ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా, ఆ తరువాత జబర్దస్త్ జడ్జ్గా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మినిస్టర్ గా కొనసాగుతున్నారు రోజా. ఆమె గురించి అందరికీ తెలిసిందే. సినిమాలకు, బుల్లితెరకు వీడ్కోలు చెప్పిన రోజా, తాజాగా టివి సెలెబ్రిటీలు శ్రీవాణి, విక్రమాదిత్యల ఫుడ్ బిజినెస్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని, వారి రెస్టారెంట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మినిస్టర్ రోజా, వారు అడిగిన ప్రశ్నలకు సరదాగా జవాబు చెప్పారు. అలాగే ఇష్టమైన వంటకాలు, డైట్ ప్లాన్ గురించి కూడా రోజా వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బుల్లితెర సెలెబ్రిటీలు శ్రీవాణి, విక్రమాదిత్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ జంట ‘మీ కడపునిండా’ అనే రెస్టారెంట్ను మొదలుపెట్టారు. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కు ఏపీ మంత్రి రోజాను ఆహ్వానించారు. రోజా చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ను ప్రారంభించారు. చాలా రోజులుగా బుల్లితెరకు దూరంగా ఉన్న రోజా, అక్కడికి వచ్చిన టెలివిజన్ సెలెబ్రిటీలతో సరదాగా ముచ్చటించారు. మీడియాతో కూడా మాట్లాడిన ఆమె వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం తెలిపారు.
రోజా మాట్లాడుతూ తనకు ఇష్టమైన వంటకాలు, డైట్ ప్లాన్ గురించి వెల్లడించారు. తనకు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టమని, రొయ్యల ఇగురు, కీమల ఉండలు, పీతల ఫ్రై, చేపల పులుసు చాలా ఇష్టమని తెలిపారు. ఇక తన డైట్ ప్లాన్ గురించి కూడా చెప్పుకొచ్చారు. ప్రతి రోజూ ఉదయం ఓట్స్, దానిలో డ్రై ఫ్రూట్స్, ఆపిల్స్ కలిపి తింటానని తెలిపారు. ఇక మధ్యాహ్న భోజనంలో మాత్రం నాన్ వెజ్ తప్పనిసరని అన్నారు. కార్తీకమాసం లేదా దేవాలయానికి వెళ్లిన సమయంలో మాత్రం నాన్ వెజ్ తీసుకోనని తెలిపారు.
డిన్నర్ సమయంలో ఇడ్లీ లేదా దోశ లాంటి అల్పాహారాన్ని తీసుకుంటానని చెప్పుకొచ్చారు. విక్రమాదిత్య, శ్రీవాణి, కొత్త రెస్టారెంట్ ఓపెనింగ్ వేడుకలో టెలివిజన్ నటినటులు సందడి చేశారు. వీరిద్దరూ పలు సీరియల్స్, రియాల్టీ షోలు, ఈవెంట్లు, వారి సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా అలరిస్తూ, బాగా సంపాదిస్తున్నారు. తాజాగా మొదలుపెట్టిన ఫుడ్ బిజినెస్లోనూ విజయం సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: “రోజా, సెల్వమణి” పెళ్లి ఫోటోలు చూశారా..? వారి పెళ్లి ఎప్పుడు జరిగింది అంటే..?

ప్రముఖ హాస్యనటుడు అలీ సినిమాలతో పాటుగా, బుల్లితెర పై పలు షోలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఆయన తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో నటించి, పాపులర్ అయ్యారు. పలు టెలివిజన్ షోలకు హోస్ట్ గా చేసిన అలీ పారితోషికం కూడా భారీగానే ఉందనే విషయం తెలిసిందే. ఆయన సతీమణి జుబేదా కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.
యూట్యూబ్ లో సొంత ఛానెల్ ప్రారంభించిన జుబేదా తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యారు. తన ఛానెల్ లో ఎక్కువగా వంటల వీడియోలు మరియు హోం టూర్ వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు. నటుడు అలీ, జుబేదా ఇద్దరు తాము సంపాదించిన దాని నుండి కొంత డబ్బుతో సేవా కార్యక్రమాల కూడా చేస్తుంటారు. ఏడు రోజుల క్రితం జుబేదా తన ఛానెల్ లో ఎగ్ ధమ్ బిర్యానీ వంటకాన్ని తయారు చేశారు. వంట పూర్తయ్యాక దానిని ప్యాక్ చేసి, కొంతమంది పేదవారికి పంచిపెట్టారు.
