస్టర్ స్ట్రోక్ను గుర్తుకు తెస్తోంది అంటూ కాప్షన్ ని జత చేసాడు. దీనితో అటు చెన్నై సూపర్ కింగ్స్, ఇటు ధోని అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ ని కించపరుస్తున్నారంటూ ఆగ్రహిస్తున్నారు.
టీ20 ఫార్మాట్లో కూడా ధోని బ్యాటింగ్ చేస్తున్న టైం లో కోల్కతా జట్టు బౌలర్తో సహా 6 గురు ఫీల్డర్లను బ్యాటర్ కు దగ్గరగా పంపింది. ఈ ఫోటో కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో పెద్ద దుమారమే రేగింది. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లేదు. అందుకే ధోని పూణే రైజింగ్స్ జట్టుకు ఆడాడు. ఈ ట్వీట్ పై పలువురు క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా జడేజా కూడా స్పందించాడు.
ఇది మాస్టర్ స్ట్రోక్ కాదని.. జస్ట్ షో ఆఫ్ మాత్రమేనని జడేజా కోల్ కతా నైట్ రైడర్స్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జడేజా కు గాయం అవ్వడంతో ప్రస్తుతం జరుగుతున్న సౌత్ ఇండియా టూర్ కు దూరంగా ఉన్నాడు. ఈ ఆల్ రౌండర్ ఇప్పుడిప్పుడే బెంగళూరులోని ఎన్సీఏలో తన గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఐపీఎల్లో 2022లో జడేజా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. ఇందుకుగాను సీఎస్కె ధోనికంటే ఎక్కువ మొత్తాన్నే చెల్లించి జడేజాను రిటెన్షన్ చేసుకుంది. ఇందుకోసం జడేజా మొత్తంగా 16 కోట్లు తీసుకోనున్నారట.
End of Article