కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీగా పై ఇండియావైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ పెయిర్ గా పేరుగాంచిన విజయ్ దళపతి, త్రిష పద్నాలుగేళ్ళ తర్వాత ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు.
తాజాగా విడుదల అయిన ఈ మూవ ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది. ఓవర్సీస్ లో బుకింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ మూవీ పై మరిన్ని అంచనాలను పెంచింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ మూవీ ఆ తెలుగు సినిమా కాపీ అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ తెలుగు సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలు కొన్నేళ్ళ నుండి ఫలితాలతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ సాధించి రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఆయన సినిమాలకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. విజయ్ లేటెస్ట్ మూవీ లియో అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇటీవల కాలంలో ఏ తమిళ సినిమాకి లేనంత హైప్ లియో సినిమా పై నెలకొంది. అయితే సోషల్ మీడియాలో ఈ మూవీ తెలుగు సినిమా కాపీ అని చర్చ జరుగుతోంది. ఆ తెలుగు మూవీ ఏమిటంటే 2010లో వచ్చిన గాయం 2. రామ్ గోపాల్ వర్మ ఈ మూవీని సమర్పించగా, ప్రవీణ్ శ్రీ డైరెక్షన్ లో తెరకెక్కింది.
గాయం 2 మూవీని హాలీవుడ్ సినిమా ‘ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్’ ఆధారంగా తీశారు. కట్ చేస్తే, లియో ట్రైలర్ కి గాయం 2కి పోలికలు ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ హిల్ స్టేషన్ లో హోటల్ రన్ చేయడం, భయపడుతూ బ్రతకడం, ప్రత్యర్థులు వచ్చి అటాక్ చేస్తే తప్పించుకోవడం, ఆఖరికి ఎదురు తిరగడం లాంటివి ట్రైలర్ లో చూపించారు. ఆ సీన్స్ ని, గాయం 2 సీన్స్ ను పోలుస్తూ రెండింటి వీడియోస్ ను నెట్టింట్లో షేర్ చేస్తూ, కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/gully_poragadu/status/1710889609088184487
Also Read: అనుష్క నుండి అనన్య వరకు… తెలుగు ఇండస్ట్రీకి “పూరి జగన్నాధ్” పరిచయం చేసిన 15 మంది హీరోయిన్లు వీరే.!

నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం నాడు గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రెండున్నర నిముషాల నిడివి గల ట్రైలర్ లో బాలయ్య, శ్రీలీల తండ్రి కూతుర్లుగా కనిపించారు. బాలయ్య పక్కా తెలంగాణ యాసతో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. విలన్ కు సవాలు విసిరే సీన్స్ లో, బిడ్డ శ్రీలీల గురించి తల్లడిల్లిపోయే సన్నివేశాలలో బాలకృష్ణ విశ్వరూపం చూపించాడు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరో వైపు సోషల్ మీడియాలో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. భగవంత్ కేసరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా రొటీన్ గా ఉందని, పాత సినిమాలలోని మ్యూజిక్ నే కొంచెం అటు ఇటుగా మార్చి ఇచ్చారని కామెట్లు చేస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరో అర్జున్ రాంపాల్ ను విలన్ గా సెలెక్ట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు.
ఆస్ట్రేలియాతో ఆదివారం నాడు జరిగిన వరల్డ్కప్ మ్యాచ్లో ఆరంభంలోనే వరుసగా ముగ్గురు పరుగులు ఏమి చేయకుండానే అవుట్ అయ్యారు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లి 85 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 97 నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో రాహుల్ ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించిన రాహుల్, మూడు పరుగుల తేడాతో శతకాన్ని చేసే ఛాన్స్ ను కోల్పోయాడు.
