ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత పాపులారిటీ ఉన్న వారిలో మంత్రి విడదల రజని ఒకరు. అత్యంత చిన్న వయసులోనే మంత్రి అయినవారిగా రికార్డు సృష్టించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అందరిని దాటుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అందం అభినయంతో పాటు మంచి వాక్చాతుర్యమున్న నాయకురాలిగా పేరుగాంచారు.
అయితే విడుదల రజనీ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో మొదలైంది.అక్కడ కూడా తక్కువ సమయంలోనే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టిని ఆకర్షించారు. ఓ సమావేశంలో తాను చంద్రబాబు నాటిన మొక్కనని,ఆయన కట్టిన హైటెక్ సిటీలో ఉద్యోగం చేసి, అక్కడి నుంచి అమెరికా వెళ్లి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకున్నారు.

తర్వాత 2018 ఎన్నికల్లో తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరి సీనియర్లు అందరినీ దాటుకుని సీటు సంపాదించి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి పొంది అతి తక్కువ వయసులోనే మంత్రి అయిన వారిగా పేరుతెచ్చుకున్నారు. అయితే ఒకసారి విడుదల రజనీ ప్రస్థానాన్ని చూస్తే… విడదల రజిని 1990 జూన్ 24న హైదరాబాదులో జన్మించారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రజనీ మల్కాజ్గిరిలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో 2011లో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశారు.

అనంతరం ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్లు పనిచేసిన రజినికి విడదల కుమారస్వామితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప సంతానం. తర్వాత భర్త కుమారస్వామి తో కలిసి అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఒక ఐటీ కంపెనీ స్థాపించి అతి తక్కువ కాలంలోనే ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. అయితే సొంత ఊరికి తిరిగివచ్చి రాజకీయాల్లోకి రావాలని ఉద్దేశంతో పలు సేవా సంస్థలు స్థాపించి ప్రజలకు సేవ చేసేవారు.

2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై 8,301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిచిన తొలి బీసీ మహిళగా చరిత్ర సృష్టించారు. శాసనసభ వేదికగా సీఎం జగన్పై ఓ రేంజ్లో పొగడ్తలు కురిపించే విడదల రజిని,నిత్యం ప్రజల్లో గుంటూరు తనకంటూ ఒక ప్రత్యేకమైన సోషల్ మీడియా టీం ని ఏర్పాటు చేసుకుని తను చేసే కార్యక్రమాలను వైరల్ చేస్తూ ఉంటారు.





అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘నా సామి రంగా’ జనవరి 14కి రిలీజ్ కానుంది. ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ ఎక్కువగానే ఉంది. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీ అయలాన్ కూడా రిలీజ్ కానుంది. ఈ ఐదు సినిమాలు ఒకటి, రెండు రోజుల తేడాతో రిలీజ్ కానున్నాయి. ‘నా సామి రంగా’ రీమేక్ మూవీ అనే విషయం తెలిసిందే.
మూడేళ్ళ క్రితం మలయాళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయిన పొరింజు మరియం జోస్ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఈ మూవీ యాంటీ క్లైమాక్స్ మూవీ. నాగార్జున ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకుని రిస్క్ చేస్తున్నారా అనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ రీమేక్ అని తెలిసిన వెంటనే చాలామంది మలయాళ మూవీని చూశారు. ఇక మలయాళ మూవీ స్టోరీ, కథనం తెలుగుకి వర్కౌట్ కాదు. ఎందుకంటే మలయాళ మూవీలో హీరో పాత్ర చనిపోవడంతో సినిమా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఆ సీన్ ను ఏమైనా మార్చరా లేదంటే, తెలుగు ప్రేక్షకులు అలాంటి ముగింపును అంతగా ఇష్టపడరు. అలా వచ్చిన సినిమాలు ఎన్నో ప్లాప్ అయ్యాయి. గతంలో నాగార్జున నటించిన ‘స్నేహమంటే ఇదేరా’ మూవీ కూడా సాడ్ ఎండింగ్ ఉంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ అలా కాకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో రిలీజ్ అయిన రీమేక్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దాంతో నాగార్జున ఇంత రిస్క్ చేయడం అవసరమా అంటున్నారు.





