జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి గుణం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సాయాలు చేస్తూ ఉంటారు గానీ అవన్నీ బయటికి రావు. ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు కానీ వాటి గురించి ఎక్కడా చెప్పరు. పవన్ కళ్యాణ్ కి పుస్తకాలు అంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే. ఖాళీగా ఉంటే చాలు పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో రకాల పుస్తకాలు, ఎన్నో మాండలికలకు సంబంధించిన పుస్తకాలు చదివారు. తెలుగు లిటరేచర్ అంటే పవన్ కళ్యాణ్ కి అమితమైన ఇష్టం. అది అక్కడక్కడ తన సినిమాల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది.
తాజాగా పవన్ కళ్యాణ్ ప్రముఖ కది గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకానికి ఆర్థిక సహాయాన్ని అందజేసి దాన్ని రీప్రింట్ చేయించారు.ఈ పుస్తకం ముందు పేజీలో పవన్ కళ్యాణ్ రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మే 18 2016 న తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఈ లెటర్ రాసినట్లుగా ఉంది. ఆధునిక మహాభారతం పుస్తకం చదివి తాను ఎంత ఇన్స్పైర్ అయ్యారు అనేది ఈ లెటర్ ద్వారా తెలియజేశారు.

పూర్తి విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ కి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని త్రివిక్రమ్ బహుమతిగా అందించారు. అయితే పుస్తకం తనని ఎంతగానో ఆకట్టుకున్నందుకు ఆ పుస్తకాన్ని మళ్లీ రీప్రింట్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడవుగా గుంటూరు శేషేంద్ర కుమారుడి సహకారాన్ని తీసుకున్నారు.

25 వేల కాపీల పుస్తకాలు ముద్రించేందుకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తనకి ఇంత గొప్ప కవిని పరిచయం చేసినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపారు.పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.పవన్ కళ్యాణ్ ఆధునిక మహాభారతాన్ని ఎంతలా వంట పట్టించుకున్నారంటే తన రాజకీయ ప్రసంగాల్లో ప్రతి చోట గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పిన మాటలను తన స్పీచ్ లో వినిపిస్తూ ఉంటుంది.
Also Read:మాటల మాంత్రికుడు “త్రివిక్రమ్ శ్రీనివాస్” చెప్పిన 8 జీవిత సత్యాలు..!









2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.


17.














సంజయ్ లీలా భన్సాలీ
డైరెక్టర్ అట్లీ
ఏఆర్ మురుగదాస్
కొరటాల శివ
డైరెక్టర్ త్రివిక్రమ్
బోయపాటి శ్రీను
ఇప్పటికే మహేష్బాబు,త్రివిక్రమ్ల సినిమా పై రకరకాలుగా రూమర్స్ షికారు చేస్తున్నాయి. అసలు ఈ సినిమానే ఆగిపోయిందని కూడా టాక్ వచ్చింది. ఆ తర్వాత మహేష్ కథలో మార్పులు చేయమని త్రివిక్రమ్ కి సూచించారని,దాంతో ఈ సినిమా స్టోరీ పూర్తిగా మారిపోయిందని కూడా వచ్చాయి. SSMB28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్.
ఇక ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 8న హైదరాబాద్లో మొదలు కానుంది. షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరగనుందని సమాచారం. పూజా హెగ్డే కాలి గాయం నుంచి కోలుకుని ఈ షూటింగ్ లో పాల్గోబోతుందని చెప్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు ఇంకో హీరోయిన్కు స్థానం ఉందని సమాచారం. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ను తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
మరోవైపు మహేష్బాబు తో రాజమౌళి మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలు అవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే మరి మహేష్ బాబు ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్స్ పాల్గొంటాడా లేదా త్రివిక్రమ్ మూవీ తర్వాతనే రాజమౌళి సినిమా మొదలు పెడతాడా అన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఇంతకు ముందు అతడు, ఖలేజా చిత్రాలు చేశాడు. మూడో సినిమాలో మహేష్ బాబుని ఎలా త్రివిక్రమ్ చూపిస్తున్నాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.