Ads
దుబాయ్ వేదికగా ఇండియాకి, పాకిస్థాన్కి మధ్య జరిగిన టీ20 వరల్డ్కప్లో 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. వరల్డ్ కప్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇండియాపై పాకిస్థాన్ విజయం సాధించడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఫీల్డింగ్ ను ఎంచుకున్నారు. దీనితో.. ఓపెనర్లు రోహిత్ శర్మ (0), కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.
Video Advertisement
అయితే వీరిద్దరూ తక్కువ స్కోర్ లోనే పెవిలియన్ చేరారు. రిషబ్ పంత్ (39: 30 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి నిలకడగా ఆడిన విరాట్ కోహ్లీ (57: 49 బంతుల్లో 5×4, 1×6) నాలుగవ వికెట్కి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హసన్ అలీ బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టిన రిషబ్ పంత్ తర్వాత ఓవర్లో భారీ షాట్ కోసం ప్రయత్నించి షదాబ్ ఖాన్కి వికెట్ సమర్పించుకున్నారు. పాకిస్థాన్ జట్టు బౌలర్లలో షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు హసన్ అలీ రెండు వికెట్లు, షదాబ్ ఖాన్ ఒక వికెట్, హారీస్ రౌప్ ఒక వికెట్ ను ఇచ్చేసారు.
ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. అయితే.. మ్యాచ్ కు ముందు గౌతమ్ గంభీర్ ఒక ట్వీట్ వేశారు.. “ఈ మ్యాచ్ లో ఇండియా తప్పకుండా గెలుస్తుందని.. ఇండియన్ ప్లేయర్స్ మీద తనకి నమ్మకం ఉందని.. వారిని ఏదీ ప్రభావితం చెయ్యలేదని.. కచ్చితంగా ఇండియన్ ప్లేయర్స్ బాగా ఆడి మ్యాచ్ ని గెలుస్తారని..” తన ట్వీట్ లో పేర్కొన్నారు… అయితే.. మ్యాచ్ ఓడిపోవడంతో గౌతమ్ గంభీర్ ట్వీట్ వెయ్యడం వల్లే ఓడిపోయారు అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ట్రోల్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
#12.
#13.
#14.
#15.
End of Article