ఈ వీడియోకి ఏకంగా మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు జుబేదా చేసిన మంచి పనికి ఫిదా అవుతున్నారు. ఆమె ఇలాగే పేదలకు సహాయం చేయాలని కామెంట్లు చేస్తున్నారు. చాలా మందికి జుబేదా స్పూర్తిగా నిలిచారని కొందరు నెటిజెనలు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అలీ కెరీర్ లో మరింత విజయాన్ని సాధించాలని కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల 26 వారాల గర్భవిచ్ఛిత్తికి పర్మిషన్ ఇవ్వమని కోరుతూ 27 సంవత్సరాల మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే తనకు ఇద్దరు పిల్లలున్నారని, తాను మానసికంగా, శారీరకంగా మరో బిడ్డను కనడానికి సిద్ధంగా లేనని కోర్టుకు వివరించింది. మహిళ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అ-బా-ర్ష-న్కి పర్మిషన్ ఇచ్చారు. వైద్య పరంగా అ-బా-ర్ష-న్ కు అక్టోబరు 9న అనుమతిని ఇచ్చింది.
కానీ, ఆ తరువాతి రోజు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 26 వారాల సమయంలో అబార్షన్ చేసినట్లయితే ప్రాణాలకే ముప్పు అని నివేదిక ఇచ్చారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం, చీఫ్ జస్టిస్ బెంచ్ కు పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో నేడు ఛీప్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. తల్లి గర్భంలోని శిశువు గుండెను ఆపడానికి కోర్టు సుముఖంగా లేదని అన్నారు. ఇప్పటికే గర్భిణికి 26 వారాల, 5 రోజులు అని, ప్రస్తుతం ఈ గర్భం వల్ల తల్లికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
తల్లి హక్కు మరియు గర్భస్థ శిశువు హక్కు మధ్య సమతౌల్యం పాటించాలని అన్నారు. అ-బా-ర్ష-న్ కి పర్మిషన్ ఇస్తే ‘మెడికల్ టె-ర్మి-నే-ష-న్ ఆఫ్ ప్రెగ్నెన్సీ’ చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 5 లను ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. ఈ మహిళ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చును గవర్నమెంట్ భరిస్తుందని పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన తరువాత తాను పెంచుకోవాలా లేదా ఎవరికైనా దత్తత ఇవ్వాలా అనే విషయం పై తల్లిదండ్రులు డిసిషన్ తీసుకోవచ్చని పేర్కొన్నారు.
దసరా పండుగ కానుకగా ఆడియెన్స్ కు వినోదాలను పంచడం కోసం తెలుగులో ఆసక్తికర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా మూడు పెద్ద సినిమాల మధ్య పోటీ ఉండబోతుంది. రెండు తెలుగు చిత్రాలు కాగా, ఒకటి డబ్బింగ్ సినిమా, ముగ్గురు స్టార్ హీరోలే కావడం విశేషం.
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ హయివ్ అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
మాస్ మహారాజ రవితేజ మొదటిసారిగా నటించిన పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరావు. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ నార్త్ లో ప్రమోషన్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక మూడవ సినిమా కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి నటించిన లియో. ఈ సినిమా పై దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ ఏడాది ఎదురుచూస్తున్న సినిమాలలో లియో కూడా ఒకటి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలలో నటించారు.
1. భగవంత్ కేసరి:
జాతీయ చలనచిత్ర అవార్డులను భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటిగా పరిగణిస్తారు. మొదటిసారి జాతీయ అవార్డులను 1954లో అందించారు. ఈ అవార్డులను భారతీయ కళలు మరియు సంస్కృతిని కలిగి ఉన్న సినిమాలకు, దేశీయ వ్యక్తులు దర్శకత్వం వహించిన సినిమాలను గౌరవించడానికి మరియు ప్రోత్సహించడం కోసం ఈ అవార్డులు ప్రవేశపెట్టారు.
1973 నుండి ఈ అవార్డు వేడుకలు భారత ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ వేడుకను న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. ఈ వేడుకలో విజేతలకు భారత రాష్ట్రపతి అవార్డులను ప్రధానం చేస్తారు. ఈ వేడుక తరువాత నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో జాతీయ అవార్డులు గెలుచుకున్న సినిమాలను ప్రదర్శిస్తారు.
జాతీయ చలనచిత్ర అవార్డులు రెండు ప్రధాన విభాగాలగా ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్లు మరియు నాన్-ఫీచర్ ఫిల్మ్లు. ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద విజేతలను 13 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఎంపిక చేస్తుంది. నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో విజేతలను 5 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఎంపిక చేస్తుంది. జాతీయ అవార్డుకు సెలెక్ట్ కావడం కోసం పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది. వీటి ప్రకారం ఎంట్రీకి పంపించే సినిమా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందాలి.