విన్నింగ్ షాట్ తరువాత ఒక్కసారిగా రాహుల్ కింద కూర్చున్నాడు. ఫోర్ వెళ్తుందనుకున్న షాట్, సిక్స్ వెళ్లడంతో తనలో తానే నవ్వుకున్నాడు. అదే సమయంలో రాహుల్ ఫేస్ లో సెంచరీ కోల్పోయాను అనే బాధ స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ తరువాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకునే సందర్భంగా రాహుల్ సెంచరీ మిస్ అవడం పై మాట్లాడుతూ, నిజానికి సెంచరీ తన ప్రణాళికలో ఉందని, సెంచరీని పూర్తి ఎలా చేయాలనేది ఆలోచించాను.
ముందు బౌండరీ, ఆ తరువాత సిక్సర్తో సెంచరీ సాధ్యపడుతుందని భావించానని, అయితే మొదటిదే సిక్సర్గా వెళ్లిందని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ కావడానికి కారణం హార్దిక్ పాండ్యా అని నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హార్దిక్ సిక్స్ కొట్టకకుండా ఉంటే రాహుల్ సులభంగా సెంచరీ చేసేవాడని కామెంట్స్ చేస్తున్నారు. పాండ్యా మోస్ట్ సెల్ఫిష్ క్రికెటర్ అని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకుముందు తిలక్ వర్మ విషయంలో కూడా ఇలానే చేశాడని, ఐపీఎల్లో ఇలాంటివి చాలాసార్లు చేశాడని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
టాలీవుడ్ లో ఇప్పటివరకు కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. యువతను ఫిదా చేశాయి. అలాంటి సినిమానే మ్యాడ్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ యూత్ ను ఆకట్టుకుంది. కాలేజీలో గ్యాంగ్స్, సీనియర్లు, జూనియర్లు, ర్యాగింగ్, గొడవలు. ప్రేమలు వంటివాటిని ట్రైలర్ చూపించారు.
నేడు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో నటించిన ముగ్గురి హీరోలలో డీడీగా నటించిన యాక్టర్ తన నటనతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడని టాక్. మూవీ చూసిన ఆడియెన్స్ సైతం అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రివ్యూయర్స్ సైతం ఆ కుర్రాడి స్టైల్, కామిడి టైమింగ్, డైలాగ్ డెలివరీ ని మెచ్చుకుంటున్నారు.
ఆ నటుడి పేరు సంగీత్ శోభన్. అతను ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించి అలరించాడు. మ్యాడ్ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో తెలుగు ఇండస్ట్రీకి మంచి కామెడీ హీరో లభించాడు అనుకునేలా నటించాడు. సంగీత్ శోభన్ మరేవరో కాదు యంగ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు మరియు దివంగత డైరెక్టర్ శోభన్ రెండవ కుమారుడు. అన్నయ్య సంతోష్ హీరోగా సీరిస్, సినిమాలలో నటిస్తుంటే, తమ్ముడు సంగీత్ కామెడీ సిరీస్ లలో, సినిమాలలో నటిస్తున్నాడు.
కలర్స్ స్వాతి యాంకర్, హీరోయిన్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో స్వాతి వికాస్ అనే వ్యక్తిని ఆగస్టు పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం అయ్యింది. చాలా గ్యాప్ తరువాత మంత్ ఆఫ్ మధు మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, వైజాగ్ లో నివసించే మధుసూధన్ రావు(నవీన్ చంద్ర) తన గవర్నమెంట్ జాబ్ ను పోగొట్టుకుంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేఖ (స్వాతి రెడ్డి) విడాకుల కోసం కోర్టుకు వెళ్తుంది. అయితే మధుసూధన్ తన భార్య ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకంతో వెయిట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను మద్యానికి బానిస అవుతాడు. ఇది ఇలా ఉంటే, యూఎస్ లో సెటిల్ అయిన మధుమతి(శ్రియ నవిలే) అనే అమ్మాయి బంధువుల ఇంట్లో వివాహానికి వైజాగ్ వస్తుంది.
