సాధారణం గా వాస్తు గురించి ఏ కొద్దీ నాలెడ్జి ఉన్నవారు అయినా.. వీధి పోటు గురించి చెప్పగలుగుతారు. వీధిపోటు అనగానే.. అది ఉన్న ఇంట్లో ఉండడం మంచిది కాదని అందరు టక్కున చెప్పేస్తూ ఉంటారు. ఇంతకీ వీధి పోటు ఉంటె మంచిదా..? లేక నష్టం వస్తుందా..? అసలు వీధిపోటు అంటే ఏమిటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణం గా వీధి మన ఇంటి ఎదురు వరకు వచ్చి ఆగిపోయినా.. లేదా అక్కడనుంచి మలుపు తీసుకున్నా.. దానిని వీధిపోటు గా పేర్కొంటారు. ఈ వీధిపోట్లలో కొన్ని గృహస్తులకు మేలు చేసేవి ఉంటాయి. కొన్ని కీడు చేస్తూ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంటికి తూర్పు, ఈశాన్య భాగాల్లో వీధి పోటు వస్తే.. దానివలన గృహస్తు కి మంచి జరుగుతుంది. ఆ ఇంట్లో నివసించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. ఏ రంగం లో అడుగుపెట్టినా విజయం వీరి సొంతం అవుతుంది. ఆత్మవిశ్వాసం తో పని చేయగలుగుతారు.

ఇంటికి ఉత్తర – ఈశాన్య దిక్కు వైపు వీధిపోటు ఉంటె.. ఆ ఇంట్లో స్త్రీలకూ మేలు జరుగుతుంది. ఆ ఇంటి యజమానికి ఆదాయం బాగా ఉండి మానసికం గా ప్రశాంతం గా ఉండగలుగుతారు. అలాగే.. ఇంటికి పశ్చిమ-వాయువ్య భాగం వైపు వీధి ఉంటె ఆ ఇంటి గృహస్తు కి సమాజం లో గౌరవ మర్యాదలు కలుగుతాయి. వారికి రాజకీయ రంగం కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే.. దక్షిణ – ఆగ్నేయ భాగం వైపు వీధి ఉంటె ఆ ఇంటిల్లిపాది సుఖం గా ఉంటారు. శుభకార్యాలు నిర్వహిస్తూ.. బంధువుల ఆదరణను చూరగొంటారు. వీరికి అనుకోని ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది.

అలానే, కొన్ని వీధిపోట్లు అస్సలు అచ్చిరావు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తర వాయువ్య భాగం లో వీధిపోటు రావడం వలన ఆ ఇంట్లో స్త్రీలకు చెడు ఫలితాలు ఉంటాయి. పెళ్లి కుదరకపోవడం, కుదిరిన సంబంధాలు చెడిపోవడం వంటివి జరుగుతుంటాయి. పశ్చిమ – నైరుతి భాగం వైపు వీధిపోటు ఉండడం వలన కూడా అనేక నష్టాలూ సంభవిస్తూ ఉంటాయి. డబ్బు చేయి దాకా వచ్చి చేజారిపోతుంటుంది. దక్షిణ-నైరుతి భాగం లో వీధిపోటు ఉండడం కూడా మంచిది కాదు. స్త్రీలకు ఆరోగ్యం చెడిపోవడం, దంపతుల మధ్య తగాదాలు రావడం వంటివి జరుగుతుంటాయి.

అలాగే, ఇంటికి తూర్పు – ఆగ్నేయం వైపు వీధిపోటు ఉండడం కూడా కష్టాలను కొని తెస్తుంది. సంపాదించినా సొమ్మంతా ఇంటికి రాకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. కుటుంబ కలహాలు ఎక్కువ అవుతాయి. మానసిక ప్రశాంతత ఉండదు. ఇంటి ఎదురు గా ఉండే వీధి పెద్ద రోడ్డు తో ఉంటె దోష ప్రభావం పెద్దగా ఉండదని చెబుతుంటారు. ఉత్తరం, ఈశాన్యం లలో ఎక్కువ గా ఖాళీ ప్రదేశం ఉంటుంది కాబట్టి పెద్దగా నష్టాలు రావు. దక్షిణం,నైరుతి వీధిపోట్ల విషయం వచ్చేసరికి.. ఇంటికి ఎదురుగా ఉండే వీధి నుంచి ఏదైనా వాహనం వచ్చి గుద్దితే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. అందుకే పెద్దలు ఇలా చెప్పారు. వీటిని తెల్సుకుని పాటించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

