అప్పుడే ఈ పోటీలో పాల్గొనే అర్హత ఉంటుంది. ఈ పోటీలోకి వచ్చే సినిమాలు ఇండియాలోనే నిర్మించబడాలి. సినిమాకు విదేశీ సంస్థ సహ-నిర్మాతగా ఉంటే, మరో 6 షరతులను నెరవేర్చాల్సి ఉంటుంది. అన్ని షరతులను పూర్తి చేసిన తర్వాత, సినిమా ఎంట్రీ లిస్ట్ కి అర్హత పొందింది. పోటీలో పాల్గొనే సినిమాకి భారతీయుడు దర్శకత్వం వహించి ఉండాలి. సినిమా పోటీలో ఎంట్రీ పొందడానికి ఇది ముఖ్యమైనది.
కోలీవుడ్ సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలుగు ఆడియెన్స్ కు ఖైదీ మూవీతో పరిచయం అయ్యారు. ఆ తరువాత మాస్టర్, విక్రమ్ సినిమాలతో పెద్ద సంఖ్యలో అభిమానులు అయ్యారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీలో వచ్చే సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే లోకేష్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా కార్తీ నటించిన ఖైదీ మూవీ అని చాలామంది అనుకుంటారు. అయితే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా మానగరం. ఈ చిత్రం 2017 లో తమిళంలో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది.
ఆ సినిమానే తెలుగులో ‘నగరం’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీలో తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా, శ్రీ నటించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, శ్రీ అనే యువకుడు జాబ్ కోసం నెల్లూరు నుంచి చెన్నైకి వస్తాడు. ఒక సాఫ్ట్వేర్ సంస్థకి అతనికి జాబ్ వస్తుంది. రెజీనా అదే కంపెనీలో హెచ్ఆర్. ఆమె క్లాస్మేట్ అయిన సందీప్ కిషన్ లవ్ చేస్తున్న అంటూ వెంటపడుతుంటాడు. రెజీనాకు అతనంటే ప్రేమ ఉన్నా, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుండడం ఆమెకు నచ్చదు. సందీప్ తో గోడవపడిన కొందరు సందీప్ అనుకొని శ్రీని కొడతారు.
అయితే ఆ గొడవలో అతని ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోతాయి. అతను జాబ్ లో చేరాలంటే సర్టిఫికేట్స్ అవసరం. ఇది ఇలా ఉంటే, ఆ నగరంలో కొందరు గూండాలు ఒక అబ్బాయిని కిడ్నాప్ చేయాల్సింది. పొరపాటునా ఆ ప్రాంత డాన్ పీకేపీ(మధుసూదన్) అబ్బాయిని కిడ్నాప్ చేస్తారు. ఆ నగరానికి క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడం కోసం వచ్చిన చార్లే పీకేపీకి సంబంధించిన కారును రెంట్ కు తీసుకుంటాడు. సందీప్ కి రౌడీలతో ఉన్న గొడవ ఏమిటి? శ్రీ సర్టిఫికేట్స్ దొరికాయా? రెజీనా, సందీప్ ల ప్రేమ ఫలిస్తుందా? చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
మాజీ ముఖ్యమంత్రి, టీడిపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నెలరోజులు దాటిన ఆయనకు బెయిల్ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు, ఆయన అభిమానులు నిరసనలు, ఆందోళన తెలుపుతున్నారు. ఏపీలోనే కాకుండా హైదరాబాద్ లో, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా ఆయన మద్ధతుదారులు నిరసనలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు స్త్రీల మధ్య మాటలు కలిశాయి. ఈ క్రమంలో వారిద్దరూ చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యి నెల దాటినా, ఇప్పటికి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించలేదని వారి ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు. చంద్రబాబు అరెస్టు పై ఇప్పటికీ రెస్పాండ్ కాలేదు అని తిడుతూ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ను వెళ్ళగక్కారు. వారిలో ఒక మహిళ, నోరు తెరిస్తే ధర్మం, హిందుత్వం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రధాని,
తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే అరాచకాల గురించి ఒక్కసారైన మాట్లాడలేదని అన్నారు. ఇండియా వరల్డ్ లో టాప్ 3 ప్లేస్ కి వచ్చిందని అంటారు. కానీ రోడ్ల పై నడిచే మహిళలకు టాయిలెట్లు కూడా లేని పరిస్థితిలో ఉందని ఇంకో మహిళ అన్నారు. ప్రపంచంలో 3 స్థానం కాదు, ముందు రోడ్ల పై వెళ్ళే స్త్రీల కోసం టాయిలెట్లు కట్టించి, గొప్పలు చెప్పుకోవాలి అని తన కోపాన్ని బయటపెట్టింది. వీళ్ల సీరియస్ చర్చను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎలెక్షన్స్ కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలోని హామీలలో ఒకటైన ఆసరా పెన్షన్ను కూడా పెంచుతున్నట్టు ప్రకటించారు. రూ. 2016 గా ఉన్న పెన్షన్ను ఐదు వేలకు పెంచుతామని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3000కు పెంచుతామని, ఆ తరువాత ఏడాది ఐదు వందల చొప్పున పెంచుకుంటూ, చివరి ఏడాది వచ్చే వరకు ఐదు వేలు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ మాట్లాడుతూ, ఇదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పింఛన్ పథకాన్ని సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. తాము ప్రకటించినపుడే, 2 వేల పింఛన్ను ప్రకటించి, సంవత్సరానికి 500 చొప్పున పింఛన్ను పెంచుతూ, ప్రస్తుతం మూడు వేలు ఇస్తున్నారని వెల్లడించారు.