అయితే ఒక సందర్భంలో మధుమతికి మధుసూధన్ తో పరిచయం అవుతుంది. ఒకసారి మాటల సందర్భంలో మధుసూధన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆమెకు తెలుస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? లేఖ ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంది? ఆఖరికి లేఖ మధుసూదన్ కలిశారా? అనేది మిగిలిన కథ. మంత్ ఆఫ్ మధు సినిమా అనేది అమెరికా నుంచి వైజాగ్ కి వచ్చిన మధుమతి నెల రోజుల్లో ఎదుర్కొన్న అనుభవాలే ఈ మూవీ.
“అఖండ” బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన మరో మాస్ ఎంటర్ టైనర్ స్కంద. బోయపాటి శ్రీను మూవీ అంటే తప్పకుండా మాస్ ఎలిమెంట్స్ అధికంగా ఉంటాయి. ఊహకు అందని రీతిలో బోయపాటి తన చిత్రాలలో ఫిక్షన్ను జోడిస్తారు. కానీ, స్కంద మూవీలో అది అతి అయ్యిందని ప్రేక్షకుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.
రొటీన్ స్టోరీని కూడా విపరీతమైన వయొలెన్స్తో చూపించారని, మూవీలో పెద్దగా ఏమీ లేదని నెటిజెన్లతో పాటు విమర్శకులు కూడా అంటున్నారని టాక్. స్కంద మూవీలో హీరో రామ్ రెండు పాత్రలు చేసినట్టు తెలుస్తోంది. ఒక పాత్ర కాలేజీలో చదువుకునే యువకుడిగా నటిస్తే, మరో పాత్ర మొరాకోలో పేరుగాంచిన హంతకుడు. కాలేజీ స్టూడెంట్ గా నటించిన పాత్ర పేరు భాస్కర్ రాజు.
తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె శ్రీలీలా రెడ్డిని ప్రేమిస్తాడు. ఇక మొరాకో నుండి వచ్చిన రామ్ క్యారెక్టర్ పేరు మణికంఠ స్కందరాజు. శ్రీలీలా రెడ్డి క్యారెక్టర్ లో హీరోయిన్ శ్రీలీల నటించింది. ఈ మూవీ 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 47 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.


గుప్పెడంత మనసు స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రిషి, వసు లవ్ స్టోరీ, తల్లీకొడుకుల సెంటిమెంట్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సీరియల్ కు వంద ఎపిసోడ్స్ వరకు కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర తెరకెక్కించారు. ఆ తరువాత కుమార్ పంతం డైరెక్ట్ చేస్తున్నారు.
అప్పటి నుంచి ఈ సీరియల్ టాప్ రేటింగ్ లో కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్కి చాలా పోటీ ఇచ్చింది. ఒకానొక సమయంలో గుప్పెడంత మనసు ‘కార్తీక దీపం’ సీరియల్ ను మించుతుందేమో అనేట్టుగా కుమార్ పనిచేశారు. కార్తీక దీపం సీరియల్ కి ఎండ్ కార్డు పడిన తరువాత. అదే టైమ్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ను అద్భుతంగా కుమార్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సీరియల్ గత కొన్ని నెలలుగా టీఆర్పీలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. కార్తీక దీపం సీరియల్ ను ఆడియెన్స్ ఎంతగా ఆదరించారో తెలిసిందే. ఆ సీరియల్ ను ప్రేక్షకులకు గుర్తు రాకుండా ఇంట్రెస్టింగ్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ బ్రహ్మముడి దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అతను ప్రముఖ సీరియల్ నటి కిరణ్మయి భర్త. ఆమె ఎన్నో సీరియల్స్ లో నటించింది.
ఈ ఏడాది విజయ్ దళపతి నటించిన వారసుడు వంటి రొటీన్ కంటెంట్ మూవీ అయినా తెలుగులో మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలో త్వరలో రిలీజ్ కాబోయే లియో మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ రైట్స్ కోసం సితార సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. తమిళ స్టార్ విజయ్ దళపతి, లోకేష్ కనకరాజ్ కాంబోలో ఈ మూవీ తెరకెక్కింది.