మన భారత మాజీ కెప్టెన్ ,మిస్టర్ కూల్ ధోనీ భార్య సాక్షి ధోని… అప్పటివరకు మిస్టర్ కూల్ గా,అమ్మాయిల కలల రాకుమారుడిగా,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న ధోనికి జోడి అయింది సాక్షి.ధోనితో పెళ్లి కాగానే ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది సాక్షి. పెళ్లి తర్వాత క్రికెట్లో ధోని దశ కూడా తిరిగింది..వీరిద్దరి గారాల పట్టి జీవా..పెళ్లికి ముందే హోటల్ మేనేజ్మెంట్ చేసింది సాక్షి,ట్రెయిన్ గా కోల్ కతాలో జాబ్ కూడా చేసింది..కోల్ కతలో తాజ్ బెంగాల్లో ఇంటర్న్ షిప్ ట్రెయిని గా చేసేటప్పుడే ధోనితో పరిచయం అయింది.ప్రస్తుతం “సాక్షి రావత్ ఫౌండేషన్” పేరిట అనాధలకోసం ఒక సంస్థని స్థాపించి,సంస్థ బాద్యతలు చూస్కుంటుంది.
రితికా,ప్రొఫెషన్ స్పోర్ట్స్ మేనేజర్..గ్రాడ్యుయేషన్ తర్వాత కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ట్నైన్మెంట్ లో స్పోర్ట్స్ మానేజర్ గా పనిచేసింది..రోహిత్ శర్మ ని కలిసింది ప్రోఫెషనల్ మీట్ లోనే..సిక్స్ ఇయర్స్ డేటింగ్ తర్వాత వివాహం చేసుకుంది ఈ జంట..వీరిద్దరికి ఒక కూతురు పేరు సమైరా శర్మ.
వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ భార్య దిపికా పల్లికల్ ఫేమస్ స్క్వాష్ ప్లేయర్..స్క్వాష్ ప్లేయర్స్ లో మొట్టమొదటి అర్జుణ అవార్డు గ్రహీత.అంతేకాదు పద్మశ్రీ అవార్డును సైతం కైవసం చేసుకుంది.ప్రొఫెషనల్ స్క్వాష్ అసోషియేషన్ టాప్ 10లో ఇండియాని నిలబెట్టిన ప్రతిభాశీలి.
సురేశ్ రైనా భార్య ప్రియాంక చౌదరి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మరియు బ్యాంకర్.గతంలో యాక్సెంచర్,విప్రో వంటి సంస్థలలో పని చేసింది..గ్రేసియా రైనా ఫౌండేషన్ స్థాపించి,సంస్థ బాద్యతలు చూసుకుంటుంది.గ్రేసియా సురేష్ రైనా,ప్రియాంకల కూతురు పేరు.. పిల్లలు మరియు తల్లి ఆరోగ్యాన్ని పెంపొందించే సంస్థ గ్రేసియా రైనా ఫౌండేషన్.
ఆయేషా కిక్ బాక్సర్,అథ్లెట్.శిఖర్ ధావన్ తో వివాహానికి ముందే ఆయేషా కిక్ బాక్సర్ గా పేరుగాంచింది.. ఆయేషా ,శిఖర్ లది రెండవ వివాహం.శిఖర్ తో వివాహానికి ముందే ఆయేషాకు పెళ్లి జరిగి,ఇద్దరు పిల్లలున్నారు..వీరిద్దరి పరిచయం జరిగింది ఫేస్ బుక్లో..పరిచయం ప్రేమగా మారి,పెళ్లి వరకు వచ్చింది.ఆయేషాని పెళ్లి చేసుకోవడానికి శిఖర్ తన ఫ్యామిలితో చిన్నపాటి యుద్దమే చేసాడు..మొత్తానికి కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వైఫ్ ఇంజినీర్.వీరిద్దరూ సేమ్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు.వీరికి ఇద్దరు అమ్మాయిలు అకీరా,ఆద్యా.
మయంతి జర్నలిస్టు, ఫేమస్ స్పోర్ట్స్ యాంకెర్,క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మయంతి సుపరిచితురాలే.క్రికెటర్ స్ట్రావుడ్ బిన్నిని వివాహం చేసుకున్నారు మయంతి లాంగెర్.
సాగరికా ఘాట్గే నటి మరియు అథ్లెట్..ప్రముఖ బాలివుడ్ నటుడు షారుక్ నటించిన ఛక్ దే ఇండియా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే..ఆ చిత్రంలో సాగరిక కీలక పాత్రలో నటించి వెండితెరకు పరిచయం అయింది.వివిధ చిత్రాలు,రియాలిటి షోలు మరియు వెబ్ సిరిస్ లలో కూడా నటించింది.