ఈ పథకాన్ని విజయవంతంగా ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని, తాము కూడా అదే పద్ధతిలో ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.తమ పథకాల అమలులో దేశానికి తెలంగాణే ఆదర్శంగా నిలిచిందని ప్రతిసారి చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్, తానే స్వయంగా, ఏపీ గవర్నమెంట్ ని ప్రశంసించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఫాలో కానున్నట్టుగా కూడా ప్రకటించారని తెలుస్తోంది.
ఈరోజు ఎపిసోడ్ లో డిన్నర్ చేయడానికి అందరూ కూర్చుంటారు. ఆ సమయంలోనే మహేంద్ర బాగా తాగి, తులుతూ ఇంటికి వస్తాడు. కింద పడిపోబోతుంటే, రిషి పరుగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాడు. ధరణీ, వసు, శైలేంద్ర, ఫణేంద్ర అక్కడికి వెళతారు. మహేంద్ర రిషీతో నువ్వు న్నాను పడి పోనివ్వవు అని తెలుసు నాన్నా, నువ్వు ఉన్నావనే నాకు ధైర్యం నాన్నా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. రిషి, మహేంద్రను లోపలికి రమ్మని పిలుస్తాడు. దానికి మహేంద్ర ఇంటికి రాకూడదని అనుకున్నాను.
కానీ నువ్వు నా గురించి రోడ్డు పైన వెతుకుతుంటావు ఉంటావు. అందుకే నువ్వు బాధపడతావని ఇంటికి వచ్చాను నాన్నా అంటూ కన్నీరు పెట్టుకుంటాడు. తండ్రిని అలా చూసి రిషి బాధపడుతాడు. వసు, ధరణీ, ఫణేంద్ర బాధ పడుతుంటే, దేవయానికి శైలేంద్ర సైగ చేస్తాడు. దాంతో దేవయాని మహేంద్ర తాగి ఇంటికి వచ్చినందుకు మండిపడుతుంది. తన మాటలతో మహేంద్రని దేవయాని అవమానిస్తుంది. జగతి సమయం అయిపోవడంతో, వెళ్ళిపోయింది.
4 రోజులు ఏడ్చి, ఆ విషయాన్ని మర్చిపోయి, పనులు చేసుకోవాలి. కానీ రోజు తాగి ఇంటికి వస్తుంటే, ఎలా ఉంటుంది. బాధ ఉంటే, తాగి తందనాలు ఆడాలా? అని కోపంగా దేవయాని అనడంతో రిషికి చాలా కోపం వస్తుంది. దేవయాని కోపంగా ఇక ఈ ఇంట్లో ఉండలేను,ఈ దారణం రోజు చూడలేను అని అంటుంది. దాంతో కోపంగా ఉన్న రిషి పెద్దమ్మా మీరు బయటకు వెళ్లనవసరం లేదు. మేమే వెళ్తాం అంటూ రిషి తండ్రిని, భార్యని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు.
# స్మోకింగ్ సమస్య: మొదటి పాట నా రెడీ రిలీజ్ అయ్యింది. ఈ పాట రిలీజ్ అయిన 5 రోజుల్లోనే యూట్యూబ్లో 33 మిలియన్ల వ్యూస్ను మరియు 1.9 మిలియన్ లైక్స్ను సాధించింది. ఈ పాటకు ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాటలో విజయ్ దళపతి స్మోక్ చేస్తారు. విజయ్ స్మోక్ చేయడం వివాదాస్పదం అయ్యింది. ఈ విషయం పై పలువురు కేసు వేశారు.
#లిరిక్స్ సమస్య: లియో మూవీలోని ఫస్ట్ సింగిల్ నా రెడీ లిరిక్స్ కూడా వివాదాస్పదం అయ్యింది. ‘ధూమపానం, మాదక ద్రవ్యాల వినియోగం మరియు రౌడీయిజాన్ని పొగుడుతూ’ తీశారని, విజయ్ పై చర్య తీసుకోవాలని తమిళనాడులో ఫిర్యాదు దాఖలైంది.
#ఆడియో లాంచ్ ఈవెంట్: లియో మూవీ ఆడియో మరియు ప్రీరిలీజ్ ఈవెంట్లు కలిపి ప్లాన్ చేశారు. కానీ పలు కారణాలతో ఆ ఈవెంట్ రద్దు అయ్యింది.