తాజాగా రిలీజ్ అయిన లియో ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. అయితే ఈ ట్రైలర్ లో అర్జున్ సర్జా, సంజయ్ దత్, హీరోయిన్ త్రిషతో పాటు కనిపించిన ఈ వ్యక్తి మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ మరియు నటుడు శాండీ మాస్టర్. అతను తమిళ సినీ ఇండస్ట్రీలో మరియు టెలివిజన్ లో కూడా పనిచేస్తున్నాడు. శాండీ 2005 లో కలైంజర్ టీవీలో ప్రసారమైన పాపులర్ డ్యాన్స్ షో ‘మానాడ మయిలాడ’ సీజన్ 1లో కొరియోగ్రాఫర్గా కెరీర్ను ప్రారంభించాడు.
ఆ షోలో విజేతగా నిలిచాడు. ఆ తరువాత ‘మానాడ మయిలాడ’ వివిధ సీజన్లలో న్యాయనిర్ణేతల ప్యానెల్లో ఒకరిగా పనిచేశారు. 2019లో జరిగిన బిగ్ బాస్ తమిళ వెర్షన్లో కంటెస్టెంట్గా పాల్గొన్న తర్వాత శాండీ మాస్టర్ బాగా పాపులర్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలకి కొరియోగ్రాఫర్ చేస్తూనే సినిమాలలో కూడా నటించడం ప్రారంభించాడు. ‘ఇవనుకు తన్నిల గండం’ అనే తమిళ చిత్రంతో నటుడుగా కెరీర్ మొదలుపెట్టాడు. పలు సినిమాలలో గెస్ట్ రోల్ లో కనిపించిన శాండీ మాస్టర్ లియో మూవీలో నటించాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శాండీ మాస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
ఈ సంఘటన 2018 లో ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హెడ్ మాస్టర్ పేరు డి బాలు. తమిళనాడులోని విల్లుపురంలో మునిసిపల్ సెకండరీ పాఠశాలకు హెడ్ మాస్టర్ పనిచేస్తున్నారు. ఆయన పనిచేస్తున్న పాఠశాలకు ఆ ప్రాంతంలోని విద్యార్థులు హాజరుకాకపోవడం అనేది అక్కడ చాలా సాధారణ విషయం. దాంతో విద్యార్థులు పాఠశాలకు తీసుకురావడానికి ప్రత్యేకంగా ఏదైనా చేయాలని, అక్కడ ఉన్న కట్టుబాటును మార్చాలని డి బాలు నిర్ణయించుకున్నారు.
ఆ హెడ్ మాస్టర్ వయసు 56 ఏళ్ళు , ఆయన గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. చదువు మీద ఇంట్రెస్ట్ లేక పాఠశాల మానేసిన పిల్లలు, పాఠశాలకు హాజరు కానీ విద్యార్థులు, చదువును నిర్లక్ష్యం చేసే విద్యార్థుల ఇళ్ళకు ఆ హెడ్ మాస్టర్ ప్రతిరోజూ వెళతాడు. విద్యార్థుల తల్లిదండ్రులను పిల్లలను పాఠశాలకు పంపించమని వారిని అభ్యర్థిస్తాడు. ఒక విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లడం లేదు. దాంతో బాలు మోకాళ్ళపై కూర్చుని చేతులు జోడించి చదువుకోమని వేడుకుంటున్నాడు.
విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, బాగా చదువుకుని జీవితంలో పురోగతి సాధించాలని చెప్తూ బతిమిలాడుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. విద్యార్థుల ఫ్యూచర్ కోసం ఈ హెడ్ మాస్టర్ గారు చేస్తున్న పనికి నెటిజెన్లు అభినందిస్తూ కామెంట్లు పెట్టారు.