బిగ్ బాస్ షోకి ఎంత పాపులారిటీ క్రేజ్ ఉన్నప్పటికీ, షో చుట్టూ అదే స్థాయిలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన విషయం తెలిసిందే. గ్రాండ్ ఫినాలే తరువాత చోటు చేసుకున్న ఘటనలు, రన్నర్ పై దాడి, విజేత అరెస్ట్ ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. తాజాగా సీజన్ 7లో పాల్గొనాలనే ఆశతో యాంకర్ స్వప్న చౌదరి డబ్బు ఇచ్చియానట్టు, కానీ తనకౌ ఛాన్స్ ఇవ్వలేదని ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె ” నా పేరు స్వప్న చౌదరి అమ్మినేని, యాంకర్ అండ్ యాక్టర్. మిస్టరీ, నమస్తే సేట్ జీ అనే సినిమాల ద్వారా ఇండస్ట్రీకి రావడం జరిగింది.
కొంతమందికి అయితే నేను తెలుసు యాంకర్ స్వప్న గా, యాక్టర్ స్వప్నగా చాలామందికి తెలుసు. నాకు బిగ్ బాస్కి వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, నేను నిద్రపోయినప్పుడు కనే కలలో సైతం బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టే కలకంటాను. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకూ చాలా ఇష్టంగా చూశాను. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా పంపిస్తానని చెప్పి, నా దగ్గర నుండి రెండు లక్షల యాబై వేలు తీసుకున్నారు. శని, ఆదివారాల్లో వేసుకునే క్యాస్ట్యూమ్స్కి డబ్బులు కావాలి అని, తమ్మలి రాజు అనే వ్యక్తి రెండున్నర లక్షలు తీసుకున్నారు. అందుకు సంబంధించి బాండ్ పేపర్పై అగ్రిమెంట్ ఇచ్చారు. గత జూన్ లో డబ్బు ఇచ్చాను.
లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు కన్ఫామ్ అన్నారు. కానీ వేరే వాళ్ల నేను ట్రై చేస్తానని చెప్తే, అవసరం లేదు. నేనే పంపిస్తానని అన్నారు. డబ్బు ఎందుకని అడిగితే, పీఆర్ రేటింగ్ పెంచుకోవడం కోసం, కాస్ట్యూమ్స్ కి అని చెప్పాడు. డబ్బు తీసుకోవాడమే కాకుండా, నాతో ఫొటో షూట్ చేయించారు. అందుకు రూ. 25 వేల వరకు ఖర్చు అయ్యింది. జూన్లో డబ్బు ఇస్తే, ఇప్పటికి 8 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నానంటే బిగ్ బాస్ సీజన్ 7లో ఛాన్స్ రాలేదు కదమ్మా, సీజన్ 8లో పంపిస్తానని చెప్పి డబ్బు ఇవ్వలేదు. కానీ నాకు ఒక అగ్రిమెంట్ అయితే రాసి ఇచ్చారు.
ఇందులో సీజన్ 7 లో పంపలేకపోయాను. డబ్బు మాత్రం డిసెంబర్ వరకు ఇస్తానని రాయడం జరిగింది. ఇందుకోసం ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని ఇచ్చాను. జనవరి 6న ఇస్తానని చెప్పాడు. ఆ రోజున కాల్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో.. ప్రెస్ మీట్ పెడతావ పెట్టు అని మాట్లాడాడు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్లు ఇటువంటి చీడ పురుగుల్ని ఎంకరేజ్ చేయవద్దు. ఇలాంటి వ్యక్తులను గమనించండి. బిగ్ బాస్కి పంపిస్తాం అంటూ డబ్బులు తీసుకుని చీట్ చేస్తున్నారు. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. సీజన్ 8 లో అయినా నేను వెళ్ళాలి. నా అమౌంట్ నాకు రావాలి” అంటూ స్వప్న చౌదరి తన ఆవేదన వ్యక్తం చేసింది.
ఒక రైతుగా సాధారణ జీవితం గడుపుతున్న తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందడంతో భావోద్వేగానికి లోనయ్యాడు అతడు. బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో 1992 డిసెంబర్ 2 వ తేదీ నుంచి 4, 5 రోజుల పాటు అయోధ్యలో ఉన్న మహ్మద్ హబీబ్ తనతో ఉన్న వారితో కలిసి కరసేవకుడిగా కొట్లాడాడు. ఆ సమయంలో మహ్మద్ హబీబ్ చేసిన పోరాటాన్ని గుర్తించిన అయోధ్య రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్, శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని అతనికి ఆహ్వానం పంపించింది. హిందువుల ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి ఒక ముస్లిం కి ఆహ్వానం పంపడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. భారతదేశం ఎందుకు మత సామ్రాస్య దేశమో అర్థం అవుతుందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు
