Ads
టీం ఇండియా యువ ఆటగాడుగా శుభ్ మన్ గిల్ పేరు తెచ్చుకున్నాడు. భవిష్యత్ లో టీం ఇండియా జట్టుకు మరింతగా సపోర్ట్ ఇవ్వగలరని అంతా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐపీఎల్ లో కోల్ కతా తరపున శుభ్ మన్ గిల్ సత్తా చాటారు. ప్రస్తుతం 2022 ఐపీఎల్ ఆక్షన్ లో అహ్మదాబాద్ టైటాన్స్ శుభ్ మన్ గిల్ కోసం రూ. 8 కోట్లు ఖర్చు చేసింది.
Video Advertisement
ఇది ఇలా ఉంటె.. శుభ్ మన్ గిల్ ఏ ఆట ఆడినా, తాను ఆడే సమయంలో ఓ ఎర్ర రంగు కర్చీఫ్ ను ధరిస్తూ ఉంటారు.. అది ఎందుకు ధరిస్తారు అన్న సందేహం చాలా మందికి ఉంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో శుభ్ మన్ గిల్ ఆ ఎర్ర కర్చీఫ్ వెనుక అసలు స్టోరీ ని చెప్పుకొచ్చారు. అది శుభ్ మన్ గిల్ కు ఓ సెంటిమెంట్ అట. అయితే.. ఈ సెంటిమెంట్ అతనికి మొదటినుంచి లేదు. ఓ సారి అండర్ 19 వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో వైట్ బాల్స్ తో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.
ఆరోజు అనుకోకుండా ఓ ఎర్ర కర్చీఫ్ ను తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. అయితే ఆ రోజు చాలా బాగా పెర్ఫార్మ్ చేసాడు. ఇక ఆ కర్చీఫ్ ను అలా జేబులో పెట్టుకోవడం తనకి ఓ సెంటిమెంట్ లా మారిపోయింది. ఆ తరువాత నుంచి ఎప్పుడు మ్యాచ్ ఆడినా ఎర్ర కర్చీఫ్ ను జేబులో పెట్టుకోవడం అలవాటు అయిపోయిందట. ఇప్పుడు ఎంత మార్చుకుందామనుకుంటున్నా ఈ అలవాటు మారట్లేదట. పైగా.. అది తన ఫేవరెట్ కలర్ కూడా అవ్వడంతో ఇక ఆ అలవాటుని అలానే కంటిన్యూ చేస్తున్నారట.
End of Article